అన్వేషించండి

Dasapalla Lands Issue : అంతా సక్రమమే - దసపల్లా భూముల యజమానులు, బిల్డర్ల వివరణ ఇదిగో !

దసపల్లా భూముల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని యజమానులు, బిల్డర్లు స్పష్టం చేశారు. వారు సంయుక్తంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

 

Dasapalla Lands Issue :  విశాఖలో దసపల్లా భూములు కబ్జాకు గురయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఆ భూమి యజమానులు, వారితో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. దసపల్లా భూముల్లో అరవై ఐదు మందికి యజమానులుగా ఉన్నామని.. అందరం కలిసే డెవలప్‌మెంట్‌కు ఇవ్వాలని నిర్ణయించామని బాలాజీ అనే బిల్డర్ తెలిపారు. ఆయన భూ యజమానుల్లో ఒకరు.  సుప్రీం కోర్టు టైటిల్ నిర్ధారించాక భూముల 22 ఏ జాబితాలో  ఉన్నా ఇబ్బంది ఎదురవుతుందని అనుకోలేదన్నారు. పూర్తిగా ఇష్టప్రకారమే డెవలప్మెంట్ కి ఇచ్చామని చెప్పారు.  2014 లో టైటిల్ కి సంబంధించి కమలా దేవి కి దఖలు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని కమలాదేవి తరపు లాయర్ సుబ్బరాజు తెలిపారు.  

అమలు చేయకపోవడం తో గత కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు నెల రోజులు జైలు శిక్ష కూడా విధించిందని లాయర్ గుర్తు చేశారు. ఆయన అప్పీల్ కి వెళ్లి ఆపుకున్నారనని తెలిపారు. కోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నామని దసపల్లా యజమానులు అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటాల మల్లిక్ తెలిపారు. ఎవరూ తమను బలవంతం చేయలేదని తామే స్వచ్చందంగా ఒప్పందం చేసుకున్నామని యజమానులు తెలిపారు. డెవలప్‌మెంట్ కాంట్రాక్ట్ విషయంలోనూ అక్రమాలు జరిగాయని..  అతి తక్కువ భూ యజమానులకు ఇస్తున్నారన్న ఆరోపణలపై బిల్డర్లు స్పందించారు.  30:70 నిష్పత్తిలో యాజమాన్యం,  డెవలపర్లు కు ఒప్పందం కుదిరిందvf..  విశాఖ లో ఈ నిష్పత్తులు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉన్నాయని అష్యూర్ డెవలపర్స్ డైరక్టర్ ఉమేష్ వివరమ ఇచ్చారు.  

అనేక మన్నాకారకాలను దృష్టిలో ఉంచుకుని ఒక చదరపు గజానికి 12 చదరపు అడుగుల ను డెవలపర్ కు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.   ఆవ్యాన్ రియల్టర్స్  నుంచి  దసపల్లా భూములకోసం అష్యూర్ డెవలపర్స్ కి నిధులు రావడం అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే నిధులు వచ్చాయని..  గోపీనాథ్ రెడ్డి కి వేరే అవసరాల కోసం వచ్చిన అమౌంట్స్ ను దసపల్లా భూముల కోసం వచ్చినట్లుగా ప్రచారం  చేస్తున్నారని ఆరోపించారు.  అవ్యాన్ రియల్టర్లు నుంచి అష్యూర్ డెవలపర్స్ కి ఒక్క రూపాయి కూడా రాలేదని మరో బిల్డర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు.  30 : 70 ఒప్పందానికే అభ్యంతరం ఉంటే విశాఖ లో 1:99 కూడా జరిగిన వాటిపైనా చర్చ జరగాలని డిమాండ్ చేశారు.  

దసపల్లా భూములు ప్రభుత్వానివని.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని సరైన అప్పీల్‌కు వెళ్లలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దసపల్లా భూముల విషయంలో ఆరోపణలు చేసిన వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇప్పుడు దగ్గరుండి మరీ వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి.. ఆ స్థలాలను డెవలప్‌మెంట్ కింద తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై విమర్శలు పెరిగిపోతూండటంతో  బిల్డర్లు, యజమానులు ఇలా మీడియా ముందుకు వచ్చారు. అయితే వారు చెప్పిన విషయాల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది మీడియాపై ఎదురుదాడికి దిగడంతో గూడుపుఠాణి ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget