అన్వేషించండి

TDP Janasena BJP Meeting: సీట్ల కేటాయింపుపై చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ

Andhra Elections 2024: టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు సీట్ల సర్దుబాటుపై ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కీలకంగా భేటీ అయి చర్చిస్తున్నారు. ఈ

Chandrababu arrives at his residence in Undavalli: అమరావతి: ఎన్నికల బరిలోకి దిగేందుకు ఏర్పాటైన కూటమి నేతలు సీట్ల సర్దుబాటు, కేటాయింపులపై భేటీ అయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన (Janasena) ముఖ్య నేతలు సీట్ల సర్దుబాటుపై ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసంలో కీలకంగా భేటీ అయి చర్చిస్తున్నారు. ఈ భేటీకి టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్, పార్టీ జాతీయ నేత బైజయంత్‌ పండా హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఈ భేటీకి హాజరు కాలేదని సమాచారం.

పొత్తులో భాగంగా టీడీపీ 145 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగనుంది. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. వీటిలో జనసేన 6 అసెంబ్లీ సీట్ల అభ్యర్థులను జనసేన పార్టీ ప్రకటించింది. బీజేపీ 6 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే ఏ సీట్లు కేటాయిస్తారు, అక్కడ పోటీ చేసే అభ్యర్థులపై తేల్చేందుకు కూటమి నేతలు చంద్రబాబు నివాసంలో భేటీ అయి చర్చిస్తున్నారు. 

రెండున్నర గంటలుగా చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల సమావేశం కొనసాగుతోంది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలపై సందిగ్ధత వీడలేదు. ముఖ్యంగా మదనపల్లె, శ్రీకాళహస్తి, కదిరి, పి.గన్నవరం స్థానాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశం జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు నివాసానికి సీఎం రమేష్ వచ్చారు. ఆయన విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్నారని పార్టీలో వినిపిస్తోంది.

ఢిల్లీ పర్యటనతో కూటమిపై క్లారిటీ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ పెద్దలతో, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఇరువురు నేతలు భేటీ అయిన తరువాత పొత్తులపై స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలో ఎన్డీఏలోకి వచ్చాయని.. ఏపీలో ఈ పార్టీలతో కలిసి బీజేపీ పనిచేయనుందని పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొనడం తెలిసిందే. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ పొత్తులు 
టీడీపీ, జనసేనతో పొత్తు ఖరారు కావడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదివారం నాడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుష్టపాలనకు చరమగీతం పాడాలంటే వైసీపీని ఓడించడం ఒక్కటమే మార్గమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ మేనిఫెస్టో రథాలను ఆదివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మేనిఫెస్టో తయారీలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రం కోసం ఒకటి, కేంద్రం నుంచి ఏం ఆశిస్తున్నారని రెండు బాక్సులతో బీజేపీ ప్రచార రథాలు పంపిస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు బీజేపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

 Also Read: కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలక మండలి - కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసే ప్రక్రియలో కీలక ముందడుగు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget