News
News
వీడియోలు ఆటలు
X

Pawan Kalyan: రాజమండ్రి పరిసరాల్లో పవన్ కల్యాణ్ టూర్, రాత్రికి రాత్రే ప్రభుత్వం ప్లాన్ - రైతు ఆవేదన

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేడు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో జరగనుంది.

FOLLOW US: 
Share:

Pawan Kalyan East Godavari Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జనసేనాని పర్యటన కొనసాగనుంది. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరామర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేడు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కోలమూరు, కొంతమూరు, క్వారీ సెంటర్, లాలాచెరువు, బొమ్మూరు సెంటర్, రాజవోలు మీదుగా కడియం ఆవలో పర్యటిస్తారని జనసేన జిల్లా అధ్యక్షుడు దుర్గేష్ చెప్పారు.

‘‘రాత్రికి రాత్రి పవన్ కల్యాణ్ గారు వస్తున్నారని ఒక రెండు లారీలు పంపి తడిచిన ధాన్యాన్ని కొంటున్నమని ప్రభుత్వం చెబుతోంది. ఇది సరైన పద్దతి కాదు, ప్రతి గింజా కొంటాం అన్నారు, ఎందుకు కొనట్లేదు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం?’’ అని కడియం గ్రామ రైతు ఆవేదన చెందిన వీడియోను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అక్కడి పార్టీ నేతలు స్వాగతం పలికారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజమండ్రి నగరం - బొమ్మూరు - రాజవోలు మీదుగా  రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని ఆవడి భూములలో దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకొని నష్టపోయిన రైతులతో మాట్లాడతారు. తర్వాత పి.గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడతారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం మండలం పప్పుల వారి పాలెంలో స్వల్ప ఉద్రిక్తత జరిగింది. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో పప్పులవారిపాలెం సెంటర్‌లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పూలదండ వేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పూలదండ వేసేందుకు అనుమతి కావాలంటూ అడ్డుకున్న పోలీసులతో జనసేన నేతలు గొడవకు దిగారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్‌లో దిగగానే ఆయన పర్యటించే మండలాల్లో పవర్ కట్ చేశారంటూ జనసైనికులు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published at : 10 May 2023 03:21 PM (IST) Tags: Rajahmundry Pawan Kalyan Janasena news crop loss farmers Kadiam

సంబంధిత కథనాలు

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?