అన్వేషించండి

TTD Board Meeting : సామాన్య భక్తులకే ప్రాధాన్యత, స్పెషల్ దర్శనాలు కుదింపు- టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే!

TTD Board Meeting : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


TTD Board Meeting : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం శనివారం జరిగింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో పాలక మండలి భేటీ అయింది. ఈ భేటీలో 65 అంశాలపై చర్చించిన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  వేసవి సెలవుల్లో భక్తుల రద్దీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు తగ్గించాలని నిర్ణయించింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రత్యేక దర్శనాలు కుదించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నడకదారి భక్తులకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం విజయవంతంగా జరిగాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.  లడ్డు ప్రసాదం తయారీకి కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంటలు ఉపయోగించాలని  నిర్ణయం తీసకున్నారు. దీని కోసం ధరలపై పాలకమండలిలో చర్చించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

గంగమ్మ ఆలయానికి రూ3.12 కోట్లు 

"టీటీడీ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ ఆధునీకరణకి రూ.14 కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి రూ3.12 కోట్లు కేటాయిస్తాం. తిరుపతి విద్యాసంస్థలలో కాంట్రాక్ట్ సిబ్బంది కొనసాగిస్తూ, అవసరమైన శాశ్వత ఉద్యోగుల నియమించాలని నిర్ణయించాం. దిల్లీ ఎస్వీ కాలేజ్ లో ఆడిటోరియం అభివృద్ధి 4.13 కోట్లు కేటాయించాం. దిల్లీలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహా మే నెల 3 నుంచి 16 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన నిధులు మంజూరు చేయాలని నిర్ణయించాం. సాంకేతిక కారణంగా ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతుంది. విదేశీ కరెన్సీ మార్పిడికి అనుమతులు వచ్చాయి. పారిన్ కరెన్సీ పై వచ్చే వడ్డీపై కూడా సమాచారం ఇవ్వాలని కేంద్రం కోరింది." -  వైవీ.సుబ్బారెడ్డి,  టీటీడీ పాలక మండలి ఛైర్మన్ 

12 రకాల ఉత్పత్తుల కొనుగోలు 

శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో రూ.53.62 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్‌ పరిధిలో గల శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో టీబీ, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేశామన్నారు. టీటీడీ అవసరాలకు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్  ఫెడ్ తో చర్చించేందుకు  టీటీడీ బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. అలిపిరి  మార్కెటింగ్‌ గోడౌన్‌ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్‌ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు టీటీడీ మంజూరు చేసిందన్నారు. గుంటూరుకు చెందిన దాత ఆలపాటి తారాదేవి రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి అందించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం ముద్ర వేశారు. 

రూ. 3 కోట్లు చెల్లింపులు 

 ఎఫ్.సి.ఆర్.ఏ (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించడానికి టీటీడీకి అనుమతి ఉందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  ఈ అనుమతి 2020 జనవరికి ముగిసిందని చెప్పిన ఆయన...దీనిని రెన్యువల్ చేసుకోవడానికి టీటీడీ దరఖాస్తు చేసిందని గుర్తు చేశారు. పలు దఫాలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించామన్నారు. ఎఫ్.సి.ఆర్.ఏ, రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టాల మధ్య ఉన్న సాంకేతిక కారణాల వల్ల విరాళాల డిపాజిట్లపై వచ్చే వడ్డీని చూపించడంలో కొన్ని అభ్యంతరాలు తెలిపారని ఇది సాంకేతిక కారణం మాత్రమేనన్నారు. ఎఫ్.సి.ఆర్.ఏ అధికారుల సూచన మేరకు త్వరగా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.3 కోట్లు చెల్లిస్తామన్నారు.  ఇందుకోసం చెల్లించిన రూ.3 కోట్ల సొమ్మును తిరిగి పొందడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Hyderabad Latest News: హైదరాబాద్‌ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?
హైదరాబాద్‌ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?

వీడియోలు

Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Hyderabad Latest News: హైదరాబాద్‌ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?
హైదరాబాద్‌ దాహం తీర్చేందుకు సరికొత్త ప్లాన్! ఇంటింటికీ 24/7 నీరు ఎప్పటి నుంచి అంటే?
The Raja Saab Director: ప్రభాస్ మీడియం రేంజ్ హీరోనా? కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి
ప్రభాస్ మీడియం రేంజ్ హీరోనా? కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి
Happy New Year 2026 : న్యూ ఇయర్ క్రేజీ ట్రెడీషన్స్.. 12 ద్రాక్షల నుంచి రెడ్ కలర్ ఇన్నర్ వేర్ వరకు, ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం
న్యూ ఇయర్ క్రేజీ ట్రెడీషన్స్.. 12 ద్రాక్షల నుంచి రెడ్ కలర్ ఇన్నర్ వేర్ వరకు, ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం
Germany bank Robbery: మనీహీస్ట్ ను సీరియస్‌గా తీసుకున్నారు - పండగరోజు బ్యాంకును లూఠీ చేసేశారు - జర్మనీలోనే !
మనీహీస్ట్ ను సీరియస్‌గా తీసుకున్నారు - పండగరోజు బ్యాంకును లూఠీ చేసేశారు - జర్మనీలోనే !
Bhimili TDP issue: భీమిలి టీడీపీ టిక్కెట్‌పై గంటా, భరత్ మధ్య చిచ్చు ప్రచారం - వాళ్లిద్దరి స్పందన హైలెట్
భీమిలి టీడీపీ టిక్కెట్‌పై గంటా, భరత్ మధ్య చిచ్చు ప్రచారం - వాళ్లిద్దరి స్పందన హైలెట్
Embed widget