By: ABP Desam | Updated at : 16 Jan 2022 01:12 PM (IST)
సోము వీర్రాజు (File Photo)
ప్రపంచానికి రెండు కోవిడ్ వ్యాక్సిన్ లు అందించిన దేశం భారత్ అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రపంచానికి భారత్ను ఆరోగ్య దర్శినిగా నిలెబెట్టిన మహనీయుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. కోవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ అగ్రరాజ్యాలలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందన్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్లను ఇచ్చామని, 18 ఏళ్లకు పై జనాభాలో 70 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ లు కేంద్ర ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. బూస్టర్ డోస్ ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని.. అయినా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ల పంపకం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Koo Appప్రపంచానికి రెండు కోవిడ్ వ్యాక్సిన్ లు అందించిన దేశం భారత్ అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రపంచానికి భారత్ను ఆరోగ్య దర్శినిగా నిలెబెట్టిన మహనీయుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. వ్యాక్సిన్ల పంపకం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. @somuveerraju @bjp4Andhra #NarendraModi #Corona #Covid19 https://telugu.abplive.com/andhra-pradesh/somu-veerraju-says-thanks-to-pm-modi-for-providing-covid19-vaccines-to-ap-people-18498 - Shankar (@guest_QJG52) 16 Jan 2022
ఏపీలో కరోనా వ్యాప్తి..
రాష్ట్రంలో 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు చేయగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. మరో 397 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. విశాఖ జిల్లాలో 1,103, చిత్తూరు 1,039, శ్రీకాకుళం 385, గుంటూరు 377, తూర్పు గోదావరి 327, అనంతపురం జిల్లాలో 300 కరోనా కేసులు చొప్పున నమోదయ్యాయి.
Also Read: Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్ - బూస్టర్ డోస్కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?
గతంలో ఒకట్రెండు పర్యాయాలు కరోనా బారిన పడిన వారికి సైతం మళ్లీ కరోనా సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలని కొవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు.
Also Read: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?
Also Read: Weather Updates: ఏపీకి తప్పని కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు కూడా.. తెలంగాణలో వెదర్ ఇలా..
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?