అన్వేషించండి

Kakinada News: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు మహిళలు మృతి

కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

- తాళ్లరేవు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... 
- ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెలర్ బస్సు..
- ఏడుగురు మహిళలు దుర్మరణం.. 
వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద మహిళలు... తాళ్లరేవు మండల పరిధిలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో దినసరి కులీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వారే.. రోజు లానే పని ముగించుకుని తిరిగి ఆటోలో వస్తుంటే మృత్యువు బస్సు రూపంలో కాటేసింది. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో 11 మంది మహిళలు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.  యానాం - కాకినాడ బైపాస్ రోడ్డులో తాళ్లరేవు వద్ద అత్యంత వేగంగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళల్లో ఆరుగురు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారంతా తీవ్ర గాయాలతో బయట పడ్డారు.

భీతావహంగా మారిన బైపాస్ రోడ్డు... 
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేసేందుకు మహిళలలు వెళ్తున్న ఆటో ను ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో యానాం - కాకినాడ రోడ్డు నెత్తురోడింది. ప్రమాద ఘటన వద్ద రోడ్డుపై రక్త మోడుతూ చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాల తో ఆ ప్రాంతం అంతా భీతావహంగా మారింది. ఒకేచోట ఆరు మృతదేహాలు తీవ్ర గాయాలతో రక్తంతో నిండి పోవడంతో భయానక పరిస్థితి కనిపించింది. 

మృతులంతా యానాంకు చెందిన వారే... 
యానాం - కాకినాడ బైపాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా యానాం కు చెందిన వారిగా గుర్తించారు.  వీరంతా రోజూ తాళ్ల రేవు లో రొయ్యల ప్రాసెస్సింగ్ ఫ్యాక్టరీ లో రోజు వారి కూలీలుగా పనిచేస్తున్నారు. మృతులు యానానికి చెందిన శేషేట్టి వెంకటలక్ష్మి (41), కర్రి పార్వతి (41), నిమ్మకాయల లక్ష్మి (54), కల్లి పద్మ(38), చింతపల్లి జ్యోతి (38), బొక్కా అనంతలక్ష్మి (47) ప్రమాదంలో మృతి చెందారు. గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించగా మరో మహిళ బి. సత్యవతి (35)  మృతి చెందింది.  గాయపడిన వారిని యానం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 
బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోగా బస్ ఢీకొన్న సమయంలో ఆటోలో 11 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలిని మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ముమ్మిడివరం, యానాం  ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కుమార్, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు.

తిరుమలలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మహిళా భక్తుల మృతితో విషాదం 
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 24వ మలుపు వద్ద తుఫాన్ వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, మరో ఆరు మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది.  రోడ్డు ప్రమాదం జరగడంతో ఘాట్ రోడ్డులో కొంత సమయం  ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. విజిలెన్స్, పోలీసులు కొంతసమయానికి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ప్రమాదానికి గురైన భక్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget