అన్వేషించండి

Nellore Politics: నెల్లూరు జిల్లాలో పొలిటికల్ మర్డర్, జిల్లాలో రాజకీయాల్లో సంచలనం!

Nellore Political Murder: నెల్లూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరు ప్రాణం కోల్పోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Nellore News In Telugu: నెల్లూరు జిల్లాలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిలో ఒకరు ప్రాణం కోల్పోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయ సంచలనంగా మారింది. దాడికి పాల్పడినవారు వైసీపీ వారని, హత్యకు గురైన వ్యక్తి టీడీపీ నాయకుడని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇవి వ్యక్తిగత గొడవలని వీటికి రాజకీయ రంగు పులమొద్దని చెబుతున్నారు. 

అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం ముసునూరు ఆటోనగర్‌ లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన హత్య సంచలనంగా మారింది. ఆటోనగర్ కు చెందిన పుల్లా సుబ్బారెడ్డి, సురేష్‌ కుటుంబాల మధ్య చీటీ పాటల విషయంలో వివాదాలు ఉన్నాయి. చీటీపాట డబ్బులు అడ్జస్ట్ మెంట్ చేయడంలో ఇరు కుటుంబాలకు మధ్య గొడవలు ఏర్పడ్డాయి. సురేష్ కి సుబ్బారెడ్డి చీటీపాట డబ్బులు బాకీ ఉన్నాడని తెలుస్తోంది. పలుమార్లు సుబ్బారెడ్డిని ఈ డబ్బుల విషయంలో హెచ్చరించినా అతడు తిరిగి చెల్లించలేదు. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు కూడా సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల విషయంపై నిలదీశారు. సుబ్బారెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో సుబ్బారెడ్డి కక్షగట్టి సురేష్ కుటుంబంపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. 

సుబ్బారెడ్డి వైసీపీ..
పదే పదే డబ్బుల విషయంలో ఒత్తిడి తేవడంతో సుబ్బారెడ్డి తన బంధువైన చలంచర్ల విజయ్‌ రెడ్డితో కలిసి సురేష్‌ ఇంటిపై దాడికి వెళ్లాడు. కత్తులతో తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. హతుడు సురేష్ టీడీపీ సానుభూతిపరుడని అంటున్నారు. హంతకుడు సుబ్బారెడ్డి అతని బంధువులు వైసీపీనాయకులనే ప్రచారం జరుగుతోంది. డబ్బులకోసం జరిగిన హత్య అని అంటున్నా.. దీనికి రాజకీయ రంగు పులుముకోవడం సంచలనంగా మారింది. 

అద్దెకు ఉన్న కారణంగా..
ఈ దాడి ఘటనలో సురేష్ అక్కడికక్కడే మరణించగా, అతడిని కాపాడే క్రమంలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ ముగ్గురు సురేష్ ఇంటిలో అద్దెకు ఉండేవారు కావడం విశేషం. సురేష్ కి చెందిన భవనంలో అద్దెకు ఉంటున్న శ్రీనివాసులు, సుష్మ, సుధాకర్‌ దాడి ఘటన తెలియగానే వారించే ప్రయత్నం చేశారు. సురేష్ పై దాడిని అడ్డుకునేందుకు బయటకు వచ్చారు. అయితే కత్తులతో వచ్చినవారు సురేష్ తోపాటు ఆ ముగ్గురిపై కూడా విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో దాడిలో వారికి కూడా గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

కావలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని అంటున్నారు పోలీసులు. అయితే హత్య చేసిన వారు వైసీపీకి చెందిన నేతలు కావడంతో పోలీసులు కావాలనే వారిని తప్పించారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా ఈ హత్యపై స్పందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు కావలి వస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఇది ముమ్మాటికీ పొలిటికల్ మర్డర్ అంటున్నారు. కావాలని టీడీపీ నేతని టార్గెట్ చేసి హతమార్చారని, దీనికి ఆస్తి వివాదం, చీటీ పాటల వివాదం అని కారణాలు చెబుతున్నారని మండిపడుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget