అన్వేషించండి

Yanamala Brothers: తుని టీడీపీలో సీటు పంచాయితీకి చెక్ పెట్టిన యనమల సోదరులు!

టీడీపీకి తుని ఎమ్మెల్యేగా గెలిచి బహుమతిగా ఇస్తమని, మళ్ళీ ఇక్కడ టీడీపీ జండా ఎగరవేస్తం అన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.

Yanamala Krishnudu and Yanamala RamaKrishnudu : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అన్నాదమ్ముళ్ల మధ్య వర్గ పోరు నడుస్తోందని గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అన్న యనమల రామకృష్ణుడును కాదని తమ్ముడు యనమల కృష్ణుడికి టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్య విభేదాలు తలెత్తాయని ఏపీ పాలిటిక్స్ లో చర్చ జరిగింది. అయితే అవన్నీ వదంతులేనని, తాము ఎప్పటికీ కలిసి ఉంటామని ఈ సోదరులు స్పష్టం చేశారు. 

టీడీపీకి తుని ఎమ్మెల్యేగా గెలిచి బహుమతిగా ఇస్తమని, మళ్ళీ ఇక్కడ టీడీపీ జండా ఎగరవేస్తం అన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. తాను, తన తమ్ముడు ఎప్పుడు కలిసే ఉంటామని కొన్ని మీడియా ఛానల్స్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నాలుగైదు మీటింగ్లు మేమిద్దరం కలిసే పెట్టామని చెప్పారు. ప్రస్తుతం పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతలు యువతకు అప్పగించాయని ఆ విషయమై తాను, కృష్ణుడు కలిసి తీసుకున్న నిర్ణయం అని తెలియజేశారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఈ సోదరులు బరిలోకి దిగడం లేదని తేలిపోయింది. అదే సమయంలో రామకృష్ణుడు కూతురు దివ్యకు టీడీపీ టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తుందని నియోజకవర్గంలో ఈ మీటింగ్ ద్వారా కాస్త క్లారిటీ వచ్చినట్లయింది. 

యనమల సోదరుడు యనమల కృష్ణుడు మాట్లాడుతూ.. నేను 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నాను. అధికారం ఉన్నా లేకపోయినా నన్ను కార్యకర్తలు నమ్ముకుని ఉన్నారు. పదవి ఉన్నా లేకపోయినా రామకృష్ణుడును, నన్ను ఒకేలా చూశారు ఒకేలా గౌరవించారు. నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను అన్నారు. ఈ 40 సంవత్సరాలు కాలంలో మేము విడిపోలేనిది ఇప్పుడు మేము విడిపోతామా.. నేను మా అన్నయ్య ఎప్పుడు ఒకటే ఆయన మాటే నా మాట.. నా మాట ఆయన మాట అన్నారు. నా రాజకీయ జీవితంలో 36 సంవత్సరాలు రాజకీయ జీవితం ఒక వైపు అయితే ఈ 4  సంవత్సరాలు ఒకవైపు ఎలాంటి దుర్మాపు పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.

ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కేసులు టిడిపి కార్యకర్తలపై పెట్టింది. ఆ కేసులన్నిటికీ కొత్తవారు వస్తే వాళ్ల పరిస్థితి ఏంటని ఆలోచించాలే తప్ప దివ్య పై ఎటువంటి ద్యేషం గాని వ్యతిరేకత గాని లేదు అన్నారు. అధికారం  వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కొట్టి వేస్తారని, మీకు ఏమన్నా జరిగితే నేనే మీ వెనక ఉంటానని యనమల కృష్ణుడు కార్యకర్తలకు తెలియజేశారు.

యనమల కృష్ణుడుకీ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ గా బాధ్యతలు 
యనమల కృష్ణుడు మాట్లాడుతూ 1982 నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్నామని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదానం నినాదంతో ఆనాడు ఎన్టీ రామారావు ప్రజల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలనుంచి పార్టీలో చేరామని నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్టీ ఏ పదవి ఇస్తే ఆ పదవిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని చేస్తానని కృష్ణుడు చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget