అన్వేషించండి

Janasena : సీమ బానిస సంకెళ్లలో ఇరుక్కుపోయింది - చిత్తూరు ఎమ్మెల్యే చేరిక కార్యక్రమంలో పవన్ కీలక వ్యాఖ్యలు

Andhra News : రాయలసీమ ఐదుగురు రెడ్డి నేతల కబంధహస్తాల్లో ఇరుక్కుందని పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

Janasena party:  రాయలసీమ ఐదుగురు రెడ్డి నేతల హస్తాల్లో ఇరుక్కుపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమ గురించి మర్చిపోవచ్చన్నారు. ఎర్రచందనం దుంగలు కొట్టే వారిని ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారని వారు గెలిస్తే ఏం చేస్తారన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది 2009  కాదని.. 2024 అని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని...కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామన్నారు. ప్రజా  పోరాటాలకు రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు కానీ.. ఎన్నికలు వచ్చే సరికి వెనక్కి తగ్గుతారన్నారు.                                        

సమావేశంలో తనకు సలహాలు ఇచ్చే ప్రయత్నం  చేసి వైసీపీలోకి వెళ్లిన కాపు నేతలపై సెటైర్లు వేశారు. అలా చేయాలి.. ఇలా చేయాలని లేఖాలు రాసిన వాళ్లు.. సలహాలు ఇచ్చిన వాళ్లు వైసీపీలో చేరిపోయారన్నారు. తనకు సీట్లు ఇవ్వడం.. తీసుకోవడం తెలియదా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడే వాళ్లు పద్దతిగా మాట్లాడాలనిసూచించారు. పవన్ కల్యాణ్ కు అదే పనిగా లేఖలు రాసిన హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. ముద్రగ కుటుంబం కూడా వైసీపీలో చేరాలని నిర్ణయించుకుంది.               

 చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ( MLA Arani Srinivas ) ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి జనసేన కండువా కప్పి పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆరణి శ్రీనివాస్ నేతృత్వంలో జనసేనలోకి చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు చేరారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో నేను ఎన్నో అవమానాలకు గురయ్యాను అని చెప్పుకొచ్చారు. నేను వైసీపీ బాధితుణ్ని.. బలిజ సామాజిక వర్గం నుంచి నేనొక్కడ్నే ఎమ్మెల్యేను.. కానీ నన్ను వైసీపీ అవమానించింది.. పవన్ కళ్యాణ్ ప్రజల కోసమే తపిస్తారు.. పవన్ ఒక్కో మాట.. ఒక్కో తూటా.. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. పవన్ కళ్యాణ్ విధానాలు ఆకర్షించాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పేర్కొన్నారు.                                         
   
ఇవాళ్టి నుంచి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో నడుస్తా అంటూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ వెల్లడించారు. రాయలసీమలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను అని పిలుపునిచ్చారు.రాయలసీమలోనే కాదు.. గ్రేటర్ రాయలసీమలో నేను జనసైనికులతో ( Janasena party ) కలిసి నడుస్తా.. జనసైనికులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. పవన్ కోసం పార్టీ కోసం పని చేస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ నన్ను బావిలో దూకమంటే దూకడానికి కూడా సిద్దంగా ఉన్నాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ వెల్లడించారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget