అన్వేషించండి

Nellore Politics: నెల్లూరు జిల్లాలో పొలిటికల్ మర్డర్, జిల్లాలో రాజకీయాల్లో సంచలనం!

Nellore Political Murder: నెల్లూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరు ప్రాణం కోల్పోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Nellore News In Telugu: నెల్లూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరు ప్రాణం కోల్పోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయ సంచలనంగా మారింది. దాడికి పాల్పడినవారు వైసీపీ వారని, హత్యకు గురైన వ్యక్తి టీడీపీ నాయకుడని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇవి వ్యక్తిగత గొడవలని వీటికి రాజకీయ రంగు పులమొద్దని చెబుతున్నారు. 

అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం ముసునూరు ఆటోనగర్‌ లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన హత్య సంచలనంగా మారింది. ఆటోనగర్ కు చెందిన పుల్లా సుబ్బారెడ్డి, సురేష్‌ కుటుంబాల మధ్య చీటీ పాటల విషయంలో వివాదాలు ఉన్నాయి. చీటీపాట డబ్బులు అడ్జస్ట్ మెంట్ చేయడంలో ఇరు కుటుంబాలకు మధ్య గొడవలు ఏర్పడ్డాయి. సురేష్ కి సుబ్బారెడ్డి చీటీపాట డబ్బులు బాకీ ఉన్నాడని తెలుస్తోంది. పలుమార్లు సుబ్బారెడ్డిని ఈ డబ్బుల విషయంలో హెచ్చరించినా అతడు తిరిగి చెల్లించలేదు. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు కూడా సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల విషయంపై నిలదీశారు. సుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో సుబ్బారెడ్డి కక్షగట్టి సురేష్ కుటుంబంపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. 

సుబ్బారెడ్డి వైసీపీ..
పదే పదే డబ్బుల విషయంలో ఒత్తిడి తేవడంతో సుబ్బారెడ్డి తన బంధువైన చలంచర్ల విజయ్‌ రెడ్డితో కలిసి సురేష్‌ ఇంటిపై దాడికి వెళ్లాడు. కత్తులతో తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. హతుడు సురేష్ టీడీపీ సానుభూతిపరుడని అంటున్నారు. హంతకుడు సుబ్బారెడ్డి అతని బంధువులు వైసీపీనాయకులనే ప్రచారం జరుగుతోంది. డబ్బులకోసం జరిగిన హత్య అని అంటున్నా.. దీనికి రాజకీయ రంగు పులుముకోవడం సంచలనంగా మారింది. 

అద్దెకు ఉన్న కారణంగా..
ఈ దాడి ఘటనలో సురేష్ అక్కడికక్కడే మరణించగా, అతడిని కాపాడే క్రమంలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ముగ్గురు సురేష్ ఇంటిలో అద్దెకు ఉండేవారు కావడం విశేషం. సురేష్ కి చెందిన భవనంలో అద్దెకు ఉంటున్న శ్రీనివాసులు, సుష్మ, సుధాకర్‌ దాడి ఘటన తెలియగానే వారించే ప్రయత్నం చేశారు. సురేష్ పై దాడిని అడ్డుకునేందుకు బయటకు వచ్చారు. అయితే కత్తులతో వచ్చినవారు సురేష్ తోపాటు ఆ ముగ్గురిపై కూడా విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో దాడిలో వారికి కూడా గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

కావలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని అంటున్నారు పోలీసులు. అయితే హత్య చేసిన వారు వైసీపీకి చెందిన నేతలు కావడంతో పోలీసులు కావాలనే వారిని తప్పించారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా ఈ హత్యపై స్పందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు కావలి వస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఇది ముమ్మాటికీ పొలిటికల్ మర్డర్ అంటున్నారు. కావాలని టీడీపీ నేతని టార్గెట్ చేసి హతమార్చారని, దీనికి ఆస్తి వివాదం, చీటీ పాటల వివాదం అని కారణాలు చెబుతున్నారని మండిపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
YSRCP Nellore Politics: నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget