అన్వేషించండి

Somu Verraju : తర్వాతేంటో తెలియదు - టీడీపీతో పొత్తుపై సోము వీర్రాజు విచిత్ర స్పందన !

టీడీపీ, బీజేపీ కూటమిపై తర్వాతేంటో తెలియదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇటీవల అచ్చెన్నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకంగానో అనుకూలంగానో చేసినవో కావన్నారు.


Somu Verraju :   తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తు వ్యవహారం హాట్ టాపిక్ గానే ఉంటంది. ఎక్కడుకు వెళ్లినా ఏపీ బీజేపీ నేతలకు ఈ ప్రశ్న మాత్రం మీడియా నుంచి వస్తుంది. కానీ వారికి కూడా సమాధానం తెలియదు.  చంద్రబాబు మా పార్టీ పెద్దలను కలిశారు... ఏపీకి అమిత్ షా, నడ్డా వచ్చి వైసీపీని విమర్శించారు...మేమూ వైసీపీ ఒకటి కాదని చెప్పారని సోము వీర్రాజు గుర్తు చేశారు.  తర్వాత ఏంటనేది మనం ఆలోచించుకుంటున్నామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  జగన్ ప్రభుత్వంపై అమిత్ షా, జేపీ నడ్డా విమర్శలు చేశారని..  మరి చర్యలెప్పుడు తీసుకుంటారని చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్న అంశంపై ఇటీవల సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. 

చంద్రబాబు, అచ్చెన్నపై తన వ్యాఖ్యలను విమర్శలుగానో.. వ్యతిరేకంగానో చూడొద్దన్న వీర్రాజు                                      

దీనిపైనా సోము వీర్రాజు స్పందించారు. వారు బీజేపీని ప్రశ్నిస్తూ.. అలా మాట్లాడినందువల్ల తాము స్పందించాల్సి వచ్చిందన్నారు. తన మాటలను వ్యతిరేకంగానో అనుకూలంగానో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లనే ఏపీకి నష్టం జరుగుతుందని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ నేతలు ..  అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అయితే  జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే సోము వీర్రాజుకు ఎందుకు కోపమని ప్రశ్నించారు. దీనిపై సోము వీర్రాజు.. తన వ్యాఖ్యలను వ్యతిరేకంగానో అనుకూలంగానో చూడవద్దంటున్నారు. 

వైసీపీకి తాము ఎప్పుడూ దగ్గరగా లేమన్న సోము వీర్రాజు                                 

వైసీపీతో తాము ఎప్పుడూ దగ్గరగా లేమని వీర్రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతిపై అలుపెరగకుండా పోరాడుతున్నామన్నారు. తాము ఏదో ఓ పార్టీకి దగ్గరగా ఉన్నామని చెప్పేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజుల కిందట చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారు. అయితే ఆ సమావేశంపై రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలాంటి సమాచారంలేదు.  అసలు ఆ సమావేశం పొత్తుల గురించేనా అన్నది కూడా తెలియదు. అయితే ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన  బీజేపీ అగ్రనేతలు  నడ్డా, అమిత్ షా ఇద్దరూ వైసీపీని విమర్శించడంతో పొత్తులపై చర్చలు ప్రారంభమయ్యాయి. 

వైసీపీ అవినీతి పై చర్యల కోసం డిమాండ్ చేస్తున్న  టీడీపీ                

అయితే టీడీపీ చర్యల కోసం డిమాండ్ చేస్తోంది. అవినీతి జరిగిదంని చెప్పడం కాదని.. చర్యలు తీసుకోవాలని అంటోంది.ఈ అంశంపై తరచూ చంద్రబాబు, అచ్చెన్నాయుడు మాట్లాడుతూండటంతో  బీజేపీ నేతలు కూడా విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వాటిపై సోము వీర్రాజు.. అవినుకూలమో.. వ్యతిరేకమో కాదని చెప్పడం ద్వారా.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget