![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TDP State Level Conference: "ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి" రేపు టీడీపీ రాష్ట్ర స్థాయి సదస్సు
TDP State Level Conference: టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో గురువారం రోజు "ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి" రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించబోతున్నారు.
![TDP State Level Conference: TDP State Level Conference on Thursday at National Party Office About Aqua Farmers TDP State Level Conference:](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/23/5b4fca6d23f565191f50ed5b024b834d1669192143381519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TDP State Level Conference: "ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి" రాష్ట్ర స్థాయి సదస్సును గురువారం రోజు టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగుదేశం హయాంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం.. నేడు సీఎం జగన్ రెడ్డి చర్యలతో పతనావస్థకు చేరుకుందని ఆయన ఆరోపించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకే గురువారం ఈ సదస్సు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ‘‘ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి’’ అనే అంశంపై నేతలు మాట్లాడాతారని వివరించారు. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.
ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి?
— Kinjarapu Atchannaidu (@katchannaidu) November 23, 2022
జాతీయ పార్టీ కార్యాలయంలో గురువారం నాడు రాష్ట్రస్థాయి సదస్సు.
#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/sxtxyp1wxk
అలాగే ఈ సదస్సుకు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడితో పాటు ముఖ్య నాయకులు కూడా హాజరవుతారని తెలిపారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఆక్వా రైతులకు రూ.1.50 కే విద్యుత్ సరఫరా చేస్తానని జగన్రెడ్డి హామీ ఇచ్చి రైతులను వంచించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా విద్యుత్ కోతలతో ఆక్వా రంగాన్ని జగన్రెడ్డి నిండా ముంచారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అనేక షరతులతో సబ్సిడీలు ఎత్తివేసి ఆక్వా రైతులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల జెట్యాక్స్తో ఆక్వా రైతాంగాన్ని నాశనం చేస్తున్న సీఎం జగన్ చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న పోరాటంలో ఆక్వా రైతులందరూ పాల్గొనాలని కోరుతున్నట్లు వివరించారు.
* ఫిష్ మాఫియా.. రాయలసీమ మత్స్యకారులకు జగన్ రెడ్డి ప్రభుత్వం కానుక.
— Kinjarapu Atchannaidu (@katchannaidu) November 22, 2022
* ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుండి వచ్చి రాయలసీమలో తిష్ఠ వేసిన ఫిష్ మాఫియా.
* ఫిష్ మాఫియా వెనుక అధికార పార్టీ నేతల హస్తం.
* స్థానిక మత్స్యకారుల పొట్టగొడుతున్న ఫిష్ మాఫియా.#IdhemKarmaManaRashtraniki ?
1/2 pic.twitter.com/LVVoy3WX1c
గత కొంత కాలంగా టీడీపీ ఇదేం ఖర్మ పేరుతో.. వైపీసీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య పట్ల స్పందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు విద్యార్థులను లారీలో తీసుకెళ్తున్న వీడియోనీ యాడ్ చేసి మరీ నిలదీశారు.
ఇంత మంది బడి పిల్లలను ఇలా ఇరుకిరుగ్గా లారీల్లో నిలబెట్టి పంపుతున్న విధానం చూసి "ఇదేం ఖర్మరా?" అనుకుంటున్న తల్లిదండ్రులు. పిల్లల ప్రాణాలంటే ఈ దున్నపోతు ప్రభుత్వానికి లెక్క లేకుండా ఉంది.#IdhemKarmaManaRashtraniki #YSJaganFailedCM pic.twitter.com/1ghCUm5af7
— Telugu Desam Party (@JaiTDP) November 23, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)