అన్వేషించండి

Kakinad DCCB Chairman: కాకినాడ డీసీసీబీ ఛైర్మన్‌ ప‌ద‌వి కోసం టీడీపీ, జ‌న‌సేన పోటీ - పవన్ జోక్యంతో మారిన సీన్

East Godavari News:కాకినాడ డీసీసీబీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం టీడీపీ, జ‌న‌సేన పోటీ పడ్డాయి. అయితే ఇది చివరకు జనసేనకు దక్కబోతున్నట్టు సమాచారం అందుతోంది.

East Godavari News: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన కాకినాడ డీసీసీబీ పదవి కోసం టీడీపీ, జనసేన హోరాహోరీగా పోటీపడుతున్నాయి. చివరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కలుగు చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ఈ పదవిని జనసేన ఖాతాలోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ పదవి కోసం టీడీపీ నుంచి అనేక మంది నాయకులు తమ ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులు లేఖలతో అధిష్ఠానం వద్దకు చేరారు. కానీ అది వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. అమలాపురానికి చెందిన మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణరావు తనయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ పదవి కోసం ఆయన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌తో రికమండేషన్‌ చేయించుకున్నా ఫలితం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు సంబందించి టిక్కెట్టు త్యాగం చేసిన ముగ్గురిలో ఎవరో ఒకరికి ఈ పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో పవన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. 

పోటీలో జనసేనలో ఆ ముగ్గురు.. 
కాకినాడ డీసీసీబీ ఛైర్మన్‌ పదవి అనగానే చాలా మంది ఆశావాహుల పేర్లు వినిపించాయి. ప్రధానంగా టీడీపీ నుంచే ఎక్కువ మంది ఛైర్మన్‌ గిరీ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వీరిలో జగ్గంపేట ఎమ్మెల్యే తనయుడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, కటకంశెట్టి బాబి, పిల్లి సత్తిబాబు, మెట్ల రమణబాబులు ముందు వరుసలో ఉన్నారు. అయితే ఇవేమీ వర్కవుట్‌ కాలేదని తెలుస్తోంది. 

జనసేన నుంచి ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్తపేట నియోజకవర్గం నుంచి తనకు దక్కాల్సిన సీటు త్యాగం చేసిన బండారు శ్రీనివాసరావు పేరే ప్రముఖంగా వినిపిస్తుండగా మండపేట నుంచి వేగుళ్ల లీలాకృష్ణ పేరు అదే వరుసలో ఉంది. వీరితోపాటు కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే డీసీసీబీ పని చేసేది పీఏసీఎస్‌ల ప్రాతిపదికన కాగా ఇవి అత్యధికంగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ఈ పదవికి కోనసీమ ప్రాంతానికి చెందిన జనసేన నేతకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదన జరుగుతోంది. అందుకే కొత్తపేటకు చెందిన బండారు శ్రీనివాస్‌కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నట్లు తెలుస్తోంది. 

వేల మంది రైతుల‌తో ముడిప‌డిన కాకినాడ డీసీసీబీ..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు వేల మంది ఉంటారు. వీరి కార్యకలాపాలన్నీ గ్రామాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలతో ముడిపడి ఉంటాయి. వ్యవసాయ రుణాల నుంచి ఇతర అవసరాలన్నీ ఈ సంఘాలే తీరుస్తాయి. అయితే వీటన్నింటిపైనా కీలకంగా పర్యవేక్షణ చేసే డీసీసీబీ ఏటా రూ.10 వేల కోట్ల వరకు టర్నోవర్ చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 298 పీఏసీఎస్‌లు ఉండగా ఇందులో తూర్పుగోదావరి 49, కాకినాడ 72 అత్యధికంగా కోనసీమ జిల్లాలో 166, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాకు సంబంధించి 11 పీఏసీఎస్‌లు ఇందులో కలిసే ఉన్నాయి.

స‌మ‌స్య‌ల వల‌యంలో కాకినాడ డీసీసీబీ
వాస్త‌వానికి డీసీసీబీ ఇంకా మంచి ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకుపోవాల్సిన ప‌రిస్థ‌తి ఉండ‌గా అవినీతి ఆరోప‌ణ‌లు, అనేక పెండింగ్ స‌మ‌స్య‌లు వెన‌క్కు లాగుతున్నాయి. దీర్ఘకాలంగా సభ్యత్వ రుసుంల నుంచి పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. 2018తర్వాత ఇప్పటి వరకు సొసైటీలకు, బ్యాంక్ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరపలేదు. దీంతో సభ్యత్వ నమోదు పునరుద్ధరణతోపాటు మార్పులు, చేర్పులు, తుది జాబితాల వెల్లడి, ఇలా కనీసం ఏడాది పాటైనా బ్యాంక్, సొసైటీల ఎన్నికలకు సమయం కావాలి. దీంతో మరోసారి సొసైటీలు, బ్యాంక్ పాలకవర్గాలను నామినేటెట్ విధానంలోనే నియమించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గుర్తించి రాష్ట్రంలో అతిపెద్దదైన ఉమ్మడి తూర్పు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవితోపాటు డైరెక్టర్ల పదవుల కోసం మూడు పార్టీల్లో హేమాహేమీలంతా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget