అన్వేషించండి

YS Jagan Eluru Tour: 16న ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదలకు అంతా రెడీ

YS Jagan Eluru Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం (మే 16న) ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

AP CM YS Jagan Mohan Reddy to visit Eluru District On 16 May: కరోనా వ్యాప్తి తగ్గిన అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ వేగం పెంచారు. అందులోనూ గతంలో చెప్పినట్లుగా ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. మరోవైపు గడప గడపకూ వైఎస్సార్ తో పార్టీ నేతలను ప్రజల మధ్య బిజీ బిజీగా గడిపేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం (మే 16న) ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఏలూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఒకటైన ఏలూరు జిల్లా గణపవరం మండలం గణపవరంలో వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే గత మూడేళ్లుగా వైఎస్సార్ రైతు భరోసా నగదు సాయాన్ని రైతులకు అందిస్తోండగా... మే 16న నాలుగో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 10.10 గంటలకు సీఎం జగన్ ఏలూరు జిల్లా గణపవరం చేరుకోనున్నారు. అక్కడ నుంచి గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఒక్క బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రూ.5,500 జమ చేస్తారు. ఈ నెలాఖరులో మరో రూ.2000 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. 

బహిరంగ సభ.. 
రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన అనంతరం డిగ్రీ కాలేజీ మైదానంలో జరగనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు ఏపీ సీఎం. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి చేరుకోనున్నారు.

ఇటీవల మత్స్యకార భరోసా..
కోనసీమ జిల్లా ఐ.పోలవరం మం. మురమళ్లలో మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభించారు సీఎం జగన్. 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.108.75 కోట్ల పంపిణీ చేశారు. 23,458 మంది మత్స్యకారులకు సమ్మిళిత అభివృద్ధి జీవనోపాధికి ఓఎన్జీసీ ద్వారా రూ.107.90 కోట్లు పంపిణీ జరిగింది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.

మే 17న కర్నూలు జిల్లాకు సీఎం జగన్..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 17న  కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి జరాక గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. సుమారు 15వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

Also Read: YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు శుభవార్త, వైఎస్సార్‌ రైతు భరోసా నగదు రూ.5,500 జమ అయ్యేది ఎప్పుడంటే ! 

Also Read: CM Jagan Tour: 17న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన- విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Doctors attack patient: ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
ఆస్పత్రిలో రోగిపై వైద్యుడు దాడి - మాట మాట పెరిగినందుకే - షాకింగ్ వీడియో
Gen Z vlogger Swathi Roja met Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
పవన్ కల్యాణ్‌ను కలిసిన జెన్ Z వ్లాగర్ స్వాతి రోజా- శ్రీశైలంలో ఎదురైన అనుభవాలు తెలుసుకున్న డీసీఎం 
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
Embed widget