News
News
వీడియోలు ఆటలు
X

Margani Bharat: చిట్స్‌ పేరుతో భారీగా అక్రమాలు, అందుకే ఆదిరెడ్డి అరెస్టు - ఎంపీ మార్గాని భరత్

ఎంపీ భరత్‌ మంగళవారం (ఏప్రిల్ 2) రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. 

FOLLOW US: 
Share:

రాజమండ్రిలో టీడీపీకి చెందిన ఆదిరెడ్డి శ్రీనివాస్‌, ఆదిరెడ్డి అప్పారావును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. తండ్రీ, కుమారులైన వీరిని రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరు కుంభకోణాలకు పాల్పడడం వల్లే అరెస్టు చేశారని మార్గాని భరత్ ఆరోపించారు. వారు జగజ్జనని చిట్స్‌ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ చిట్ ఫండ్ కంపెనీలో ప్రజల నుంచి సేకరించిన డబ్బులను వారి మరో కంపెనీలకు మళ్లించి ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారని అన్నారు. ఎంపీ భరత్‌ మంగళవారం (ఏప్రిల్ 2) రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. 

ఆదిరెడ్డి శ్రీనివాస్, అప్పారావు విషయంలో కక్ష సాధింపుకు ప్రభుత్వం పాల్పడిందని కొందరు అంటున్నారని, ఆదిరెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మార్గాని భరత్ అన్నారు. ఆదిరెడ్డిపై ఫోర్జరీ సంతకాలు చేసిన కేసు కూడా ఉందని అన్నారు. చిట్‌ ఫండ్స్‌ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయని, 20 వేలకు మించిన లావాదేవీలపై క్యాష్ రిసీట్స్ తీసుకోవడానికి అవకాశం లేదని అన్నారు. కానీ, కోట్ల రూపాయల లావాదేవీలు జగజ్జననిలో జరిగినట్టు అధికారులు గుర్తించారని అన్నారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదని అన్నారు. అక్రమాలు చేసే సంస్థలను ప్రభుత్వం ఎట్టి పరిస్థిత్తుల్లో ఉపేక్షించబోదని చెప్పారు. జగజ్జనని కూడా మార్గదర్శి సంస్థలాంటిదేనని, జగజ్జనని చిట్ ఫండ్ బాధితులు ఎంతోమంది ఉన్నారని చెప్పారు.

‘‘చిట్ ఫండ్ 1982 ప్రకారం నిబంధనలు అంటూ ఉన్నాయి. దేశ వ్యాప్తంగా బోర్డు తెప్పేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. శారద చిట్స్, సహారా చిట్స్ మోసాలు పార్లమెంట్ ను కుదిపేశాయి. సత్యం స్కాం, అగ్రీ గోల్డ్ కూడా ప్రజల సొమ్మును మళ్లించారు. వ్యాపారస్తులకు మేము వ్యతిరేకం కాదు. ప్రోపర్ రికార్డ్ మైంటైన్ చేయకుండా మోసాలు జరుగుతున్నాయి. మహానాడు దగ్గర పడుతుందని అరెస్ట్ చేశామని వైఎస్ఆర్ సీపీ నేతలపై మండిపడడం కరెక్ట్ కాదు. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసేస్తామని దమ్ముంటే మహానాడులో తీర్మానం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. ప్రోపర్ రికార్డ్ మైంటైన్ చేయకుండా మోసాలు జరుగుతున్నాయి. మహానాడు దగ్గర పడుతుందని అరెస్ట్ చేశామని వైఎస్ఆర్ సీపీ నేతలపై మండిపడడం కరెక్ట్ కాదు’’ అని మార్గాని భరత్ అన్నారు.

రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాసుతో పాటు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తండ్రీ, కుమారుడు ఇద్దర్నీ రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి పోలీసులు తరలించారు. అయితే ఈ ఇద్దర్ని ఏ విషయంలో అరెస్ట్ చేశారనే విషయం తొలుత ఎవరికీ తెలియలేదు. చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ చేశారా? లేదా మరో కేసులో అరెస్టు చేశారా? అనే దానిపై స్పష్టత రాలేదు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ అరెస్టులు చేశారని టీడీపీ నేతలు సీఐడీ కార్యాలయం ఎదుట కూడా ఆందోళన చేపట్టారు. వారి అరెస్టు తర్వాత మాజీ సీఎం చంద్రబాబు ఆదిరెడ్డి భవానీకి ఫోన్ చేసి పరామర్శించారు.

Published at : 02 May 2023 03:00 PM (IST) Tags: MP Margani Bharat TDP News Rajamundry News Rajamundry MP Adireddy Srinivas

సంబంధిత కథనాలు

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

Rajahmundry Crime: రూ.50 లక్షల ఇస్తే రూ.60 లక్షల 2 వేల నోట్లు అని నమ్మించి, వ్యాపారిని నట్టేట ముంచేశారు!

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?