By: ABP Desam | Updated at : 11 May 2023 12:14 PM (IST)
ప్రజలకు అభివాదం చేస్తున్న పవన్
అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పంటను పరిశీలించి ఆపై రైతులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న జనసేన ప్రాంతీయ పార్టీ కార్యాలయంలో నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకోనున్నారు. దీనికోసం రైతులతో జనసేనాని మాట్లాడేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు.. మరికొంత సేపట్లో రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకుని రైతులకు న్యాయం జరిగేందుకు ప్రయత్నించనున్నారు.
AERIAL VIEW - జనసేనాని పర్యటించే మార్గంలో ఘనస్వాగతం పలికిన కొత్తపేట నియోజకవర్గ అవిడి గ్రామం, రాజుల పాలెం ప్రజలు, జనసేన శ్రేణులు#JSPWithAPFarmers pic.twitter.com/Mz06i60gus
— JanaSena Party (@JanaSenaParty) May 11, 2023
నష్టపోయిన ప్రతీ గింజకు పరిహారం ఇచ్చేవరకు పోరాడతాం..
అకాల వర్షాల వల్ల ఏపీలో అమితంగా వరి వేసిన రైతులు నష్టపోయారని, వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు వరిసాగు ఉంటుంద, దీనిలో దిగుబడి 14 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉండగా కేవలం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అన్నారు. తాము దొంగతనం చేయడంలేదు, దోపిడీలు చేయడంలేదు, కాంట్రాక్టు, అవినీతి చేడయంలేదని కష్టపడి చేమటోడ్చి ప్రజలకు అన్నంపేట్టే వ్యవసాయం చేస్తుంటే మాకు గిట్టుబాటు రావడంలేదని వాపోయారన్నారు. ప్రభుత్వం ముందే ధాన్యం కొనుగోలుచేసి ఉంటే ఈ అకాల వర్షాలకు నష్టపోయే వాళ్లం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితిలో లేరన్నారు. కొనుగోలు చేసేందుకు సంచులు ఇవ్వని ప్రభుత్వం రాత్రికి రాత్రి కొనుగోల చేయడానికి వచ్చాయాన్నరు. రైతులు కంట కన్నీరు పెట్టకూడదని జనసేన కోరుకుంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఏపీలోని ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు ప్రతీ గింజకు నష్టపరిహారం వచ్చే వరకు మీ వెన్నంటే జనసేన పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాత్రికి రాజమండ్రిలోనే బస చేసిన పవన్..
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ రాత్రికి బస చేసే షెడ్యూల్ ముందుగా లేకపోయినప్పటికీ రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా గురువారం వారితో నేరుగా ముఖాముఖీగా మాట్లాడాలని జనసేనాని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్లో మార్పులు చేసి రాజమండ్రి పార్టీ కార్యాలయంలో నష్టపోయిన పలు ప్రాంతాలకు చెందిన రైతుల బాధలు నేరుగా తెలుసుకునే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. పవన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులు జనసేన అధ్యక్షుడు పవన్ తో ముఖాముఖిలో పాల్గొననున్నారు.
AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్ పరీక్ష, హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి!
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్నగర్ టూర్లో కేటీఆర్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు
AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!
AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్సెట్ పరీక్ష, వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో!!
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్లో కాల్మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?
Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!