అన్వేషించండి

Jaganannaku chebudam: సీఎం జగన్ దగ్గరే పంచాయితీ, రేపే ప్రారంభం - ప్రజలకు ప్రభుత్వం ఆఫర్!

రేపటినుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అధికారికంగా మొదలవుతుంది. 1902 హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి తమ సమస్యలను చెప్పుకోవాలి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సీఎం జగన్ కి వినిపిస్తారు అధికారులు.

వాళ్లకీ వీళ్లకీ కాదు, ఇక నేరుగా జగనన్నకే చెబుదామంటున్నారు ఏపీ ప్రజలు. అవును.. వారికీ వీరికీ మీ సమస్యలు చెప్పి విసిగిపోయారా..? నేరుగా సీఎం జగన్ కే చెప్పండి అంటూ ప్రభుత్వం కూడా ప్రజలకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఆ కార్యక్రమం పేరు జగనన్నకే చెబుతాం. మే-9(రేపటి) నుంచి అధికారికంగా ఈ కార్యక్రమం మొదలవుతుంది. 

అసలేంటీ కార్యక్రమం..
ఇప్పటి వరకూ జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో సచివాలయాల్లో, మండల స్థాయిలో తహశీల్దార్ ఆఫీసుల్లో, ఆర్డీవో ఆఫీసుల్లో, జిల్లా స్థాయిలో కలెక్టరేట్లలో అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు. అధికారులకు చెప్పినా పరిష్కారం కాని సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి చేరవేయడమే జగనన్నకు చెబుదాం. దీనికోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేపట్టి, ఫైనల్ గా మే-9నుంచి పట్టాలెక్కిస్తున్నారు. 

ఇటీవల అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం జగన్ జగనన్నకు చెబుదాం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని చెప్పారు. స్పందనకు మరింత మెరుగైన రూపం ఇదని అన్నారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే దీని లక్ష్యం అని వివరించారు. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ ని అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం అని అధికారులకు చెప్పారు జగన్. 

ఫైనల్ గా జగన్ దగ్గరకు పంచాయితీ..
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు. ప్రభుత్వం పరిష్కరించే సమస్యలు మరో ఎత్తు. ఏళ్ల తరబడి చాలామంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతుంటారు. కొన్నిటికి పరిష్కారం ఉండదని తెలిసినా వారు ప్రయత్నాలు మాత్రం ఆపరు. ఇలాంటి వాటిల్లో ఇటీవల చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం చూపారు జగన్. ఇలాంటి సమస్యలన్నిటికీ అధికారులు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతోటే స్పందన కార్యక్రమం రూపొందించారు. ఈ స్పందనల్లో కూడా పరిష్కారం కాని సమస్యలు చివరిగా జగనన్నకు చెబితే పరిష్కారం కావాల్సిందే. అలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 

రేపటినుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అధికారికంగా మొదలవుతుంది. ప్రభుత్వం కేటాయించిన 1902 హెల్ప్ లైన్ నెంబర్ కి ప్రజలు కాల్ చేసి తమ సమస్యలను చెప్పుకోవాలి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సీఎం జగన్ కి వినిపిస్తారు అధికారులు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి, ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేసే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌ లైన్‌ ద్వారా సమస్యలను తెలుసుకుంటారు. వాటిని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి. గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అనేది ఇందులో చాలా ముఖ్యం. ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. జగనన్నకు చెబుదాం అనే ప్రయోగం ఫలిస్తే ఎన్నికల వేళ అది వైసీపీకి మరింత మైలేజీ ఇస్తుందని తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget