Breaking News Telugu Live Updates : ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లా నెరడిగోండ మండలం కుష్టి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం కొల్హారి వద్ద ఉన్న స్టోన్ క్రషర్ మిషన్ నుంచి కంకర్ లోడు తీసుకెళుతున్న టిప్పర్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. టిప్పర్ వాహనం వంతెనపై నుండి కింద పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో విషాదం, చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్కారం చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ హెలికాప్టర్ లో రిషి కొండ చుట్టూ ఓ రౌండ్ వెయ్యాలి: అయ్యన్న పాత్రుడు
విశాఖ:- మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కామెంట్స్...
ఋషికొండ సహా విశాఖలో జరుగుతున్న దోపిడీని నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రధానికి ఉంది....
ప్రధాని మోదీ హెలికాప్టర్ లో రిషి కొండ చుట్టూ ఓ రౌండ్ వెయ్యాలి : అయ్యన్న పాత్రుడు
విశాఖ పర్యటనకు వస్తున్న మోడీకి ఇక్కడ పరిస్థితులను వివరించి చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకత్వం మీద ఉంది....
నన్ను, నా కుటుంబం పై దౌర్జన్యంగా తప్పుడు కేసులు పెట్టినప్పుడు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు....
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగట్టాలనే నేను మాట్లాడుతున్నాను..
ప్రపంచంలోని నియంతల లక్షణాలు అన్నీ కలిపిన వ్యక్తి జగన్ - యనమల
విశాఖ:- యనమల రామకృష్ణుడు కామెంట్స్.... జగన్ కక్ష అంతా ప్రజాస్వామ్యం, ప్రజల మీదే..... ప్రపంచంలో ఉన్న నియంతలకు ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటే..... ఆ లక్షణాలు అన్నీ కలిపిన వ్యక్తి జగన్.
జగన్ కు పరిపాలన రాదు...ఎకానమీ అంటే ఏంటో తెలియదు... 10లక్షల కోట్లు అప్పులు దిశగా ప్రభుత్వం వెళుతోంది....
సంవత్సరానికి లక్ష కోట్లు అప్పులు చెల్లించడానికే సరిపోతాయి... ప్రతీ నెలా అప్పులు తెచ్చినా....అభివృద్ధి కనిపించడం లేదు....
పెట్రోల్,డీజిల్ పై సబ్సిడీ ఇవ్వమని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకో లేదు...
తూర్పు తీరంలో భూములు మొత్తం జగన్ కబ్జాలోకి వెళ్లిపోతున్నాయి....
శ్రీకాకుళం నుంచి కృష్ణపట్నం వరకు భూములు అన్నీ సీఎం బినామీలు తీసుకుంటున్నాయి... ఆధారాలతో సహా నిరూపించడంకు సిద్ధం.... డైరెక్ట్ బెనిఫిట్ స్కీం కింద నేరుగా నిధులు ప్రజలకు చేరితే పేదరికం ఎందుకు పెరుగుతోంది.... రాష్ట్రంలో విద్య,వైద్య రంగాలు దెబ్బతిన్నా యి....
కేసిఆర్ నైతికంగా ఓడిపోయారు, ప్రజల్లో పలచబడి పోయారు - ఈటల రాజేందర్.
ఈటలరాజేందర్ ప్రెస్ మీట్ @ బీజేపీ ఆఫీస్, నాంపల్లి.
కెసిఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
మునుగోడులో ఒడిపోతున్ను అని తెలిసి కెసిఆర్ పక్క దారి పట్టించే ప్రయత్నం.
కేసిఆర్ నైతికంగా ఓడిపోయారు. ప్రజల్లో పలచబడి పోయారు. - ఈటల రాజేందర్.
దేశాన్ని కాపాడాలి ఆ భాధ్యత న్యాయవ్యవస్థ, ప్రజలు, యువత, మీడియా మీద ఉంది అంటూ కెసిఆర్ ముసలి కన్నీరు కాస్తున్నారు.
ఆ బాధనే తెలంగాణ కూడా అనుభవిస్తుంది. కెసిఆర్ తెలంగాణను అపహస్యం చేశారు.
మన గౌరవం మట్టిలో కలిపారు. కెసిఆర్ అసలు రూపం తెలంగాణ ప్రజలకు తెలిసింది.
తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడింది అని కెసిఆర్ మర్చిపోయి చక్రవర్తిలా రాజ్యం నడుపుతున్నారు.
నలుగురు ఎమ్మెల్యేలు పరమపవిత్రులు, నిప్పు కనికులు ఎలా అవుతారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.
2014 నుండి 2018 వరకు 25 మంది శాసన సభ్యులను చేర్చుకున్నారు.
2018 లో 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా కూడా..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఖతం పట్టించారు. 12 మంది ఎమ్మెల్యేలను కలుపుకున్నారు..
యాంటీ డిఫెక్షన్ చట్టంలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకొని చేరికలకు తెరలేపింది కెసిఆర్.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని కూర్చోబెట్టుకొని సంక్షేమ పథకాల చెక్కులను మంత్రులు అందిస్తున్నారు.
ఇది ప్రజాస్వామ్యం అపహస్య చెయ్యడం కాదా?
పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇచ్చావు అంటే ఇదేం ప్రజాస్వామ్యం అంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

