అన్వేషించండి

PV Ramesh On Andhra lands: ఏపీలో అసైన్డ్ ల్యాండ్స్ స్కాంపై విచారణ చేయాలి - రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ డిమాండ్

AP Assigned Lands Issue : ఏపీ ప్రభుత్వంపై పీవీ రమేష్ మరోసారి కీలక ఆరోపణలు చేశారు. సీస్‌పై వస్తున్న అసైన్డ్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్ ఆరోపణల నేపధ్యంలో పీవీ రమేష్ ట్వీట్ కలకలం రేపుతోంది.

PV Ramesh On AP Assigned Lands Issue :  8 ఎకరాల విషయంలో జార్ఖండ్‌ సీఎం   జైలుకు వెళ్లారని మరి ఏపీలో వేల కొద్దీ అసైన్డ్ ల్యాండ్స్ ను రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, కాంట్రాక్టర్ల సంగతేమిటని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన పెట్టిన ట్వీట్ కలకలం రేపుతోంది. 

1953లో ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ఎకరాలను పేదలకు .. జీవనోపాధి కోసం అసైన్ చేశారని పీవీ రమేష్ తెలిపారు. ఈ భూమి పూర్తిగా వారి జీవనోపాధి కోసమే కానీ అమ్మకానికి కాదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2023లో అసైన్డ్ ల్యాండ్స్ చట్టానికి సవరణ చేసిందని తెలిపారు. ఈ చట్టం వల్ల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ ల్యాండ్స్ ను పెద్ద ఎత్తున ధనవంతులు, అధికార బలం ఉన్న వారు లాగేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఏపీ ప్రభుత్వం 2023లో తీసుకు వచ్చిన చట్టం భూకబ్జాదారులకు ఓ వరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాలు చేతులు మారిపోయే ప్రమదం ఉందన్నారు. 

తక్షణం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు అసైన్డ్ ల్యాండ్స్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విచారణ చేయించాలని .. వీటి వెనకు ఉన్న స్కాముల్ని బయట పెట్టాలని కోరారు. 

 
ప్రస్తుతం ఏపీలో అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో వివాదం జరుగుతోంది. సీఎస్ జవహర్ రెడ్డి,  ఆయన కుమారుడు దాదాపుగా ఎనిమిది వందల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ భూముల్ని బినామీల పేరుతో కొనుగోలు చేశారని వాటి విషయంలోనే రహస్య పర్యటనలు చేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. ఆయన పలువురు బినామీ పేర్లను కూడా ప్రకటించారు. అయితే తాను  కానీ.. తన కుమారుడు కానీ విశాఖ, బోగాపురం ప్రాంతంలో ఎక్కడా భూములు కొనలేదని.. అసైన్డ్ ల్యాండ్స్ తమ పేరు మీద లేవని అంటున్నారు. మూర్తి యాదవ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చని.. సీబీఐతో విచారణ చేయించాలని మూర్తి యాదవ్ అంటున్నారు.                              

మరో వైపు సీఎస్ పై టీడీపీ కూడా తీవ్రమై ఆరోపణలు చేస్తోంది. ఈ సమయంలో అసైన్డ్ ల్యాండ్ చట్టం .. భూకబ్జా దారుల కోసమేనని .. విచారణ చేయించాలని పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

టాప్ హెడ్ లైన్స్

Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Breaking News: సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
సాయంత్రం 5 గంటలకు రండి, నిజాలేంటో తేల్చేద్దాం.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి ఛాలెంజ్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget