అన్వేషించండి

Nara Lokesh: ఈ నెల 9న బిగ్ అనౌన్స్‌మెంట్ - మంత్రి నారా లోకేశ్ సంచలన ట్వీట్

Andhra News: ఈ నెల 9న (బుధవారం) 'బిగ్ అనౌన్స్‌మెంట్' అంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అని ఉత్కంఠ నెలకొంది.

Minister Nara Lokesh Sensational Tweet: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మంగళవారం సంచలన ట్వీట్ చేశారు. ఈ నెల 9న 'బిగ్ అనౌన్స్‌మెంట్' అంటూ ప్రకటించారు. టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశం అద్భుతంగా జరిగిందంటూ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం చేయబోయే భారీ ప్రకటన కోసం వేచి చూడాలంటూ ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ప్రకటన వెలవడుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

పెట్టుబడులపై చర్చ

కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేశ్ భేటీ కావడం ఇది రెండోసారి. ఆగస్ట్ 16వ తేదీన సీఎం చంద్రబాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చిన ఆయనతో లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, ప్రోత్సాహకాలను వివరించారు. ప్రధానంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రెన్యువబుల్ ఎనర్జీ, టెలీ కమ్యూనికేషన్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అన్ని వనరులన్నాయని.. పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. దీనికి సహకరించే అన్ని రకాల పరిశ్రమలకు తాము మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. 

ఏపీలో పెట్టుబడులకు తాము సుముఖంగా ఉన్నామని.. పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోసారి కలుస్తామని చంద్రశేఖరన్ అప్పట్లో లోకేశ్‌తో భేటీలో వెల్లడించారు. తాజాగా, మళ్లీ వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టుబడులపైనే బుధవారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకేశ్ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. 'టీసీఎస్ కంపెనీకి, ఏపీ ప్రజలకు కంగ్రాట్స్'.. 'ఎక్స్‌లెంట్.. రేపటి కోసం వేచి చూస్తున్నాం.' 'రాష్ట్రాభివృద్ధి కోసం తండ్రి ఢిల్లీలో.. కొడుకు అమరావతిలో..' అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

మరోవైపు, సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో విధ్వంసం గురించి ప్రధానికి వివరించినట్లు చెప్పారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆయన అక్కడి మీడియాతో మంగళవారం మాట్లాడారు. 'స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి వివరించా. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కోరాం. రాష్ట్రంలో జాతీయ రహదారుల పెండింగ్ పనుల పూర్తి, కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ రాయితీ గురించి ప్రధానికి వివరించాను.' అని సీఎం పేర్కొన్నారు.

అలాగే, డిసెంబర్ నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభమవుతాయని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ రైల్వే జోన్‌కు భూమి కేటాయించామని.. రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఫోర్ లైన్లు వేయాలని రైల్వే మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. అమరావతి నుంచి విజయవాడకు రైల్వే లైన్, మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైన్ కనెక్ట్ చేయాలని కోరామని అన్నారు. నర్సాపురం -  మచిలీపట్నం, రేపల్లె - బాపట్ల లైన్లు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.

Also Read: Chandrababu Delhi : ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వరుసగా కేంద్రమంత్రులతో భేటీలు - ఏపీకి కొత్తగా ఆమోదింపచేసుకున్న ప్రాజెక్టులు ఇవే

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Embed widget