అన్వేషించండి

YSRCP: నెల్లూరులో వైసీపీ చేజారిన మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంటేరు రాజీనామా

Andhra News: నెల్లూరులో కీలక నేతలంతా వైసీపీని వీడిపోతుండటం గమనార్హం. సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీని వదిలి బయటకు పోవడం ఇక్కడ మరో విశేషం. 

Nellore YSRCP News: ఏపీ మొత్తం పరిస్థితి ఎలా ఉన్నా.. నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కీలక నేతలంతా పార్టీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తాజాగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. రెండ్రోజులుగా భవిష్యత్ కార్యాచరణకోసం అనుచరులతో చర్చలు జరుపుతున్న ఆయన, ఈరోజు తన నిర్ణయం ప్రకటించారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

పదేళ్లు వైసీపీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, సీనియర్ ని అయిన తనను హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు వంటేరు. ఆత్మాభిమానం చంపుకొని ఉండలేకే రాజీనామా చేశానన్నారు. గతంలో కావలి, ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం తాను పనిచేశానని చెప్పారు వంటేరు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీనుంచి బయటకు వచ్చిన తర్వాత ఉదయగిరి సీటుకోసం వంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రయత్నించారు. ఓ దశలో ఆయన్ను ఇన్ చార్జ్ గా కూడా ప్రకటించారనే ప్రచారం జరిగింది. అయితే చివరకు ఆ సీటు మేకపాటి కుటుంబానికే సీఎం జగన్ కేటాయించారు. దీంతో వంటేరు అలకబూనారు. ఇప్పటి వరకు ఆయన పార్టీతో కాస్త దూరంగానే ఉన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి రావడంతో ఆయన వెంట చాలామంది నేతలు తెలుగుదేశంలోకి క్యూ కట్టారు. కాస్త ఆలస్యంగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీని వీడారు. ఆయన టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. 

కావలి నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వంటేరు వేణుగోపాల్ రెడ్డి. కొత్త తరం వచ్చిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. వైసీపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. గత రెండు ఎన్నికల్లో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో వైసీపీకోసం పనిచేశారు వంటేరు. అలాంటి కీలక నేత ఇప్పుడు వైసీపీని వీడటం ఆ పార్టీకి నష్టం అనే చెప్పాలి. అన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు అందుతున్నాయని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తాన్నారాయన. అయితే ఆయన టీడీపీలోకి వెళ్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

నెల్లూరులో వైసీపీకి కష్టమే..
గత ఎన్నికల్లో నెల్లూరు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఇప్పుడు కనీసం సగానికి సగం సీట్లు గెలవడం కష్టంగా కనపడుతోంది. కీలక నేతలంతా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా, అందులో ఇద్దరు ఇప్పుడు టీడీపీ తరపున అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరినా, ఆయనకు చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి కూడా టీడీపీలో చేరారు.. ఆయన వెంట రూప్ కుమార్ యాదవ్ సహా మరికొందరు కీలక నేతలు వైసీపీని వదిలి చంద్రబాబు జట్టులో చేరారు. 

నెల్లూరులో వైసీపీ బలహీనపడుతుందేన ఉద్దేశంతోనే ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు సీఎం జగన్. విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత వైసీపీలో కాస్త కదలిక వచ్చినా ఏమేరకు పార్టీ కోలుకుంటుందో వేచి చూడాలి. మొత్తమ్మీద నెల్లూరులో కీలక నేతలంతా వైసీపీని వీడిపోతుండటం గమనార్హం. సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీని వదిలి బయటకు పోవడం ఇక్కడ మరో విశేషం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget