అన్వేషించండి

Nellore Politics: నెల్లూరు జిల్లాలో పొలిటికల్ మర్డర్, జిల్లాలో రాజకీయాల్లో సంచలనం!

Nellore Political Murder: నెల్లూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరు ప్రాణం కోల్పోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Nellore News In Telugu: నెల్లూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరు ప్రాణం కోల్పోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయ సంచలనంగా మారింది. దాడికి పాల్పడినవారు వైసీపీ వారని, హత్యకు గురైన వ్యక్తి టీడీపీ నాయకుడని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇవి వ్యక్తిగత గొడవలని వీటికి రాజకీయ రంగు పులమొద్దని చెబుతున్నారు. 

అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం ముసునూరు ఆటోనగర్‌ లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన హత్య సంచలనంగా మారింది. ఆటోనగర్ కు చెందిన పుల్లా సుబ్బారెడ్డి, సురేష్‌ కుటుంబాల మధ్య చీటీ పాటల విషయంలో వివాదాలు ఉన్నాయి. చీటీపాట డబ్బులు అడ్జస్ట్ మెంట్ చేయడంలో ఇరు కుటుంబాలకు మధ్య గొడవలు ఏర్పడ్డాయి. సురేష్ కి సుబ్బారెడ్డి చీటీపాట డబ్బులు బాకీ ఉన్నాడని తెలుస్తోంది. పలుమార్లు సుబ్బారెడ్డిని ఈ డబ్బుల విషయంలో హెచ్చరించినా అతడు తిరిగి చెల్లించలేదు. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు కూడా సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల విషయంపై నిలదీశారు. సుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో సుబ్బారెడ్డి కక్షగట్టి సురేష్ కుటుంబంపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. 

సుబ్బారెడ్డి వైసీపీ..
పదే పదే డబ్బుల విషయంలో ఒత్తిడి తేవడంతో సుబ్బారెడ్డి తన బంధువైన చలంచర్ల విజయ్‌ రెడ్డితో కలిసి సురేష్‌ ఇంటిపై దాడికి వెళ్లాడు. కత్తులతో తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. హతుడు సురేష్ టీడీపీ సానుభూతిపరుడని అంటున్నారు. హంతకుడు సుబ్బారెడ్డి అతని బంధువులు వైసీపీనాయకులనే ప్రచారం జరుగుతోంది. డబ్బులకోసం జరిగిన హత్య అని అంటున్నా.. దీనికి రాజకీయ రంగు పులుముకోవడం సంచలనంగా మారింది. 

అద్దెకు ఉన్న కారణంగా..
ఈ దాడి ఘటనలో సురేష్ అక్కడికక్కడే మరణించగా, అతడిని కాపాడే క్రమంలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ముగ్గురు సురేష్ ఇంటిలో అద్దెకు ఉండేవారు కావడం విశేషం. సురేష్ కి చెందిన భవనంలో అద్దెకు ఉంటున్న శ్రీనివాసులు, సుష్మ, సుధాకర్‌ దాడి ఘటన తెలియగానే వారించే ప్రయత్నం చేశారు. సురేష్ పై దాడిని అడ్డుకునేందుకు బయటకు వచ్చారు. అయితే కత్తులతో వచ్చినవారు సురేష్ తోపాటు ఆ ముగ్గురిపై కూడా విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో దాడిలో వారికి కూడా గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

కావలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని అంటున్నారు పోలీసులు. అయితే హత్య చేసిన వారు వైసీపీకి చెందిన నేతలు కావడంతో పోలీసులు కావాలనే వారిని తప్పించారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా ఈ హత్యపై స్పందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు కావలి వస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఇది ముమ్మాటికీ పొలిటికల్ మర్డర్ అంటున్నారు. కావాలని టీడీపీ నేతని టార్గెట్ చేసి హతమార్చారని, దీనికి ఆస్తి వివాదం, చీటీ పాటల వివాదం అని కారణాలు చెబుతున్నారని మండిపడుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
Embed widget