అన్వేషించండి

Paritala Sunitha: పరిటాల సునీత వినూత్న ఆలోచన, ప్రజల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు

Telugu News: పరిటాల సునీత తొలిరోజు చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు.

Paritala Sunitha Latest News: మాజీ మంత్రి పరిటాల సునీత ప్రజాసమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు సమస్యలు చెప్పుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు వెంకటాపురం లేదా అనంతపురం తరలివస్తున్నారు. ఇది ప్రజలకు ఒకింత భారంగా మారింది. అందుకే ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని పరిటాల సునీత భావించారు. ఇందులో భాగంగా తొలిరోజు చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరితో నేరుగా సునీత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓపికగా వారి సమస్యలు విన్నారు. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో తమ భూములను వైసీపీ నాయకులు దౌర్జన్యంతో ఆక్రమించారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 

ఎన్నో ఏళ్ల నుంచి తాము సాగులో ఉన్నప్పటికీ.. ఆన్ లైన్ లో నుంచి తొలగించి వైసీపీ నాయకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఎమ్మెల్యే ముందు వాపోయారు. తమ భూములు తమకు దక్కేలా చూడాలని విన్నవించారు. పింఛన్లు పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ తమకు ఇవ్వడంలేదని కొందరు.. గతంలో వచ్చే పింఛన్లను తొలగించారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేషన్ కార్డుల విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. వీటిపై కనీసం ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని పలువురు వినతులు అందజేశారు. చెన్నేకొత్తపల్లి గ్రామంలో పశువుల సంత ఏర్పాటు చేయాలని.. బీసీ కాలనీలో ఆలయ నిర్మాణం, స్థానిక ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, వైద్యులను నియమించాలని ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. Paritala Sunitha: పరిటాల సునీత వినూత్న ఆలోచన, ప్రజల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు

తాగునీటి సమస్య, నూతన గృహాలు మంజూరు తదితర సమస్యలు ఎక్కువగా కనిపించాయి. వీటిలో కొన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. మరికొన్నింటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. బడ్జెట్ కు సంబంధించిన అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పనులు చేపడుతామని సునీత అన్నారు. ఇక నుంచి ప్రతి మండలంలోనూ గ్రీవెన్స్ నిర్వహిస్తామని.. ప్రజలు వారి మండలానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. మంగళవారం రోజు కనగానపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Embed widget