Breaking News: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని : మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 31న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 1 నుంచి కడప జిల్లాలో పర్యటన చేయనుంది. సెప్టెంబరు ఒకటి సాయంత్రం 4.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయకు వెళ్తారు. 4.50గంటల నుంచి 5.50 గంటల వరకు పార్టీ నాయకులతో భేటీ అవుతారు. 6.00 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్లోని అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. సెప్టెంబరు 2న ఉదయం వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అక్కడ కార్యక్రమాలను ముగించుకుని తర్వాత తాడేపల్లికి తిరిగి వెళ్తారు.
ఆరోగ్యం మళ్లీ విషమించడంతో విదేశాలకు విజయ్ కాంత్ !
తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్కాంత్ ఆరోగ్యం మెరుగుపడలేదు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అమెరికా, సింగపూర్లలో చికిత్స చేయించుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరమయ్యారు. పార్టీ బాధ్యతలను తన భార్యకు అప్పగించారు. సెకెండ్ వేవ్ లో ఆయనకు కరోనా సోకింది. కొవిడ్ నుంచి కోలుకున్నా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తరచుగా వైద్య పరీక్షలకు వెళ్తున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పెద్దగా పాల్గొనలేకపోయారు. తాజాగా ఆరోగ్యం మళ్లీ విషమించడంతో ఆయన విదేశాలకు వెళ్తున్నట్లు తెలిసింది . చెన్నై విమానాశ్రయంలో వీల్చైర్పై ఆయన వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
40 అంతస్థుల భవంతులను కూల్చివేయండి : సుప్రీంకోర్టు
ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెండు భారీ భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సూపర్టెక్ ఎమరాల్డ్ సంస్థ 40 అంతస్తులతో 2 టవర్లు నిర్మించింది. నిబంధనలకు విరుద్ధంగా వీటని నిర్మించారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం జంట టవర్లను కూల్చివేయాలని ఆదేశించింది. మూడునెలల్లోపు కూల్చివేతలు పూర్తిచేయాలని అధికారులకు తెలిపింది. కూల్చివేతకు అయ్యే ఖర్చును సూపర్టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు టవర్లలో దాదాపుగా వెయ్యి ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు కొన్న వారందరికీ 12 శాతం వడ్డీతో నగదు తిరిగి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.





















