By: ABP Desam | Updated at : 03 May 2022 01:27 PM (IST)
కాకినాడలో మతసామరస్యం
Religious harmony in Kakinada During Ramzan 2022: కరోనా వ్యాప్తి కారణంగా రెండు సంవత్సరాల నుంచి ఇంటి వద్దనే రంజాన్ వేడుకలు జరుపుకున్న ముస్లింలు ఈ ఏడాది మసీదులు, దర్గాలు, ఈద్గాలకు భారీగా తరలి వస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కాకినాడలో మతసామరస్యం వెల్లివిరిసింది. కాకినాడ ఈద్గామైదానం వద్ద భోగిగణపతిపీఠం మజ్జిగ పంపిణీ నిర్వహించింది. ప్రార్థనలు చేయడానికి వచ్చిన ముస్లిం సోదరులకు మజ్జిక పంపిణీ చేసి పీఠం సభ్యులు మతసామరస్యం చాటడం పట్ల ముస్లిం మతగురువులు హర్షంవ్యక్తం చేశారు. ఈద్గా మైదానానికి పలువురు హిందూ ముస్లింలు ఒకే వాహనాల్లో తరలివెళ్లారు.
ముస్లింలతో కలిసి శ్రీభోగి గణపతిపీఠం
కాకినాడ ఈద్గా మైదానం వద్ద రంజాన్ ప్రార్థనలకు వచ్చిన వెయ్యి మంది ముస్లిం పౌరులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంభు శ్రీభోగి గణపతిపీఠం నిర్వహించింది. తద్వారా మత సామరస్యతకు ప్రతీకగా నిలిచారు. రంజాన్ సందర్భంగా ఈద్గా లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు రజాక్ తో పాటు నగరానికి చెందిన పలు ప్రార్థనా గురువులు ప్రముఖులను కలిసిన సందర్భంగా పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మతసామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధ సోదరులందరూ భారతీయ ప్రగతికి ప్రతీకగా ప్రతి పండుగల్లో కలిసి మెలిసి భాయీ భాయీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుందామని, శాంతియుతంగా ఉందామని రజాక్ పిలుపునిచ్చారు. కరోనా కష్ట కాలంలో కులం మతం అనే భేదం లేకుండా సేవలు చేసుకున్నామని గుర్తు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించే వేడుకల్లోనూ ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని మతసామరస్యాన్ని చాటుకుంటూ వేడుకలు విజయవంతమయ్యేలా చేస్తున్నారు.
తెలంగాణలోనూ ఘనంగా రంజాన్ వేడుకలు..
రంజాన్ మాసం (Ramzan 2022) ఉపవాస దీక్షలు సోమవారం రాత్రితో ముగిశాయి. నిన్న రాత్రి 8 గంటలకు ఆకాశంలో నెలవంక కనిపించింది. నెలవంక కనిపించడంతో నేడు పవిత్ర రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) వేడుకలు హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మక్కా మసీదు, పాత బస్తీలోని చౌక్ మసీదు, అఫ్జల్గంజ్ జామా మసీదు, వజర్ ఆలీ మసీదు, సిద్ది అంబర్ బజార్, మీరాలం ఈద్గా, మసీదులకు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మక్కా మసీదు, చార్మినార్, మీరాలం ఈద్గాతో పాటు తెలంగాణలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
Also Read: Ramadan 2022 Photos: హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
East Godavari News : ధాన్యం కొనుగోలులో భారీ స్కామ్, ఆధారాలున్నాయ్ - ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన కామెంట్స్
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Amalapuram Celebrations: తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత్, ఏపీలోని అమలాపురంలో సంబరాలు - ఎందుకంటే !
YS Jagan Eluru Tour: 16న ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదలకు అంతా రెడీ
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!