అన్వేషించండి

Ongole CM Convoy Incident : అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలేశారు, ఇలా మరొకరికి జరగకూడదు : ఒంగోలు ఘటన బాధితుల తీవ్ర ఆవేదన

Ongole CM Convoy Incident : సీఎం కాన్వాయ్ కోసం ఓ కుటుంబాన్ని అర్ధరాత్రి నడిరోడ్డుపై దింపేశారు ఆర్టీవో అధికారులు. ఈ ఘటనపై బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Ongole CM Convoy Incident : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తోన్న భక్తులపై ఒంగోలు ఆర్టీవో అధికారుల ఓవరాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాసుల కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనార్ధం బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఇన్నోవా వాహనాన్ని బుక్ చేసుకుని తిరుమలకు బయలుదేరారు. రాత్రి పది గంటల సమయంలో ఒంగోలు చేరుకున్న వారు టిఫిన్ కోసం వాహనాన్ని ఆపారు. అదే సమయంలో ఆర్టీవో కార్యాలయానికి చెందిన ఓ కానిస్టేబుల్ కారుతో పాటుగా డ్రైవర్ ను తీసుకెళ్లాడు. మరికొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చిన కానిస్టేబుల్ కారులో‌ నుంచి లగేజీ తీసుకోవాలని శ్రీనివాసులుకు చెప్పారు.

సీఎం పర్యటన నేపథ్యంలో ట్రైయల్ రన్ కు ఇన్నోవా వాహనం అవసరం ఉందని చెప్పి నడి రోడ్డుపై ఓ కుటుంబాన్ని దించేసి కారు తీసుకెళ్లారు. ఆ సమయంలో మరొక వాహనం దొరక్క శ్రీనివాసుల కుటుంబం మహిళలు, పిల్లలతో పాటుగా సమీపంలోని బస్టాండ్ లో నిరీక్షించాల్సి వచ్చింది. మరొక వాహనాన్ని బుక్ చేసుకుని తిరుమలకు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఆర్టీవో అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజలను నడి రోడ్డుపై దింపిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎంవో అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు ఆర్టీవో అధికారుల వ్యవహారశైలితో తాము అర్ధరాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని, దీనిపై స్పందించిన సీఎం అధికారులపై చర్యలు చేపట్టడం ద్వారా మరోకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని బాధితులు అంటున్నారు..

అధికారులే ఇలా చేస్తే ఎలా? 

"ఒంగోలులో రాత్రి పది గంటల సమయంలో టిఫెన్ చేసేందుకు ఆగాం. ఆర్టీవో కానిస్టేబుల్ వచ్చి వెహికల్ తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి లగేజీ తీసుకోవాలన్నారు. ఎందుకని అడిగితే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ కోసం వెహికల్ ఉంచుకుంటున్నామన్నారు. ఏదైనా వాహనం ప్రొవైడ్ చేయాలని కోరాం. ఏం చేయలేం అని కానిస్టేబుల్ అన్నారు. రాత్రి పది గంటలకు చిన్న పిల్లలతో నడిరోడ్డుపై ఉండిపోయాం. తిరిగి వినుకొండకు ఫోన్ చేసి మరో వాహనాన్ని బుక్ చేసుకున్నాం. అధికారులే ఇలా చేస్తే ఎలా?" శ్రీనివాసులు, బాధితుడు 

ఈ నష్టాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు 

"రాత్రి నడిరోడ్డుపై పిల్లలతో ఇబ్బంది పడ్డాం. ఆడవాళ్లలను ఇలా రాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఇంకో వాహనాన్ని బుక్ చేసుకుని ఊరి చివరికి రమ్మని అక్కడ ఎక్కాం. మళ్లీ ఆ వాహనాన్ని ఎవరు తీసుకుంటారో అనే భయంతో వెళ్లాం. ఇది సీఎం వరకు వెళ్లదు. వెళ్లనివ్వరు. సీఎం గారు ఇలాంటి వారిటి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మేము మధ్యతరగతి వాళ్లమే. మరొకరి కింద పనిచేస్తున్న వాళ్లం. ఇప్పుడు రెండు వాహనాలు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ నష్టం ఎవరు భరిస్తారో తెలియదు" బాధితురాలు 

Ongole CM Convoy Incident : అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలేశారు, ఇలా మరొకరికి జరగకూడదు : ఒంగోలు ఘటన బాధితుల తీవ్ర ఆవేదన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Happy Dussehra 2025 : దసరా శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్​బుక్​ ద్వారా విజయదశమి విషెష్ ఇలా చెప్పేయండి
దసరా శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్​బుక్​ ద్వారా విజయదశమి విషెష్ ఇలా చెప్పేయండి
Happy Dussehra 2025: విజయదశమి రోజు మీరు తప్పనిసరిగా పఠించాల్సిన/వినాల్సిన అష్టకం ఇది!
విజయదశమి రోజు మీరు తప్పనిసరిగా పఠించాల్సిన/వినాల్సిన అష్టకం ఇది!
Kendriya Vidyalayas to Andhra Pradesh : శ్రీకాకుళం, చిత్తూరు ప్రజలకు గుడ్ న్యూస్ -ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం - కృతజ్ఞత చెప్పిన లోకేష్
శ్రీకాకుళం, చిత్తూరు ప్రజలకు గుడ్ న్యూస్ -ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం - కృతజ్ఞత చెప్పిన లోకేష్
Ravana Dahan : దసరా రోజు రావణుడిని కచ్చితంగా ఎందుకు దహనం చేస్తారో తెలుసా? దిష్టిబొమ్మ కాల్చడానికి కారణమదే
దసరా రోజు రావణుడిని కచ్చితంగా ఎందుకు దహనం చేస్తారో తెలుసా? దిష్టిబొమ్మ కాల్చడానికి కారణమదే
Advertisement

వీడియోలు

Dhanush Idly Kottu Movie Review In Telugu | ధనుష్, నిత్య మీనన్ ఇడ్లీ కొట్టు ఎలా ఉందంటే.? | ABP Desam
BCCI vs PCB | Asia Cup 2025 | ఆసియా కప్ ట్రోఫీపై ముదురుతున్న వివాదం
India vs Sri Lanka Women World Cup | శ్రీలంకపై భారత్ విజయం
Asia Cup 2025 Ind vs Pak Controversy | ఆసియాక‌ప్ కాంట్రవర్సీపై మాజీ క్రికెట‌ర్ ఆవేద‌న‌
Women World Cup 2025 | Smriti Mandhana | ట్రోల్స్ ఎదుర్కొంటున్న స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy Dussehra 2025 : దసరా శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్​బుక్​ ద్వారా విజయదశమి విషెష్ ఇలా చెప్పేయండి
దసరా శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్​బుక్​ ద్వారా విజయదశమి విషెష్ ఇలా చెప్పేయండి
Happy Dussehra 2025: విజయదశమి రోజు మీరు తప్పనిసరిగా పఠించాల్సిన/వినాల్సిన అష్టకం ఇది!
విజయదశమి రోజు మీరు తప్పనిసరిగా పఠించాల్సిన/వినాల్సిన అష్టకం ఇది!
Kendriya Vidyalayas to Andhra Pradesh : శ్రీకాకుళం, చిత్తూరు ప్రజలకు గుడ్ న్యూస్ -ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం - కృతజ్ఞత చెప్పిన లోకేష్
శ్రీకాకుళం, చిత్తూరు ప్రజలకు గుడ్ న్యూస్ -ఏపీకి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించిన కేంద్రం - కృతజ్ఞత చెప్పిన లోకేష్
Ravana Dahan : దసరా రోజు రావణుడిని కచ్చితంగా ఎందుకు దహనం చేస్తారో తెలుసా? దిష్టిబొమ్మ కాల్చడానికి కారణమదే
దసరా రోజు రావణుడిని కచ్చితంగా ఎందుకు దహనం చేస్తారో తెలుసా? దిష్టిబొమ్మ కాల్చడానికి కారణమదే
Gandhi Jayanti 2025 : గాంధీ జయంతి శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్​బుక్​లో షేర్ చేయగలిగే కోట్స్, మెసేజ్​లు ఇవే
గాంధీ జయంతి శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్​బుక్​లో షేర్ చేయగలిగే కోట్స్, మెసేజ్​లు ఇవే
Medigadda Barrage Restoration:కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం- మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కార్ ఫోకస్! టెండర్లు వేయడానికి 15 వరకు గడువు
Women's Odi World Cup IND VS Pak Latest Updates: పాక్ మ‌హిళా జ‌ట్టుతో కూడా నో హ్యాండ్ షేక్.. బీసీసీఐ తాజా నిర్ణ‌యం..! కొలంబోలో ఆదివారం మ్యాచ్
పాక్ మ‌హిళా జ‌ట్టుతో కూడా నో హ్యాండ్ షేక్.. బీసీసీఐ తాజా నిర్ణ‌యం..! కొలంబోలో ఆదివారం మ్యాచ్
Andhra Pradesh Accident: పల్నాడులో దారుణ ఘటన: స్కూటర్‌ను ఢీకొట్టి  3 కి.మీ. లాక్కెళ్లిన బోలెరో - వైరల్ వీడియో
పల్నాడులో దారుణ ఘటన: స్కూటర్‌ను ఢీకొట్టి 3 కి.మీ. లాక్కెళ్లిన బోలెరో - వైరల్ వీడియో
Embed widget