అన్వేషించండి

Andhra Pradesh Weather Report: ఏపీని ముంచెత్తిన వాన- ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి- లంక గ్రామాల్లో భయం భయం

Weather Forecast In AP: ఆంధ్రప్రదేశ్‌ వర్షాలు తగ్గలేదు. నదులు, జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులు ఇలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Weather Latest News : ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల నుంచి జోరువానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పూరీ సమీపంలో తీర దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని చెబుతోంది. 

ఒడిషా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలకు అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఇది పూరి సమీపంలో కళింగపట్నానికి సుమారు 200 కిలోమీటర్లకుపైగా దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తీరం దాటే ఛాన్స్ ఉంది. ఈ వాయుగుండం ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి 24 గంటల్లో బలహీనపడుతుంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. 

మరోవైపు రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం కూడా వాతావరణంపై ఉంది. జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, రాయ్పూర్, పూరీ మీదుగా వెళ్తున్న ద్రోణీ ఆగ్నేయ దిశగా ఒడిశా, ఉత్తర ఆంధ్ర తీరాలుపై ప్రభావం చూపిస్తుంది. 

వర్షాలు జోరుగా పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు... ప్రతి జిల్లాలో ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటి మట్టం గంట గంటలకు పెరుగుతూనే ఉంది. శబరి, మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, మానేరు, పర్ల, ప్రవర ఇలా అన్ని ఉపనదులు కూడా ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరికి వరద నీరు పోటెత్తడంతో పోలవరం వద్ద స్పిల్‌వే మూడు లక్షల 30 వేలక్యూసెక్కులపైగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 36.5 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. 

పోలవరం వద్ద ఉన్న గండిపోశమ్మ ఆలయం నీట మునిగింది. దీంతో ఆ ఆలయానికి భక్తుల రాకపోకలను అధికారులు నిలిపేశారు. దవళేశ్వరం వద్ద కూడా నీటి మట్టం భారీగా పెరిగింది. నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా వరద నీరు పెరగడంతో ముంపు ప్రాంతాలు భయం గుప్పెట్లో బతుకుతున్నాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏటా వరదలు రావడం ఇక్కడ లంక గ్రామాలు మునిగిపోవడం సర్వసాధారణమైపోయింది. 

శ్రీశైలజలాశయానికి వరదపోటు -
2024-25 ఏడాది వర్షాకాల సీజన్‌లో శ్రీశైల జలాశయానికి వరద పోటు మొదలైంది. మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణానది ఎగువ పరివాహకంలోని ఆలమట్టి, నారాయణాపూర్, జూరాల డ్యాంలు నిండి నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరడంతో వరదజాలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈక్రమంలో జూరాల డ్యాం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైల జలాశయానికి నీటిని వదులుతున్నారు. దీంతో జూరాల నుంచి శ్రీశైలానికి 34,818 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.  శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80టీఎంసీలు. శుక్రవారం రాత్రి సమయానికి జూరాల నుంచి భారిగా 34,818 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం డ్యాం నీటిమట్టం 809.10అడుగులకు చేరగా జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 33.8136 టీఎంసీలుగా నమోదయింది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget