అన్వేషించండి

YSRCP: నెల్లూరులో వైసీపీ చేజారిన మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంటేరు రాజీనామా

Andhra News: నెల్లూరులో కీలక నేతలంతా వైసీపీని వీడిపోతుండటం గమనార్హం. సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీని వదిలి బయటకు పోవడం ఇక్కడ మరో విశేషం. 

Nellore YSRCP News: ఏపీ మొత్తం పరిస్థితి ఎలా ఉన్నా.. నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. రెండ్రోజులుగా భవిష్యత్ కార్యాచరణకోసం అనుచరులతో చర్చలు జరుపుతున్న ఆయన, ఈరోజు తన నిర్ణయం ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

పదేళ్లు వైసీపీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, సీనియర్ ని అయిన తనను హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు వంటేరు. ఆత్మాభిమానం చంపుకొని ఉండలేకే రాజీనామా చేశానన్నారు. గతంలో కావలి, ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం తాను పనిచేశానని చెప్పారు వంటేరు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీనుంచి బయటకు వచ్చిన తర్వాత ఉదయగిరి సీటుకోసం వంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రయత్నించారు. ఓ దశలో ఆయన్ను ఇన్ చార్జ్ గా కూడా ప్రకటించారనే ప్రచారం జరిగింది. అయితే చివరకు ఆ సీటు మేకపాటి కుటుంబానికే సీఎం జగన్ కేటాయించారు. దీంతో వంటేరు అలకబూనారు. ఇప్పటి వరకు ఆయన పార్టీతో కాస్త దూరంగానే ఉన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి రావడంతో ఆయన వెంట చాలామంది నేతలు తెలుగుదేశంలోకి క్యూ కట్టారు. కాస్త ఆలస్యంగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీని వీడారు. ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. 

కావలి నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వంటేరు వేణుగోపాల్ రెడ్డి. కొత్త తరం వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. వైసీపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. గత రెండు ఎన్నికల్లో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో వైసీపీకోసం పనిచేశారు వంటేరు. అలాంటి కీలక నేత ఇప్పుడు వైసీపీని వీడటం ఆ పార్టీకి నష్టం అనే చెప్పాలి. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తాన్నారాయన. అయితే ఆయన టీడీపీలోకి వెళ్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

నెల్లూరులో వైసీపీకి కష్టమే..
గత ఎన్నికల్లో నెల్లూరు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఇప్పుడు కనీసం సగానికి సగం సీట్లు గెలవడం కష్టంగా కనపడుతోంది. కీలక నేతలంతా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా, అందులో ఇద్దరు ఇప్పుడు టీడీపీ తరపున అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరినా, ఆయనకు చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి కూడా టీడీపీలో చేరారు.. ఆయన వెంట రూప్ కుమార్ యాదవ్ సహా మరికొందరు కీలక నేతలు వైసీపీని వదిలి చంద్రబాబు జట్టులో చేరారు. 

నెల్లూరులో వైసీపీ బలహీనపడుతుందేన ఉద్దేశంతోనే ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు సీఎం జగన్. విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత వైసీపీలో కాస్త కదలిక వచ్చినా ఏమేరకు పార్టీ కోలుకుంటుందో వేచి చూడాలి. మొత్తమ్మీద నెల్లూరులో కీలక నేతలంతా వైసీపీని వీడిపోతుండటం గమనార్హం. సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీని వదిలి బయటకు పోవడం ఇక్కడ మరో విశేషం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget