By: ABP Desam | Updated at : 17 Mar 2023 03:15 PM (IST)
సీఎం జగన్, నారా లోకేశ్ (ఫైల్ ఫోటోలు)
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు వ్యంగ్యపు ట్వీట్లు చేస్తున్నారు. ఓ వైపు వైఎస్ వివేకా హత్య కేసు, ఇంకో వైపు లిక్కర్ కేసుల్లో సీబీఐ, ఈడీ దూకుడుగా ఉన్నందునే తమ వారిని కాపాడుకొనేందుకు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విమర్శిస్తున్నారు.
పదే పదే ఎందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ‘‘అయిననూ పోయి రావలె హస్తినకు అని జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ ఎందుకెళ్తున్నట్టు?’’ అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనికి లోకేశ్ మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు. ‘‘A) ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని కాపాడటానికి, B) సీబీఐ అధికారి బదిలీ కోసం, C) లిక్కర్ స్కాంలో బుక్కయిన ఎంపీ కోసం’’ అని మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చారు. ఇక దీనిపై టీడీపీ అభిమానులు ఘోరమైన కామెంట్లు చేస్తున్నారు.
అయిననూ పోయి రావలె హస్తినకు అని జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ ఎందుకెళ్తున్నట్టు?
A) ఒక కన్నుని పొడిచిన మరో కన్నుని కాపాడటానికి.
B) సీబీఐ అధికారి బదిలీ కోసం.
C) లిక్కర్ స్కాంలో బుక్కయిన ఎంపీ కోసం. #AbbaiKilledBabai #JaganPaniAyipoyindhi pic.twitter.com/1cnW3OzkNK — Lokesh Nara (@naralokesh) March 17, 2023
వివేకా కేసులో దూకుడుగా ఉన్న సీబీఐ
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని, హత్య కేసులో దర్యాప్తు కొనసాగివచ్చని సీబీఐకి అనుమతి ఇస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒంగోలు ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 18వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఆయన్ను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టు కాగా, ఈడీ నోటీసులు చర్చనీయాంశం అయ్యాయి.
సీఎం ప్రధానికి విన్నవించిన అంశాలివీ..
Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?
Swaroopanandendra: తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి, ప్రధానిది కూడా - స్వరూపానందేంద్ర స్వామి
Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?
Narasarao pet News : కోటప్పకొండ అభివృద్ధిపై చర్చకు సవాళ్లు - నర్సరావుపేటలో టీడీపీ నేత అరెస్ట్ !
CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు, తెలుగుదనం ఉట్టిపడేలా సీఎం వస్త్రధారణ
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?