అన్వేషించండి

మాయమాటలు చెప్పం- పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే : లోకేష్

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌. నిర్వాసితులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ విస్మరించారని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.  పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ విస్మరించారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద లక్షా 15 వేల నుంచి లక్షా 40 వేలిచ్చారని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్. దాన్ని 6 లక్షల 36వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 198వరోజు పోలవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు లోకేశ్‌తో కలిసి నడిచారు. పలువురు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పాదయాత్రలో భాగంగా.. పోలవరం నిర్వాసితులతో లోకేశ్‌ ముఖాముఖిగా సమావేశం అయ్యారు. పోలవరం ఆర్ అండ్‌ ఆర్ ప్యాకేజీ విషయంలో జగన్‌ మాటలు నమ్మి మోసపోయామని లోకేశ్ వద్ద నిర్వాసితులు గోడు వెళ్లబోసుకున్నారు.  వారి సమస్యలను తెలుసుకున్న ఆయన... భరోసానిచ్చే ప్రయత్నం చేశారు

తెలుగుదేశం పార్టీ హయాంలోనే... పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో అందని ఆందోళన వ్యక్తం చేశారు. మోసానికి మరో రూపం సైకో జగన్ అన్న ఆయన... ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు ఇస్తామన్నారని ఇప్పటికి దాన్ని ఇవ్వలేదని విమర్శించారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు అనేక హామీలిచ్చిన జగన్...ముఖ్యమంత్రి అయ్యాక చేతులెత్తేసారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే...బటన్ నొక్కుతున్నారని మండిపడ్డారు. అప్పుడొక మంత్రిగారు ఉండేవారని.. బుల్లెట్ దిగిందా అని విమర్శలు చేసారని.. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగిందంటూ కౌంటర్ ఇచ్చారు. సదరు మంత్రికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు టికెట్ వస్తుందో లేదో...ఆయనకే తెలీదంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ ను ఉద్దేశించి సెటైర్లు వేస్తూ  వ్యాఖ్యానించారు. ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి...పోలవరం గురించి అడగవద్దని పదే పదే చెబుతున్నారంటూ మండిపడ్డారు. 

గతంలో టీడీపీ ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని...మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇస్తామన్నారు నారా లోకేశ్. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో తగ్గేది లేదని స్పష్టం చేశారు. జగన్ లా మాయ మాటలు చెప్పి, రేపు అధికారంలోకి వచ్చాక పరదాలు కట్టుకుని తిరగాలనే కోరిక లేదన్నారు లోకేశ్. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. లక్షా 15 వేల నుంచి 6 లక్షలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనన్నారు. 

45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం కట్టాలని అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నామన్నారు లోకేశ్. తెలంగాణ నుంచి ముంపు మండలాలను ప్రధాని మోదీ సహకారంతో విలీనం చేసుకున్నామని వెల్లడించారు. నిర్దేశించిన ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ప్రకటించారు. నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అందజేయడం, మౌలిక సదుపాయాలతో  కాలనీలు నిర్మించడం ప్రథమ కర్తవ్యమన్నారు లోకేశ్. పోలవరం నిర్వాసితుల కోసం తమ ప్రభుత్వ హయాంలో 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక...పోలవరాన్ని పూర్తి చేసేది చంద్రబాబునేనని స్పష్టం చేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించిన ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించిన ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించిన ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించిన ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Embed widget