అన్వేషించండి

మేకప్‌ కోసం బ్యూటీ పార్లర్‌లోకి ఎంట్రీ - లోపల నలుగురు మహిళల కిలాడీ పని! కట్ చేస్తే కటకటాలు

దొంగతనం చేసిన సమయంలో ముగ్గురు మహిళలు బ్యూటీ పార్లల్ లోకి ప్రవేశించారు. మరో మహిళ వారికి సాయం చేసింది. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

మేకప్ చేయించుకోడానికంటూ బ్యూటీపార్లర్ కి వచ్చారు. ఒకరు ఐబ్రోస్, మరొకరు ఫేషియల్, ఇంకొకరు హెయిర్ ట్రీట్ మెంట్.. ఇలా రకరకాల పనులకంటూ ఒకేసారి వచ్చారు. ఒకరికొకరు పరిచయం లేనట్టే నటించారు. హఠాత్తుగా మేకప్ చేసే సమయంలో బ్యూటీపార్లర్ యజమానిపై దాడి చేసి నగలు, నగదు తీసుకుని పారిపోయారు. ఈ కేసుని ఒంగోలు పోలీసులు ఛేదించారు. నలుగురు మహిళలను అరెస్ట్ చేసి వారి వద్ద సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 24గంటల వ్యవధిలోనే కిలేడీలను అరెస్ట్ చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. 

అసలేం జరిగింది..?
ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు మహాలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీకృష్ణ నగర్‌ లో రజియా అనే మహిళ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తుతెలియని మహిళలు బ్యూటీపార్లర్‌ కు వచ్చి తమకు మేకప్ చేయాలని అడిగారు. కాసేపు మేకప్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఓ మహిళ బాత్రూమ్ కి వెళ్లింది. ఈలోగా మిగతా వాళ్లు తమ స్కెచ్ అమలు చేశారు. బాత్రూమ్ నుంచి వచ్చిన మహిళ నేరుగా బ్యూటీషియన్ మొహంపై యాసిడ్ పోసింది. మిగతా వాళ్లు ఆమెపై మత్తుమందు చల్లారు. బ్యూటీపార్లర్ లో ఉంచిన నగదు దొంగతనం చేశారు. ఇల్లు, పార్లల్ ఒకే చోట ఉండటంతో.. ఇంట్లోకి ప్రవేశించి నగలు కూడా కాజేశారు. 20 సవర్ల బంగారం, కౌంటర్‌ లో ఉన్న రూ. 40 వేల నగదు తీసుకుని ముగ్గురు మహిళలు పరారయ్యారు.


మేకప్‌ కోసం బ్యూటీ పార్లర్‌లోకి ఎంట్రీ - లోపల నలుగురు మహిళల కిలాడీ పని! కట్ చేస్తే కటకటాలు

సీసీ టీవీ ఫుటేజీతో వేట..
బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు రజియా సుల్తానాపై క్లోరోఫామ్ చల్లడంతో ఆమె నిద్రమత్తులోకి వెళ్లారు. ఈలోగా దొంగతనం చేసి పారిపోయారు మహిళలు. ఆమె మత్తునుంచి తేరుకుని చుట్టుపక్కలవారికి విషయం తెలిపింది. వారు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ ముగ్గురు, ఆమెకు సహకరించిన మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 

ముగ్గురు కాదు నలుగురు..
దొంగతనం చేసిన సమయంలో ముగ్గురు మహిళలు బ్యూటీ పార్లల్ లోకి ప్రవేశించారు. అయితే మరో మహిళ వారికి సాయం చేసింది. బ్యూటీపార్లల్ కింద వేచి చూస్తూ వారికి ఫోన్లో ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చింది. దొంగతనం పూర్తవగానే అందరూ కలసి పారిపోవడానికి సాయం చేసింది. కేసులోని అన్ని కోణాలు పరిశీలించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.40వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ప్రెస్ మీట్ లో వివరాలు తెలియజేశారు. 

ముండ్రు లక్ష్మీ నవత అలియాస్‌ నవ్య, కరణం మోహన దీప్తి అలియాస్‌ దీప్తి, అళహరి అపర్ణ, దాసరి భాను అలియాస్‌ షాహెరా భాను అనే
నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టపగలే దొంగలు ధైర్యంగా ఈ దోపిడీకి పాల్పడ్డారు, వారి ప్లాన్ అమలైనా చివరకు కటకటాల పాలయ్యారు. ఈ నలుగురు నిందితుల్లో ముండ్రు నవ్య, కరణం దీప్తి, మరో ఇద్దరు యువకులపై పాత కేసులు ఉన్నాయి. ఓ పార్టుమెంటులో వృద్ధురాలిని నిర్భంధించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న కేసులో వారు పాత నేరస్థులు. ఒంటరి మహిళలు, వృద్ధులను గుర్తించి, వారిని బెదిరించి నగలు, నగదు దోచుకోవడం వీరి పనిగా పోలీసులు పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget