అన్వేషించండి

Byreddy sabari On Jagan: జగన్‌కు ప్రజలు కుర్చీ మడత పెట్టారు - వైరల్ అవుతున్న బైరెడ్డి శబరి పార్లమెంట్ ప్రసంగం

Nandyala MP: పార్లమెంట్‌లో జగన్ పాలనపై బైరెడ్డి శబరి చేసిన స్పీచ్ వైరల్ అవుతోంది. రాజ్యాంగ ఉల్లంఘనలతో జరిగిన పాలన చూడలేక ప్రజలు కుర్చీమడత పెట్టారని ఆమె తెలిపారు.

Byreddy Sabari speech on Jagan rule in Parliament is going viral: రాజ్యాంగంపై పార్లమెంట్ లో  ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పలువురు ఎంపీలు రాజ్యాంగ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్ లో చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది.జగన్ ఐదేళ్ల పాలనపై ఆమె అనర్గళంగా ప్రసంగించారు. ఆ పాలన చూడలేక ప్రజలు జగన్ కుర్చీని మడత పెట్టి పంపించారని ఆమె సెటైర్ వేయడంతో సభ కూడా మార్మోగిపోయింది. 

జగన్ పాలనలో ఐదేళ్లు రాష్ట్రానికి  అబ్సెసివ్ క్రిమినల్ డిజార్డర్                       

2019-2024 మధ్య పాలనలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఓసీడీ తో ఏపీ బాధపడిందన్నారు. ఓసీడీ అంటే..  అబ్సెసివ్ క్రిమినల్ డిజార్డర్ తో  వైసీపీ నేతలు చేసిన అరాచకాలతో ప్రజలు బాధపడ్డారన్నారు.  వైసీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో రాజ్యాంగంలో ఉన్న ప్రతి చాప్టర్ ను ఉల్లంఘించారని.. ప్రతి ఒక్క పౌరుడి హక్కులను కాలరాశారని గుర్తు చేశారు.  మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసి మూడు ప్యాలెస్‌లు నిర్మించుకున్నారు.  విపరీతంగా అవినీతి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.       

Also Read  : సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్

రాజ్యాంగంలోని ప్రతి సెక్షన్ ను ఉల్లంంఘించిన వైసీపీ ప్రభుత్వం                          

ఎన్నికల ప్రక్రియను కూడా అపహాస్యం చేసేందుకు ప్రయత్నించారని పదిహేను లక్షలకుపైగా ఫేక్ ఓటర్లను చేర్పించిటన్లుగా ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా ఏకపక్షంగా నిర్వహించుకుని రాజ్యాంగ హక్కులను కాలరాశారని అన్నారు. అలాగే రాజ్యాంగం ప్రకారం గ్రామాలకు వచ్చిన నిధుల్ని కూడా మళ్లించారని గుర్తు చేశారు. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను కూడా కల్పించకుండా వేధించారన్నారు. బైరెడ్డిశబరి తన స్పీచ్‌లో వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారో ప్రతి సెక్షన్ ను ఉదహరిస్తూ చెప్పడంతో పలువురు సభ్యులు బల్లలు చరిచి అభినందించారు.                       

Also Read: YSRCP: ఆ ఎన్నికలనూ బహిష్కరించిన వైసీపీ - ఇక ఐదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు - మరి క్యాడర్ ఉంటుందా ?

స్పీచ్‌లో చివరిగా.. ఇవన్నీ భరించలేక జగన్మోహన్ రెడ్డిని కుర్చీ మడత పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు ఇంటికి పంపించేశారని తెలుగులోనే చెప్పారు. బైరెడ్డి శబరి కర్నూలు జిల్లాలో పైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా ఆమె పనితీరు కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Telangana Inter Results 2025 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025 ఎప్పుడంటే?
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025 ఎప్పుడంటే?
Embed widget