అన్వేషించండి

Paritala Sunitha: జగన్ పైశాచిక చర్యలు మానట్లేదు, వైసీపీ క్యాడర్‌నే రెచ్చగొడుతున్నారు - పరిటాల సునీత

AP News: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో చేసిన వ్యాఖ్యల మీద పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. ఏ చిన్న సంఘటన జరిగినా.. దానిపై రాద్దాంతం చేస్తూ రాష్ట్రపతి పాలన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Paritala Sunitha on YS Jagan: జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుళ్లు, కుతంత్రాలతో పాలన సాగిందని.. ఇప్పుడు అధికారం పోయాక కూడా ఆయన పైశాచిక చర్యలు మానడం లేదని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి విజయవాడలో చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగడం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. తన పాలనలో ఐదేళ్లూ.. కక్ష సాధింపులు, దాడులు, అక్రమ అరెస్టులతో కనిపించాయని అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా.. దానిపై రాద్దాంతం చేస్తూ రాష్ట్రపతి పాలన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శలు చేస్తూ.. ఎక్కడ ఎవరు వ్యక్తిగతంగా దాడులు చేసుకున్నా దానిని టీడీపీకి ఆపాదిస్తూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 30 రోజుల్లో 36 మంది వైసీపీ నేతలు హత్యకావించబడ్డారని... ఢిల్లీకి వెళ్లి ప్రచారం చేశారని మండిపడ్డారు. మరి ఆ 36 మంది వ్యక్తుల పేర్లు, వివరాలు ఇవ్వమని అడిగితే సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని విమర్శలు చేశారు. జగన్ రెడ్డి చేస్తున్న ఈ విష ప్రచారాల వలన రాష్ట్రానికే చెడ్డ పేరు తెచ్చేలా ఉందన్నారు. విజయవాడ సంఘటనలో జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్ ను సైతం రెచ్చగొడుతున్నారని సునీత అన్నారు. 

నేను చెప్పినా.. వైసీపీ క్యాడర్ వినదంటే.. దాని అర్థం ఏంటో తెలుసుకోవాలన్నారు. నీ హయాంలో ఎంత దౌర్జన్య కాండ జరిగిందో చెప్పడానికి రాప్తాడు నియోజకవర్గం ఒక్కటి చాలన్నారు. అదే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగాయా అని నిలదీశారు. రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టిస్తూ.. అభివృద్ధి కాకూడదన్న కుట్రతో జగన్ వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

గత 5 ఏళ్లల్లో జరిగిన వ్యవస్థల విధ్వంసాన్ని ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు సరిచేసి పరిపాలనను గాడిలో పెడుతున్నారన్నారు. శాంతిభద్రతలను కాపాడటం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమల్ని ఆకర్షించాలని ఆయన తపిస్తున్నారని సునీత అన్నారు. ఇలాంటి సమయంలో జగన్ చేస్తున్న కుట్రను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget