అన్వేషించండి

TDP News: అమలాపురంలో టీడీపీ ఆచితూచి అడుగులు, ఎంపీ సీటుకు తీవ్రమైన పోటీ! తేల్చని అధిష్టానం

Andhra Pradesh News: తెలుగుదేశం పార్టీలో ఎంపీ టిక్కెట్లకు తీవ్రమైన పోటీ, అమలాపురం సీటు కోసం బాలయోగి తనయుడు హరీశ్, మాజీ ఎంపీ బుచ్చిబాబు తనయ సత్యశ్రీ పోటీ పడుతున్నారు.

TDP Amalapuram Candidate: అమలాపురం: రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం‍ (Tdp) పార్టీకి చావోరేవో లాంటివి. ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిందే. లేకుంటే మరో ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. అది భరించే ఓపిక రెండూ చంద్రబాబు (Chandrababu)కు గానీ, ఇటు తెలుగుదేశం పార్టీకి గానీ లేవు. ఇప్పటి వరకు సీఎం జగన్( Jagan) తన పాలనను జస్ట్ ట్రైలర్ అంటున్నారంటే.. మరోసారి పదవిలోకి వచ్చారంటే అనే మాటే తెలుగుదేశం నేతల్లో గుబులు పుట్టిస్తోంది. అందుకే ప్రతి ఒక్క తెలుగు తమ్ముడూ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నాడు. బహుశా చంద్రబాబు వయసు రీత్యా ఇవే చివరి ఎన్నికలు కావొచ్చని పార్టీలో వినిపిస్తోంది. నారా లోకేశ్‌( Lokesh)కి నిరూపించుకునేందుకు ఇదే సరైన సమయం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు పూర్తిస్థాయిలో లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. పార్టీని లోకేశ్‌ చేతిలో పెట్టాలంటే...అధికార పార్టీగానే పెట్టాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తెలుగుదేశానికి తప్పనిసరిగా కనిపిస్తోంది.

ఆచితూచి ఎంపిక
అభ్యర్థుల ఎంపికే సగం విజయం సాధించినట్లు చెబుతారు పెద్దలు. ఎందుకంటే పార్టీకి ఎంత పాజిటివ్ వేవ్ ఉన్నా సరైన అభ్యర్థిని నిలబెట్టకుంటే జనం ఓట్లు వేయరు. ఖచ్చితంగా అభర్థి గుణగణాలతోపాటు రాజకీయ నేపథ్యం, సామాజిక సమీకరణం అన్నీ బేరీజు వేసుకుని అభ్యర్థులను నిలపాల్సి ఉంటుంది. వైసీపీ( Ycp) ఇప్పటికే ఆరువిడతలుగా అభ్యర్థులను ప్రకటించి జగన్ రేసులో ముందు నిలిచారు. కానీ తెలుగుదేశం నుంచి ఇప్పటి వరకు ఒ‍క్క అభ్యర్థికి కూడా సీటు కన్ఫార్మ్ చేయలేదంటే... ఏ మేరకు వడపోత జరుగుతోంది అర్థం చేసుకోవాలి. పైగా జనసేన(Janasena)కు ఇచ్చే సీట్ల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చినట్లు లేదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు తీవ్ర తలనొప్పిగా మారింది. జనసేన ఎక్కువ సీట్లు కోరే జిల్లాలు ఇవే. ఇటు తెలుగుదేశానికి కూడా బాగా పట్టున్న జిల్లాలు ఇవే. జనసేనకు టిక్కెట్లు ఇచ్చిన చోట ఉన్న తెలుగుదేశం నేతలను మరోచోట సర్దుబాటు చేయాలి. వాటిని బేరీజు వేసుకునే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది..

అమలాపురం బరిలో ఎవరు..?
తెలుగుదేశంలో అధికారాల మార్పిడి చంద్రబాబు, లోకేశ్‌కే పరిమితం కాలేదు. మిగిలినచోట్ల సీనియర్లకు స్వస్తి చెప్పి పార్టీలో యువరక్తాన్ని ఎక్కించాల్సి ఉంది. అందుకే ఈసారి 40శాతం సీట్లు యువతకేనని మొదటి నుంచీ చెబుతున్నారు. దీంతో రాజకీయ వారసులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అమలాపురం( Amalapurm) ఎంపీ టిక్కెట్ మాజీ లోక్‌సభ స్వీకర్ దివంగత బాలయోగి తనయుడు గంటి హరీశ్ మాథుర్‍(Ganti Harish Mathur) మరోసారి కోరుతున్నారు. గత ఎన్నికల్లో ఇదేస్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన... ఈసారి ఎలాగైనా విజయం సాధించి తన తండ్రి అడుగుపెట్టిన పార్లమెంట్‌ గడప తొక్కాలని కంకణం కట్టుకున్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఎంపీ టిక్కెట్ ఇవ్వకున్నా.. అమలాపురం అసెంబ్లీ సీటు అయినా ఇవ్వాలని హరీశ్ కోరుతున్నారు. ఆయన తండ్రి బాలయోగి చేసిన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఆ సానుభూతితోనే గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా... వైసీపీ వేవ్‌తోపాటు టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి ఓటమిపాలయ్యారు. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవని... ఖచ్చితంగా నెగ్గి తీరతామని ఆయన దీమా వ్యక్తం చేస్తున్నారు.

అమలాపురంలో తీవ్రమైన పోటీ
అమలాపురం టిక్కెట్ తనదేనని హరీశ్ దీమాగా ఉండగా.... కొత్త పేర్లు, అభ్యర్థులు తెరపైకి వచ్చారు. గోపవరంకు చెందిన మాజీ ఎంపీ బుచ్చిబాబు పెద్ద కుమార్తె పాము సత్యశ్రీ( Satya Sri) తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబును కలిసిన ఆమె... అమలాపురం లోక్‌సభ సీటు ఆశిస్తున్నారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటంబం కావడంతో ఆమె కూడా టిక్కెట్‌పై దీమాగా ఉన్నారు. మహిళా కోటాలో తన పేరు పరిశీలించే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డు స్థానాల్లోనే పోటీ ఈస్థాయిలో ఉందంటే... ఓపెన్ కేటగిరిలో టిక్కెట్లు కేటాయింపు చంద్రబాబుకు కత్తిమీద సాములాంటిదే.

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget