By: ABP Desam | Updated at : 27 Apr 2022 07:06 PM (IST)
ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా విక్రమ్ రెడ్డి!
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు వస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడటానికంటే ముందే అభ్యర్థిని ఖరారు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. మేకపాటి కుటుంబానికే ఆత్మకూరు వైసీపీ టికెట్ ఇస్తారని గతంలో ప్రచారం జరిగింది. గౌతమ్ రెడ్డి భార్య శ్రీ కీర్తి రెడ్డికి అవకాశమిస్తారని అనుకున్నా.. చివరకు మేకపాటి కుటుంబం.. గౌతమ్ సోదరుడు విక్రమ రెడ్డిని రాజకీయాల్లోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న విక్రమ్ రెడ్డి ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రేపు అధికారికంగా ఖరారు..
మేకపాటి కుటుంబం విక్రమ్ రెడ్డి పేరు ఖరారు చేసింది. కానీ పార్టీ తరపున ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కనీసం విక్రమ్ రెడ్డి, జగన్ని కలసిన దాఖలాలు కూడా లేవు. ఈ కార్యక్రమానికి మహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి రేపు(గురువారం) సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. రాజమోహన్ రెడ్డితోపాటు, ఆయన తనయుడు విక్రమ్ రెడ్డి కూడా జగన్తో భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత జగన్ నేరుగా అభ్యర్థి పేరుని ప్రకటించే అవకాశముంది.
సజ్జలతో చర్చలు..
విక్రమ్ రెడ్డి పేరు ఖరారు చేసే విషయంలో కూడా మేకపాటి కుటుంబంతో పలు దఫాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించినట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కూడా ఈ విషయమై చర్చించారు. చివరిగా మేకపాటి కుటుంబ సభ్యులంతా విక్రమ్ రెడ్డికే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ఏకాభిప్రాయాన్ని సీఎం జగన్ ముందు ఉంచబోతున్నారు. జగన్ వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని విక్రమ్ రెడ్డి పేరు ఖరారు చేయబోతున్నారు.
విక్రమ్ రెడ్డి ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కన్ స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత.. వారి కుటుంబ సంస్థ కేఎంసీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తున్నారు.
పోటీ అనివార్యమేనా..?
గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆయనను అజాత శత్రువంటూ అన్ని పార్టీల నేతలు ఆకాశానికెత్తేశారు. అన్ని పార్టీల నేతలు ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు, మేకపాటి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. అయితే ఎన్నికలు వస్తే మాత్రం ఇప్పుడు పోటీ అనివార్యంగా మారింది. ఇప్పటికే బీజేపీ తాము పోటీలో ఉంటామని చెప్పింది. బీజేపీ తరపున టికెట్ వచ్చినా, రాకపోయినా తాను మాత్రం పోటీలో ఉంటానని మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే టీడీపీ ఇక్కడ పోటీకి దూరంగా ఉండే అవకాశముంది. దివంగత నేత కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చారు కాబట్టి.. టీడీపీ తన ఆనవాయితీ ప్రకారం పోటీకి దూరంగా ఉండొచ్చు. బీజేపీతోపాటు, మైనార్టీలకు చెందిన మరో పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో దిగేందుకు అవకాశముంది. మొత్తమ్మీద ఏపీలో త్వరలో ఉపఎన్నికల వేడి మొదలు కాబోతోంది.
Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!
Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్, ఆత్మకూరు ఉపఎన్నిక కోసం పగడ్బందీ ఏర్పాట్లు
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న
Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!