అన్వేషించండి

Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు

Andhra Election Results 2024: ఏపీలో కేవలం ఓటింగ్ పూర్తయిందని, కౌంటింగ్ ముగియలేదని, అప్పటిమరకూ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కాపాలా ఉండాలని కూటమి శ్రేణులకు నాగబాబు పిలుపునిచ్చారు.

Janasena Leader Naga Babu: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి అనుకోవద్దని, ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాలేదని.. కౌంటింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని కూటమి పార్టీల శ్రేణులకు నాగబాబు పిలుపునిచ్చారు. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఎలాంటి అరాచకానికి పాల్పడుతారో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిల్లో చూశామన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 82 శాతం ఓట్లు పోలవడం ప్రజాస్వామ్య విజయం అని, కానీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదన్నారు. 

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ.. మనం సైకోపాత్ అనే మాట వింటుంటాం. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ కోవలోకి వస్తాడో లేదో గానీ కచ్చితంగా అతనో సోషియోపాత్. ప్రజలను కులాలు, వర్గాలు, పార్టీలవారీగా విడదీసి ఆనందించే రకం. ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరూ గుర్తించలేదు. ఆ సోషియోపాత్ మానసిక స్థితి రోజురోజుకీ ముదిరింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ శ్రేణులు ఉన్మాదంతో ప్రజల ఇళ్లపైపడి అరాచకం సృష్టిస్తున్నాయని’ అన్నారు. 

ఎస్.జె.సూర్య గుర్తుకొస్తున్నాడు

" మాచర్ల వైసీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన వారి ఇళ్ళలో పెట్రోలు బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఏం చేయనున్నారో ప్రజలు గ్రహించాలి. తమను తాము రక్షించుకొనేందుకు తాడిపత్రిలో పోలీసులు అగచాట్లు పడ్డారు అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో చూడండి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిస్తే ఇళ్లలోకి చొరబడి చావగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది జగన్. విశాఖపట్నంలోని కందరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్ధులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గూండాలు ఆ ఇంట్లోని మహిళలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భవతిపైనా దాడి చేశారంటే అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇవన్నీ చేపించి చక్కటి చిరునవ్వులు చిందిస్తున్న జగన్‌ను చూస్తే మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో ఎస్.జె.సూర్య గుర్తుకొస్తున్నాడు "
-
నాగబాబు

స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఇప్పటికే ఈసీ నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసింది. వైసీపీ శ్రేణులను ఏ దశలోనూ తెలికగా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా తెగబడతారని నాగబాబు అన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కాపలాగా ఉండేందుకు పార్టీల ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకుందాం, కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరంగా పహారా ఉండాలన్నారు. జనసేన పోటీ చేసిన స్థానాల్లో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర స్వచ్ఛందంగా పహారా చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. 

జగన్‌లో డొనాల్డ్ ట్రంప్ లక్షణాలు
ఏపీ సీఎం జగన్‌లో డొనాల్డ్ ట్రంప్ మానసిక లక్షణాలు కూడా వచ్చాయన్నారు. కొన్నేళ్ల కిందట జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతాడని తెలిసి నేనే గెలుస్తున్నాను... గతం కంటే ఎక్కువ ఓట్లు అని ప్రచారం మొదలుపెట్టినా ఓడిపోయాడని నాగబాబు గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓడాక కుర్చీ దిగనని నానా యాగీ చేస్తే.. బలవంతంగా వైట్ హౌస్ నుంచి పంపేశారని చెప్పారు. మొన్న ఐప్యాక్ మీటింగులో వైసీపీ గెలుస్తుందని జగన్ గొప్పలు చెప్పాడని.. ఆయన కింద నేతలు సైతం విశాఖలో ప్రమాణస్వీకార ముహూర్తం అని ప్రకటించడంపై సెటైర్లు వేశారు. జూన్ 4 తరవాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న 'ఆ' ఆసుపత్రిలో చేర్చాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ తన బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం ఉందన్నారు. అందుకే జూన్ 15 వరకూ కేంద్ర బలగాలను మోహరించాలని కేంద్రం చెప్పినట్లు గుర్తుచేశారు. అరాచక శక్తుల నుంచి అధికారం చేతులు మారే శుభ గడియ కోసం వేచి చూద్దామన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget