By: ABP Desam | Updated at : 21 Apr 2022 04:07 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఒంగోలు ఘటన బాధితులు
Ongole CM Convoy Incident : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తోన్న భక్తులపై ఒంగోలు ఆర్టీవో అధికారుల ఓవరాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన శ్రీనివాసుల కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనార్ధం బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఇన్నోవా వాహనాన్ని బుక్ చేసుకుని తిరుమలకు బయలుదేరారు. రాత్రి పది గంటల సమయంలో ఒంగోలు చేరుకున్న వారు టిఫిన్ కోసం వాహనాన్ని ఆపారు. అదే సమయంలో ఆర్టీవో కార్యాలయానికి చెందిన ఓ కానిస్టేబుల్ కారుతో పాటుగా డ్రైవర్ ను తీసుకెళ్లాడు. మరికొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చిన కానిస్టేబుల్ కారులో నుంచి లగేజీ తీసుకోవాలని శ్రీనివాసులుకు చెప్పారు.
సీఎం పర్యటన నేపథ్యంలో ట్రైయల్ రన్ కు ఇన్నోవా వాహనం అవసరం ఉందని చెప్పి నడి రోడ్డుపై ఓ కుటుంబాన్ని దించేసి కారు తీసుకెళ్లారు. ఆ సమయంలో మరొక వాహనం దొరక్క శ్రీనివాసుల కుటుంబం మహిళలు, పిల్లలతో పాటుగా సమీపంలోని బస్టాండ్ లో నిరీక్షించాల్సి వచ్చింది. మరొక వాహనాన్ని బుక్ చేసుకుని తిరుమలకు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఆర్టీవో అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజలను నడి రోడ్డుపై దింపిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎంవో అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు ఆర్టీవో అధికారుల వ్యవహారశైలితో తాము అర్ధరాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని, దీనిపై స్పందించిన సీఎం అధికారులపై చర్యలు చేపట్టడం ద్వారా మరోకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని బాధితులు అంటున్నారు..
అధికారులే ఇలా చేస్తే ఎలా?
"ఒంగోలులో రాత్రి పది గంటల సమయంలో టిఫెన్ చేసేందుకు ఆగాం. ఆర్టీవో కానిస్టేబుల్ వచ్చి వెహికల్ తీసుకెళ్లారు. పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చి లగేజీ తీసుకోవాలన్నారు. ఎందుకని అడిగితే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ కోసం వెహికల్ ఉంచుకుంటున్నామన్నారు. ఏదైనా వాహనం ప్రొవైడ్ చేయాలని కోరాం. ఏం చేయలేం అని కానిస్టేబుల్ అన్నారు. రాత్రి పది గంటలకు చిన్న పిల్లలతో నడిరోడ్డుపై ఉండిపోయాం. తిరిగి వినుకొండకు ఫోన్ చేసి మరో వాహనాన్ని బుక్ చేసుకున్నాం. అధికారులే ఇలా చేస్తే ఎలా?" శ్రీనివాసులు, బాధితుడు
ఈ నష్టాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు
"రాత్రి నడిరోడ్డుపై పిల్లలతో ఇబ్బంది పడ్డాం. ఆడవాళ్లలను ఇలా రాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఇంకో వాహనాన్ని బుక్ చేసుకుని ఊరి చివరికి రమ్మని అక్కడ ఎక్కాం. మళ్లీ ఆ వాహనాన్ని ఎవరు తీసుకుంటారో అనే భయంతో వెళ్లాం. ఇది సీఎం వరకు వెళ్లదు. వెళ్లనివ్వరు. సీఎం గారు ఇలాంటి వారిటి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మేము మధ్యతరగతి వాళ్లమే. మరొకరి కింద పనిచేస్తున్న వాళ్లం. ఇప్పుడు రెండు వాహనాలు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ నష్టం ఎవరు భరిస్తారో తెలియదు" బాధితురాలు
Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!
Breaking News Live Updates: విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు
CRDA Innar Ring Road CID Case : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో జూన్ 9 వరకూ చర్యలొద్దు - సీఐడీని ఆదేశించిన హైకోర్టు
Kodali Nani : చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారు, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని హాట్ కామెంట్స్
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!