అన్వేషించండి

Pinepe Vishwaroop: సీఎం పక్కన మోకాళ్లపై కూర్చొని ఫోటో: అదే జరిగితే రాజకీయాల్నించి తప్పుకుంటా - మంత్రి స్పందన

అమలాపురం మండలం భట్నవిల్లిలోని తన ఇంటివద్ద శనివారం మంత్రి పినిపే విశ్వరూప్ విలేకరులతో మాట్లాడారు. 

Pinepe Vishwaroop: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీల జమ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం పక్కన మోకాళ్లపై కూర్చుని ఫోటో దిగేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. అయితే, మంత్రికి అవమానం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సోషల్‌ మీడియాతోపాటు కొన్ని ప్రధాన మీడియాల్లో దళిత మంత్రి విశ్వరూప్‌కు అవమానం జరిగిందన్న విమర్శలు వచ్చాయి. మీటింగ్‌లో స్టేజీ పై కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా వేయలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు దీన్ని బాగా హైలెట్ చేశారు. తాజాగా ఈ అంశంపై మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని తన ఇంటివద్ద శనివారం మంత్రి పినిపే విశ్వరూప్ విలేకరులతో మాట్లాడారు. 

తనకు ఆ సభలో ఎలాంటి అగౌరవమూ కలగలేదని మంత్రి స్పష్టత ఇచ్చారు. తాను సంతోషంగానే ఉన్నానని, తన గౌరవానికి భంగం కలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను కూర్చోవడం గానీ, ఇతరులు తనను కింద కూర్చోబెట్టడం కానీ జరగలేదని అన్నారు. తనకు అవమానం జరిగిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. సభ వేదికపై తాను మోకాళ్లపై కూర్చున్న తీరుపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. 

వారు ఫోటో దిగుతున్నప్పుడు తాను బయట ఉన్నానని.. ముఖ్యమంత్రి పిలిస్తేనే వేదికపైకి వెళ్లానని మంత్రి చెప్పారు. వెనకనున్న మహిళలకు అడ్డుగా ఉండొద్దనే ఉద్దేశంతోనే ఫొటో కోసం తాను మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చిందని వివరించారు. దళిత మంత్రిని అవమానించారని ప్రచారం చేయడం తగదని అన్నారు.

ఏబీపీ దేశంతో ఆయన మాట్లాడుతూ.. ‘‘సున్నా వడ్డీ జమ కార్యక్రమం సందర్భంగా గుర్తు కోసం తీస్తున్న ఫోటో అది. అక్కడ కుర్చీ లేకపోవడంతో ఓ సోదరి కుర్చీలో కూర్చోవాలంటూ లేచి నిల్చుంటే నేనే ఆమెను కూర్చోబెట్టాను. వెనుక ఉన్న సోదరీమణులు ఫోటోలో పడరేమోనని మోకాళ్లపై కూర్చునేందుకు ప్రయత్నించాను. కానీ ముఖ్యమంత్రి వద్దని వారించి కుర్చీ వేయాలని అక్కడున్నవారికి సూచించారు. కానీ సమయం మరింత వృధా అవుతుందని భావించి తానే కుర్చీ వద్దని కూర్చుని ఫోటో తీయించుకున్నామని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. 

ఫ్లెక్సీల వివాదంలోనూ నిజం లేదని వెల్లడి

సీఎం జగన్ అమలాపురం పర్యటనలో భాగంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలోనూ మంత్రి పినిపే విశ్వరూప్ విమర్శలు ఎదుర్కొన్నారు. తన ఇద్దరు కుమారుల ఫ్లెక్సీల్లో తాను లేకపోవడం, తన ఫ్లెక్సీల్లో కుమారులు లేకపోవడం స్థానికంగా అనుమానాలకు తావిచ్చింది. వారి కుటుంబంలో కలహాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే, తన పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి, రెండో కుమారుడు శ్రీకాంత్‌ పేర్లతో అయిదేసి చొప్పున ఫ్లెక్సీలు వేయించామని, వాటన్నింటినీ తానే డిజైన్‌ చేయించానని మంత్రి చెప్పారు. 

తన కుమారుల ఫ్లెక్సీల్లో తన పేరు, తన ఫ్లెక్సీల్లో కుమారుల పేర్లు లేకుండానే వేయించడం తాను తీసుకున్న నిర్ణయమేనని అన్నారు. దీని ఆసరాగా తీసుకుని కుటుంబంలో కలహాలు ఉన్నాయని ప్రచారం చేయడం బాధించిందని పినిపే విశ్వరూప్ అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget