అన్వేషించండి

Anam On Minister Roja : తిరుమల ప్రొటోకాల్ దర్శనం టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి రోజా, ఆనం సంచలన ఆరోపణలు

Anam On Minister Roja : మంత్రి రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రోజా గెలిచే ప్రసక్తే లేదన్నారు.

Anam On Minister Roja : మంత్రి రోజా మీద సెటైర్లు వేశారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి. రోజా గురించి తాను నగరి నియోజకవర్గం మొత్తం మీద ప్రజాభిప్రాయం సేకరించానని, వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో రోజా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. విజయపురం మండలం, పాతార్కాడు, కోసల నగరం గ్రామాల్లో దాదాపు వందల ఎకరాల భూమిని రోజా కబ్జా చేశారని ఆరోపించారు. నిండ్ర మండలంలోని షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చారని, గాలేరు - నగరి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీల్లో  ఒక్కటంటే ఒక్కటి కూడా మంత్రి రోజా పూర్తి చేయలేదని విమర్శించారు. మంత్రి రోజా పేరెత్తితే నగరి ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. మంత్రి రోజా సాక్ష్యాత్తు ఏడు కొండల వేంకటేశ్వర స్వామినే ప్రోటోకాల్ టికెట్ల రూపంలో అమ్ముకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నెలకొకసారి దుబాయ్, కువైట్ వెళ్లే కారణమేమిటో చెప్పాలని ఆనం వెంకటరమణ రెడ్డి ప్రశ్నించారు.   

డ్యాన్స్ లో తగ్గేదేలే 

"మంత్రి రోజా డ్యాన్స్ లో తగ్గేదేలే. మా రోజా అక్క చెప్పులు మోసే స్టేజ్ నుంచి చెప్పులు మోయించే స్టేజ్ కు వచ్చారు. ఎంత కష్టబడ్డారో చెప్పండి. అదంతా సీఎం జగన్ పుణ్యమే. గాలేరు-నగరి ప్రాజెక్టు కోసం ఒక తట్ట మట్టి కూడా తవ్వలేదు మంత్రి రోజా. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నగరి నియోజకవర్గంలో ప్రజలు మంత్రి రోజా గురించి  చెబుతున్నారు. ముందు మీ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించుకోండి. మిగిలిన ఒకటిన్నర సంవత్సరం అయినా నగరి ప్రజలకు ఏమైనా చేయండి. ఊరు మొత్తం తిరిగా ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించలేదు. లోకేశ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. రోజా పద్మావతి కాలేజీలో హెచ్ఈపీ చదివారు. ఈ మధ్య మంత్రి రోజా తిరుమల వెంకటేశ్వరరావు దర్శనానికి పదే పదే వెళ్తున్నారు. ఎందుకా అని ఆరా తీస్తే ప్రొటోకాల్ దర్శనం కూడా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసింది." - ఆనం వెంకటరమణ రెడ్డి

ఉద్యోగితో చెప్పులు మోయించిన మంత్రి రోజా! 

 మంత్రి రోజా ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. సూర్యలంక బీచ్ సందర్శనకు వెళ్లిన ఆమె కాసేపు సరదగా గడిపారు. మంత్రికి పర్యాటక రిసార్ట్స్ వద్ద అధికారులు వెల్కమ్ చెప్పి బీచ్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సరదాగా నీటిలో దిగి ఫొటోలు దిగారు మంత్రి రోజా. ఆ సమయంలో తన చెప్పులను బయట విడిచిపెట్టివెళ్లారు. ఆ సమయంలో పర్యాటకశాఖకు చెందిన ఓ చిరు ఉద్యోగి మంత్రి రోజా చెప్పులు మోసుకెళ్లారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి రోజా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో ఇటీవల సందడి చేశారు. అయితే ఆ సమయంలో తన చెప్పుల్ని బయటవిడిచి, వాటిని జాగ్రత్తగా చూడాలని వ్యక్తిగత సిబ్బందికి సైగ చేశారు. దీంతో రిసార్ట్స్ ఉద్యోగి మంత్రి చెప్పులను తడిసిపోకుండా చేతితో పట్టుకుని మంత్రిని ఫాలో అయ్యారు. కొద్దిసేపు చేత్తో మోసిన అనంతరం పక్కన పెట్టారు. మంత్రి రోజా నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కాళ్ల దగ్గర పెట్టారు. ఇలా ఉద్యోగి చెప్పులు మోయటం వివాదాస్పదం అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతిపక్షపార్టీలు కూడా మంత్రి రోజా లక్ష్యంగా విమర్శలు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget