అన్వేషించండి

Nara Lokesh: తమిళనాడులో లోకేశ్ ఎన్నికల ప్రచారం, రెండు రోజులు అక్కడే

AP News: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూర్ ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. రెండు రోజుల పాటు లోకేశ్ తమిళనాడు పర్యటన సాగనుంది.

Nara Lokesh Tamilnadu Tour: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి కావడంతో తమిళనాడుకు చెందిన బీజేపీ విభాగం.. అక్కడి తెలుగు వారి కోసం నారా లోకేశ్ ను ఆహ్వానించింది. తమిళనాడులో కాస్త ఎక్కువగా తెలుగు వారు ఉండడం వల్ల ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులకు మద్దతుగా నారా లోకేశ్ తో బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. అందుకోసం లోకేశ్ గురువారం (ఏప్రిల్ 11) మధ్యాహ్నం దాటాక కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లోకేశ్ కోయంబత్తూరుకు వెళ్లారు.

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతుగా నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు ఎక్కువగా స్థిరపడిన వారు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో నారా లోకేశ్ ప్రచారం చేయడం ద్వారా వారిని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదీకాక కోయంబత్తూర్ సీటును ఎన్డీయే కూటమి చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్నామలై తరపున దేశ వ్యాప్తంగా ఉన్న పేరెన్నికగన్న బీజేపీ నేతలు, ఎన్డీయే పక్షాల లీడర్లు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలోనే లోకేశ్ కూడా అన్నామలైకు మద్దతుగా ఏప్రిల్ 11, 12 తేదీల్లో కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

తొలి రోజు ఏప్రిల్ 11న రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో నారా లోకేశ్ పాల్గొనబోతున్నారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్‌లో అక్కడి తెలుగు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశం కానున్నారు. అన్నామలైని గెలిపించాలని వారిని కోరనున్నారు. ఆ తర్వాత కోయంబత్తూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత మామూలుగా మంగళగిరి నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నారా లోకేశ్ పాల్గొనబోతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update:  డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజ‌యం.. రాజ‌స్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
Medchal Latest News: బెట్టింగ్ వ్యసనంగా మారింది, వదులుకోలేకపోత్తున్నా- స్నేహితుడికి సోమేష్‌ చేసిన ఆఖరి ఫోన్‌కాల్ ఇదే!
బెట్టింగ్ వ్యసనంగా మారింది, వదులుకోలేకపోత్తున్నా- స్నేహితుడికి సోమేష్‌ చేసిన ఆఖరి ఫోన్‌కాల్ ఇదే!
Revanth Reddy: ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
ఉపఎన్నికలు రానే రావు - అసెంబ్లీలో రేవంత్ కీలక ప్రకటన
Honda SP 125 Bike EMI : ఒకసారి హోండా SP 125 బైక్ ట్యాంక్ ఫుల్ చేస్తే  700 కి.మీ.లు ఆగాల్సిన పనిలేదు! కొనడానికి ఎంత EMI చెల్లించాలి?
ఒకసారి హోండా SP 125 బైక్ ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కి.మీ.లు ఆగాల్సిన పనిలేదు! కొనడానికి ఎంత EMI చెల్లించాలి?
Embed widget