అన్వేషించండి

Pilli Subhash : పిల్లి సుభాష్‌తో టీడీపీ నేతల భేటీ - పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా ?

పిల్లి సుభాష్ తో రామచంద్రాపురం టీడీపీ నేతలు భేటీ అయ్యారు. అయితే ఇందులో రాజకీయం లేదని.. ఆయన కుమారుడ్ని పరామర్శించడానికే భేటీ అయ్యామని చెబుతున్నారు.

 

Pilli Subhash :  వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత పంచాయతీలు  కాక రేపుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో టిక్కెట్‌ను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఖరారు చేయడంతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్ అవుతున్నారు. అక్కడ్నుంచి తాను కానీ.. తన కుమారుడు కానీ పోటీ చేసి తీరుతామని ఆయన ప్రకటించారు. సీఎం జగన్ కు కూడా అదే చెప్పానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లి భేటీ కావడం చర్చనీయాంశమయింది. రెడ్డి సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కొంత మంది నేతలు పిల్లి సుభాష్ ఇంటికి వెళ్లి  మాట్లాడారు. పలు రాజకీయఅ అంమశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తమ భేటీ రాజకీయాల కోసం కాదని.. .బోస్ పెద్ద కమారుడిని పరామర్శించడానికి వచ్చామని వారు చెబుతున్నారు. 

పార్లమెంట్ సమావేశాల తర్వాత వైసీపీకి..రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ మెయిలింగ్ కు లొంగేది లేదని.. మంత్రి వేణునే అక్కడ్నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. మరో వైపు అదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు తోట త్రిమూర్తులు కూడా మధ్యే మార్గంగా తనకు టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తు తం ఆయన మండపేట నియోజకవర్గానికి ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన కూడా రేసులోకి రావడంతో రామచంద్రాపురం వైసీపీ పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.                               

పిల్లి సుభాష్ చంద్రబోస్ సుదీర్ఘ కాలంగా రామచంద్రాపురం నుంచే రాజకీయాలు చేస్తున్నారు. ఓ సారి ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు.  జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు నడిచారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు రామచంద్రాపురం టిక్కెట్ కాకుండా.. మండపేట టిక్కెట్ కేటాయించారు. రామచంద్రాపురం చెల్లుబోయిన వేణుకు ఇచ్చారు. ఆయన నియోజకవర్గానికి స్థానికేతరుడు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన వారు.  రామచంద్రాపురంలో విజయం సాధించడంతో ఆయన అక్కడే రాజకీయంగా కొనసాగాలనుకుంటున్నారు. కానీ తన నియోజకవర్గాన్ని తనకు అప్పగించాలని పిల్లి సుభాష్ కోరుతున్నారు.                                     

పిల్లి సుభాష్‌కు ప్రత్యర్తిగా తోట త్రిమూర్తులు టీడీపీలో ఉండేవారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైసీపీలో చేరారు. ఆయనకు మండపేట ఇంచార్జ్ గా ఇచ్చారు. రాజ్యసభకు వెళ్లిన పిల్లి సుభాష్‌కు నియోజకవర్గం లేకుండా పోయింది. ఇలా అయితే తన వారసులకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే  ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెబుతున్నారు.  ఈ క్రమంలో ఆయనతో టీడీపీ నేతలు భేటీ కావడంతో.. రాజకీయం  కీలకంగా మారింది.                  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget