అన్వేషించండి

Kakinada Rural News : కాకినాడలో కూటమిలో కుంపటి.. టీడీపీ, జనసేనలో విభేదాలు, పిల్లి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?

Kakinada Rural News : కాకినాడ జిల్లాలో కూటమిలో నాయకుల మధ్య ఐక్యత బీటలు వారుతోందా అన్న చర్చకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి..

Kakinada Rural News : కాకినాడ రూర‌ల్ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మి భ‌ర్త‌, టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త పిల్లి స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మీడియా స‌మావేశంలో ఆయ‌న లేవ‌నెత్తిన ప‌లు అంశాలు చ‌ర్చ‌కు దారితీశాయి. టీడీపీ నాయ‌కుల‌కు ప్ర‌ధాన్య‌తనివ్వ‌డం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు. అయితే కాకినాడ జిల్లాలోని కూటమిలో కుంపటి నివురు గప్పిన నిప్పులా రాజుకుంటుందని చర్చ సాగుతోంది.
ఇప్పటికే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోను ద్వితీయ శ్రేణి నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఆరోపించటంపై కాకినాడ జిల్లాలో కూటమి ఐక్యతపై అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి.

టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కులుగా గుర్తింపు... రెండు సార్లు ఎమ్మెల్యేగా ...

కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకు అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన దంప‌తులుగా కాకినాడ రూర‌ల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మి, ఆమె భ‌ర్త  పిల్లి స‌త్య‌నారాయ‌ణ‌మూర్తికి పేరు ఉంది. ఎమ్మెల్యేగా అనంత‌లక్ష్మి ఉన్న‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేట‌ర్‌గా ఆమె భ‌ర్త స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి వ్య‌వ‌హ‌రిస్తుంటారు.1999 అప్ప‌టి సంప‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీచేసి అనంత‌ల‌క్ష్మి గెలిచారు. ఆ త‌రువాత నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్యతలు చూస్తున్న ఈ దంప‌తులు టీడీపీకు అత్యంత విశ్వ‌స‌నీయ‌మైన నాయ‌కులుగా గుర్తింపు పొందారు.. ఆ త‌రువాత 2014లో టీడీపీ త‌ర‌పున కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుపై పోటీచేసి 9 వేల‌కుపైగా మెజార్టీ పొంది విజ‌యం సాధించారు. 2019లో కూడా పిల్లి అనంత‌ల‌క్ష్మికే ప్ర‌ాధాన్య‌త ఇచ్చి కాకినాడ రూర‌ల్ టీడీపీ సేటు ఇచ్చి పోటీలో దింపింది. అయితే మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు విజ‌యం సాధించారు..
 
2024లో తీవ్ర అసంతృప్తి మ‌ధ్య అంగీకారం..

ఆ త‌రువాత కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య క‌ర్త‌లుగా కీల‌క బాధ్యతలు స్వీక‌రించిన పిల్లి దంప‌తులకు 2024లో మాత్రం తీవ్ర నిరాశే ఎదుర‌య్యింది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా ఏర్ప‌డిన నేప‌థ్యంలో కాకినాడ రూర‌ల్ జ‌న‌సేన పార్టీక కేటాయించ‌డంతో పిల్లి అనంత‌ల‌క్ష్మి, స‌త్య‌నారాయ‌ణ‌మూర్తిల అనుచ‌రులు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో కాకినాడ‌లోని వీరి నివాసం వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది.. అధిష్టానం పిలుపుతో ఉన్న‌ఫ‌ళంగా అమ‌రావ‌తి వెళ్లిన దంప‌తులు చివ‌ర‌కు బుజ్జ‌గింపుతో వెన‌క్కి త‌గ్గి జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థి పంతం నానాజీ గెలుపునకు ప‌నిచేశారు...

అసంతృప్తితోనే రాజీనామా..

కాకినాడ రూర‌ల్‌ టీడీపీ కో- ఆర్డినేటర్ పదవికి  రాజీనామా చేస్తున్న‌ట్లు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మితో క‌లిసి పిల్లి స‌త్య‌నారాయ‌ణమూర్తి ప్ర‌క‌టించారు. తెలుగుదేశం పార్టీకి సముచిత స్థానం కల్పించడంలో పార్టీ విఫలమైందని జనసేనకు చెందిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) పథకాలలో టీడీపీకి ఇవ్వవలసిన 50శాతం వాటాను ఇవ్వకుండా చేస్తున్నారని దానివల్ల కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నాననే మనస్థాపనతో టీడీపీ ఇచ్చిన కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. గడిచిన 14 నెలలలో గెలిచిన ఎమ్మెల్యే నానాజీ కనీసం తమ వంక కూడా చూడకపోగా టీడీపీ కార్యకర్తలను, నాయకులను కానీ పట్టించుకునే పరిస్థితి కూడా లేదని పిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయలేకపోతున్నానే బాధతో రూరల్ కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
 
నియోజకవర్గ అబ్జర్వర్‌గా ఉన్న రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఏకపక్ష నిర్ణయాలతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కోకో ఆర్డినేటర్గా ఉన్న కటకంశెట్టి సత్య ప్రభాకర్ (బాబీ) రూరల్ నియోజకవర్గం పార్టీలో విభేదాలు తీసుకొచ్చారని అన్నారు. తనను రాజకీయంగా ఎదగడానికి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తప్పుడు రాజకీయాలను నిలువరించవలసిన స్థానంలో ఉన్న అబ్జర్వర్ కుడిపూడి గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్నారని పిల్లి ఆరోపించారు. తాను 40 ఏళ్ల క్రితం పార్టీలో చేరానని నేటికీ అదే పార్టీలో ఉన్నానని చెప్పారు. తాను చనిపోయిన తర్వాత కూడా టీడీపీ జెండా తనపై కప్పి శ్మశానానికి తీసుకెళ్లడమే తన చివరి కోరికని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వర్మ బుజ్జగింపుతో వెనక్కు తగ్గుతారా...
 
పిల్లి సత్యనారాయణమూర్తి తన పదవికి రాజీనామా వ్యవహారంపై టిడిపి అధిష్టానం దృష్టి సారించింది.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిల్లి సత్యనారాయణ, అనంత లక్ష్మీ దంపతులను కలిసి చర్చించారు.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు..

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget