అన్వేషించండి

Kakinada News: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు మహిళలు మృతి

కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

- తాళ్లరేవు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... 
- ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెలర్ బస్సు..
- ఏడుగురు మహిళలు దుర్మరణం.. 
వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద మహిళలు... తాళ్లరేవు మండల పరిధిలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో దినసరి కులీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వారే.. రోజు లానే పని ముగించుకుని తిరిగి ఆటోలో వస్తుంటే మృత్యువు బస్సు రూపంలో కాటేసింది. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో 11 మంది మహిళలు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.  యానాం - కాకినాడ బైపాస్ రోడ్డులో తాళ్లరేవు వద్ద అత్యంత వేగంగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళల్లో ఆరుగురు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారంతా తీవ్ర గాయాలతో బయట పడ్డారు.

భీతావహంగా మారిన బైపాస్ రోడ్డు... 
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేసేందుకు మహిళలలు వెళ్తున్న ఆటో ను ప్రైవేట్ బస్సు ఢీ కొట్టడంతో యానాం - కాకినాడ రోడ్డు నెత్తురోడింది. ప్రమాద ఘటన వద్ద రోడ్డుపై రక్త మోడుతూ చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాల తో ఆ ప్రాంతం అంతా భీతావహంగా మారింది. ఒకేచోట ఆరు మృతదేహాలు తీవ్ర గాయాలతో రక్తంతో నిండి పోవడంతో భయానక పరిస్థితి కనిపించింది. 

మృతులంతా యానాంకు చెందిన వారే... 
యానాం - కాకినాడ బైపాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా యానాం కు చెందిన వారిగా గుర్తించారు.  వీరంతా రోజూ తాళ్ల రేవు లో రొయ్యల ప్రాసెస్సింగ్ ఫ్యాక్టరీ లో రోజు వారి కూలీలుగా పనిచేస్తున్నారు. మృతులు యానానికి చెందిన శేషేట్టి వెంకటలక్ష్మి (41), కర్రి పార్వతి (41), నిమ్మకాయల లక్ష్మి (54), కల్లి పద్మ(38), చింతపల్లి జ్యోతి (38), బొక్కా అనంతలక్ష్మి (47) ప్రమాదంలో మృతి చెందారు. గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించగా మరో మహిళ బి. సత్యవతి (35)  మృతి చెందింది.  గాయపడిన వారిని యానం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 
బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోగా బస్ ఢీకొన్న సమయంలో ఆటోలో 11 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలిని మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ముమ్మిడివరం, యానాం  ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కుమార్, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు.

తిరుమలలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మహిళా భక్తుల మృతితో విషాదం 
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 24వ మలుపు వద్ద తుఫాన్ వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, మరో ఆరు మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది.  రోడ్డు ప్రమాదం జరగడంతో ఘాట్ రోడ్డులో కొంత సమయం  ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. విజిలెన్స్, పోలీసులు కొంతసమయానికి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ప్రమాదానికి గురైన భక్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని సమాచారం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పూర్తిస్థాయి ఆడిట్‌కు పవన్ కళ్యాణ్ ఆదేశం.. బోటులో వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం
గోదావరి కాలుష్యంపై పూర్తిస్థాయి ఆడిట్‌కు పవన్ కళ్యాణ్ ఆదేశం.. బోటులో వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?

వీడియోలు

RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్
David Warner Blocked by SRH ? | డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH?
IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet Expansion 2026: కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Maa Inti Bangaram Trailer: సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
Best Mileage Cars: పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Embed widget