అన్వేషించండి

నెల్లూరులో లొంగిపోయిన మహిళా మావోయిస్ట్

మహిళా మావోయిస్ట్ రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాల్ లక్ష్మి నెల్లూరు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డుని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

మహిళా మావోయిస్ట్ రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాల్ లక్ష్మి నెల్లూరు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఆమె వయసు 59 సంవత్సరాలు. భర్త మరణం తర్వాత తీవ్ర కుంగుబాటుకి లోనైన రాజేశ్వరి పోలీసుల ముందు లొంగిపోయారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డుని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

ఎవరీ రాజేశ్వరి..?

రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాస్ లక్ష్మి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం దళంలో ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. సీపీఐ ఎంఎల్, PWG (మావోయిస్టు), తూర్పు DVC తదితర దళాల్లో ఆమె పనిచేశారు. ఆమె స్వగ్రామం గుంటూరు మండలంలోని తాడికొండ. రాజమండ్రి, విశాఖ జిల్లాల్లో డెన్ కీపర్ గా ఉన్నారు. మావోయిస్టుల మీటింగ్ లకు, ఆర్థిక అవసరాలకు, వైద్య అవసరాలకు ఆమె తోడ్పాటునందించారు. మావోయిస్ట్ లు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఆమె వారికి ఆశ్రయం ఇచ్చేవారు.


నెల్లూరులో లొంగిపోయిన మహిళా మావోయిస్ట్

1974లో రామోజు నరేంద్ర అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు రాజేశ్వరి. అప్పటికే నరేంద్ర అలియాస్ సుబ్బన్న గుంటూరులో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో పనిచేసేవారు. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి మండలం సత్యవోలు అగ్రహారం. రాడికల్ యూత్ లీగ్ కార్యక్రమాల్లో ఇరువురు పనిచేస్తున్నప్పుడు వారికి పరిచయం అయింది, ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. 1984 లో మావోయిస్ట్ భావాలకు ప్రభావితం అయిన రాజేశ్వరి దళంలో చేరారు. తన ఇద్దరి పిల్లల్ని హాస్టల్ లో వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

ముందుగా భార్యా భర్తలిద్దరూ డెన్ కీపర్లుగా పనిచేసేవారు. కాంపౌండర్లుగా ఉంటూ మావోయిస్ట్ లకు ఆశ్రయం కల్పించేవారు. దళ సభ్యులకు, నాయకులకు వైద్య సహాయం అందించేవారు. 15-12-1987 లో భారీగా ఆయుధాలు కలిగి ఉన్న రాజేశ్వరిని మొదటిసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు మరో ఐదుగురుని కూడా కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

రాజేశ్వరిని విడిపించిన నక్సల్స్..

రాజేశ్వరి అరెస్ట్ తర్వాత నక్సల్స్ గుర్తేడు ప్రాంతం లో 8మంది ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేశారు. వారిని విడిచిపెట్టాలంటే రాజేశ్వరిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. చివరకు రాజేశ్వరితోపాటు మిగతా ఐదుగురిని కూడా పోలీసులు విడిచి పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్లను నక్సల్స్ చెరనుంచి విడిపించుకున్నారు.

రాజేశ్వరిపై  తూర్పు గోదావరి,ఏజన్సీ ఏరియాలో  అడ్డ తీగల, గండవరం తదితర పోలీసు స్టేషన్ లలో 10 క్రిమినల్  కేసులు ఉన్నాయి. 2018 లో భర్త మరణంతో రాజేశ్వరి తీవ్ర కుంగుబాటుకు లోనైనట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు గతంలో పనిచేసిన చాలామంది ఇప్పటికే లొంగిపోయారు. వయసు రీత్యా, అనారోగ్య కారణాలతో ఆమె చివరకు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఎదుట లొంగిపోయారు. ఆమెపై రివార్డుగా ఉంచిన 4 లక్షల రూపాయల నగదుని ప్రభుత్వం ఆమెకే అప్పగించింది. చట్ట ప్రకారం ఇతర సౌకర్యాలను కూడా ఆమెకు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎస్పీ విజయరావు. రాజేశ్వరి లొంగిపోయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget