అన్వేషించండి

Andhra Pradesh Heat wave: ప్రకాశం జిల్లాలో 47.5 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత, ఆదివారం సైతం తప్పని ఎండ మంట

AP Weather News: ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం నంద్యాలలో 46.4 డిగ్రీలు నమోదు కాగా, శనివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

Temperature in Andhra Pradesh: అమరావతి: దేశంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్నాయి. శుక్రవారం నంద్యాలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలు, కడపలో 46.3 డిగ్రీలు నమోదు కాగా, శనివారం సైతం ఏపీలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అసలే వేసవికాలం అందులోనూ వడగాల్పులు, ఎన్నికల సమయం కావడంతో ప్రజలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. ఆదివారం (మే 5న) 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

మే 7న ఆ జిల్లాల్లో వర్షాలు
మే 6న (సోమవారం నాడు) 15 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 69 వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మే 7న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల తేలికపాటి వర్షం పడుతుందని, ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు గొర్రెల కాపరులు చెట్ల కింద,  బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని పేర్కొన్నారు.

ఆదివారం తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు ఇవే
మే 5వ తేదీన ఏపీలో 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచనున్నాయి. శ్రీకాకుళంలో 4 మండలాలు, విజయనగరంలో 12 మండలాలు, పార్వతీపురం మన్యంలో 13 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఆదివారం వడగాల్పుల తీవ్రత ఉన్న మండలాలు (247):
శ్రీకాకుళం 15  మండలాలు, విజయనగరం 12  మండలాలు, పార్వతీపురం మన్యం 2  మండలాలు, అల్లూరి సీతారామరాజు 5  మండలాలు, విశాఖ 1, అనకాపల్లి 12  మండలాలు, కోనసీమ 1, కాకినాడ 10  మండలాలు, తూర్పు గోదావరి 14  మండలాలలో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు పండ్ల రసాలు, కొబ్బరి బొండం, నిమ్మరసం, మంచినీళ్లు ఎక్కువగా తాగాలని, తలపై టోపీ లాంటివి ధరించడం మంచిదని సూచించారు. 
ఏలూరు 7 మండలాలు, కృష్ణా 5 మండలాలు, ఎన్టీఆర్ 13 మండలాలు, గుంటూరు 14 మండలాలు, పల్నాడు 27 మండలాలు, బాపట్ల 3 మండలాలు, ప్రకాశం 23 మండలాలు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 24 మండలాలు, కర్నూలు 10 మండలాలు, వైయస్సార్ 19 మండలాలు, అన్నమయ్య 10 మండలాలు, తిరుపతి 17  మండలాలు, అనంతపురం 1, శ్రీసత్యసాయి 1, చిత్తూరులో విజయపురం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఏపీలో శనివారం నిప్పులు కురిపించిన భానుడు 
ప్రకాశం జిల్లా దరిమడుగులో రికార్డు స్థాయిలో 47.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లోనూ 45, 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైయస్సార్ జిల్లా కలసపాడులో 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 46.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 45.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా విజయపురిసౌత్ లో 45.4 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 44.9 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, అనంతపురం జిల్లా హుస్సేన్ పురంలో 44.8 డిగ్రీలు, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 44.7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో 14 జిల్లాలో 43 డిగ్రీలు కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. అలాగే  28 మండలాల్లో తీవ్రవడగాల్పులు,187 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

వీలైనంతవరకు ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని అప్రమత్తం చేశారు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget