అన్వేషించండి

Jaganannaku chebudam: సీఎం జగన్ దగ్గరే పంచాయితీ, రేపే ప్రారంభం - ప్రజలకు ప్రభుత్వం ఆఫర్!

రేపటినుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అధికారికంగా మొదలవుతుంది. 1902 హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి తమ సమస్యలను చెప్పుకోవాలి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సీఎం జగన్ కి వినిపిస్తారు అధికారులు.

వాళ్లకీ వీళ్లకీ కాదు, ఇక నేరుగా జగనన్నకే చెబుదామంటున్నారు ఏపీ ప్రజలు. అవును.. వారికీ వీరికీ మీ సమస్యలు చెప్పి విసిగిపోయారా..? నేరుగా సీఎం జగన్ కే చెప్పండి అంటూ ప్రభుత్వం కూడా ప్రజలకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఆ కార్యక్రమం పేరు జగనన్నకే చెబుతాం. మే-9(రేపటి) నుంచి అధికారికంగా ఈ కార్యక్రమం మొదలవుతుంది. 

అసలేంటీ కార్యక్రమం..
ఇప్పటి వరకూ జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో సచివాలయాల్లో, మండల స్థాయిలో తహశీల్దార్ ఆఫీసుల్లో, ఆర్డీవో ఆఫీసుల్లో, జిల్లా స్థాయిలో కలెక్టరేట్లలో అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు. అధికారులకు చెప్పినా పరిష్కారం కాని సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి చేరవేయడమే జగనన్నకు చెబుదాం. దీనికోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేపట్టి, ఫైనల్ గా మే-9నుంచి పట్టాలెక్కిస్తున్నారు. 

ఇటీవల అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం జగన్ జగనన్నకు చెబుదాం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని చెప్పారు. స్పందనకు మరింత మెరుగైన రూపం ఇదని అన్నారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే దీని లక్ష్యం అని వివరించారు. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ ని అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం అని అధికారులకు చెప్పారు జగన్. 

ఫైనల్ గా జగన్ దగ్గరకు పంచాయితీ..
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒక ఎత్తు. ప్రభుత్వం పరిష్కరించే సమస్యలు మరో ఎత్తు. ఏళ్ల తరబడి చాలామంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతుంటారు. కొన్నిటికి పరిష్కారం ఉండదని తెలిసినా వారు ప్రయత్నాలు మాత్రం ఆపరు. ఇలాంటి వాటిల్లో ఇటీవల చుక్కల భూముల సమస్యలకు పరిష్కారం చూపారు జగన్. ఇలాంటి సమస్యలన్నిటికీ అధికారులు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతోటే స్పందన కార్యక్రమం రూపొందించారు. ఈ స్పందనల్లో కూడా పరిష్కారం కాని సమస్యలు చివరిగా జగనన్నకు చెబితే పరిష్కారం కావాల్సిందే. అలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 

రేపటినుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అధికారికంగా మొదలవుతుంది. ప్రభుత్వం కేటాయించిన 1902 హెల్ప్ లైన్ నెంబర్ కి ప్రజలు కాల్ చేసి తమ సమస్యలను చెప్పుకోవాలి. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసి సీఎం జగన్ కి వినిపిస్తారు అధికారులు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి, ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేసే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌ లైన్‌ ద్వారా సమస్యలను తెలుసుకుంటారు. వాటిని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి. గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అనేది ఇందులో చాలా ముఖ్యం. ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. జగనన్నకు చెబుదాం అనే ప్రయోగం ఫలిస్తే ఎన్నికల వేళ అది వైసీపీకి మరింత మైలేజీ ఇస్తుందని తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget