అన్వేషించండి

KA Paul: వచ్చే ఎన్నికల్లో నేను ఇక్కడి నుంచే పోటీకి - స్పష్టం చేసిన కేఏ పాల్, నటి జయసుధపైనా ఆరోపణలు

Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి, జేడీ లక్ష్మీ నారాయణ కడప నుంచి పోటీ చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తాను ఎంపీగా గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.

Andhra Pradesh: ఆంధ్ర రాష్ట్రానికి ప్రధాని మోదీ చాలా అన్యాయం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఇలా ఏ ఒక్కటి ఇవ్వలేదని తెలిపారు. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ బీజేపీకి తొత్తులుగా మారారంటూ వ్యాఖ్యానించారు. కీలకమైన గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోడీ స్పందించాలని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్.. మోదీని గెలిపించాలని ఎందుకు అంటున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు సింగపూరు చేస్తానన్నారని.. ఇప్పుడు ఏం చేశారని దుయ్యబట్టారు. జగన్ బెస్ట్ సీఎం అనిపించుకుంటానని చెప్పి వరస్ట్ సీఎంగా తయారయ్యారని విమర్శించారు.

జయసుధ క్రైస్తవులను రక్షించడానికి బీజేపీలో చేరానని చెప్పడం దారుణం అని కేఏ పాల్ పేర్కొన్నారు. బీజేపీలో చేరడం దేవుని ద్రోహి, క్రీస్తు ద్రోహి అంటూ కామెంట్లు చేశారు. 50 కోట్ల కోసమే ఆమె పార్టీలో చేరిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని అన్నారు. స్టీల్ ప్లాంటిని సాధించుకుందామని ప్రజలకు చెప్పుకొచ్చారు. అలాగే సగం పూర్తయిన రాజధానిని కూడా కట్టలేకపోయారని ఫైర్ అయ్యారు. తాను విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. అలాగే జేడీ లక్ష్మీ నారాయణ కడప నుండి పోటీ చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని.. విశాఖ ఎంపీగా తాను కచ్చితంగా అధికారంలోకి వస్తానని జోస్యం చెప్పారు. 

నిన్నటికి నిన్న కోనసీమ జిల్లాలో కేఏ పాల్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ లో పాలన మారాలంటే పాల్ రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో కోతకు గురవుతున్న భూములను ఆ ప్రాంత రైతులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఏడాది గోదావరికి వచ్చే వరదల వలన సారవంతమైన లంక భూములు పదుల సంఖ్యలో ఎకరాలు కోతకు గురై రైతులు ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వాలకు చీమైనా కుట్టడం లేదని దుయ్యబట్టారు. ఈ భూములు చాలా విలువైనవని, ఐదు ఎకరాలు అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుతో గోదావరి వెంబటి ఉన్న లంక పొలాలు నది కోతకు గురవకుండా పూర్తిస్థాయిలో గ్రోయన్స్ నిర్మించవచ్చని అన్నారు. ఈ చిన్నపాటి సూత్రాన్ని కూడా ఈ ప్రభుత్వాలు తెలుసుకోలేకపోవడం చాలా ఘోరమని విమర్శించారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల గోస అవసరం లేదని వారి విలాసాలకే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు. ప్రజలు ఓట్లను అమ్ముకుంటే ఇలాంటి పరిస్థితులే చూడవలసి వస్తుందని అన్నారు. ఎలాగైనా గెలవాలనే సిద్ధాంతాన్ని నమ్మే ఎన్నికల సమయంలో అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతున్నారని అన్నారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీని విడిచి బయటకు వచ్చి ప్రజాశాంతి పార్టీతో కలిసి పోటీ చేయాలని అన్నారు. ‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోదీని గెలిపించమని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి వెళ్లి మోదీకి మసాజ్ చేస్తారు. మన ఆస్తుల్నే వాళ్లు దోచుకుంటున్నారు. 8 లక్షల కోట్ల విలువ చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంటును అంబానీ, ఆదానికి 5 వేల కోట్లకి ఇచ్చేయబోయారు. నేనే ఆపాను. పోరాడుతున్నాను. అధికారంలో లేనప్పుడు ఇంత చేశాను. ఇప్పటికే లక్ష కోట్లు తెస్తానంటే నన్ను తేనివ్వడం లేదు. మీడియా వాళ్లు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కానీ, ఈ రాజకీయ నాయకులు పట్టించుకోట్లేదు’’ అని కేఏ పాల్ అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Vetlapalem Blast :వేట్ల‌పాలెం పేలుడు ఘ‌ట‌నపై సిట్ విచార‌ణ పూర్తి! భారీ విస్ఫోటనానికి కారణం తేల్చిన అధికారుల బృందం!
వేట్ల‌పాలెం పేలుడు ఘ‌ట‌నపై సిట్ విచార‌ణ పూర్తి! భారీ విస్ఫోటనానికి కారణం తేల్చిన అధికారుల బృందం!
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Vs GT Result Updates: రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Embed widget