అన్వేషించండి

Paritala Sunitha: పరిటాల సునీత వినూత్న ఆలోచన, ప్రజల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు

Telugu News: పరిటాల సునీత తొలిరోజు చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు.

Paritala Sunitha Latest News: మాజీ మంత్రి పరిటాల సునీత ప్రజాసమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు సమస్యలు చెప్పుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు వెంకటాపురం లేదా అనంతపురం తరలివస్తున్నారు. ఇది ప్రజలకు ఒకింత భారంగా మారింది. అందుకే ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని పరిటాల సునీత భావించారు. ఇందులో భాగంగా తొలిరోజు చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరితో నేరుగా సునీత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓపికగా వారి సమస్యలు విన్నారు. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో తమ భూములను వైసీపీ నాయకులు దౌర్జన్యంతో ఆక్రమించారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 

ఎన్నో ఏళ్ల నుంచి తాము సాగులో ఉన్నప్పటికీ.. ఆన్ లైన్ లో నుంచి తొలగించి వైసీపీ నాయకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఎమ్మెల్యే ముందు వాపోయారు. తమ భూములు తమకు దక్కేలా చూడాలని విన్నవించారు. పింఛన్లు పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ తమకు ఇవ్వడంలేదని కొందరు.. గతంలో వచ్చే పింఛన్లను తొలగించారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేషన్ కార్డుల విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. వీటిపై కనీసం ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని పలువురు వినతులు అందజేశారు. చెన్నేకొత్తపల్లి గ్రామంలో పశువుల సంత ఏర్పాటు చేయాలని.. బీసీ కాలనీలో ఆలయ నిర్మాణం, స్థానిక ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, వైద్యులను నియమించాలని ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. Paritala Sunitha: పరిటాల సునీత వినూత్న ఆలోచన, ప్రజల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు

తాగునీటి సమస్య, నూతన గృహాలు మంజూరు తదితర సమస్యలు ఎక్కువగా కనిపించాయి. వీటిలో కొన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. మరికొన్నింటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. బడ్జెట్ కు సంబంధించిన అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పనులు చేపడుతామని సునీత అన్నారు. ఇక నుంచి ప్రతి మండలంలోనూ గ్రీవెన్స్ నిర్వహిస్తామని.. ప్రజలు వారి మండలానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. మంగళవారం రోజు కనగానపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
AP Police Holiday: ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం
ఏపీ పోలీసులకు శుభవార్త.. ఈ 2 రోజులు వారికి స్పెషల్ హాలిడే మంజూరు చేసిన ప్రభుత్వం
Padayatra season in Telugu politics: 2027లో ఏపీ, తెలంగాణల్లో ఎటు వైపు చూసినా పాదయాత్రలే - అందరూ చేస్తే ప్రజలు పట్టించుకుంటారా?
2027లో ఏపీ, తెలంగాణల్లో ఎటు వైపు చూసినా పాదయాత్రలే - అందరూ చేస్తే ప్రజలు పట్టించుకుంటారా?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget