అన్వేషించండి

సోషల్ మీడియా పోస్ట్ లపై మహిళా కమిషన్ సమావేశం - టీడీపీ, జనసేన ఎంట్రీతో రచ్చ

AP women commission: సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు వ్యవహరం పై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆద్వర్యాన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు.

AP women commission: సోషల్ మీడియా పోస్ట్ లపై మహిళా కమిషన్ నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. కమిషన్ అధికారికంగా నిర్వహించిన సమావేశం వద్దకు తెలుగు దేశం, జనసేన నేతలు హజరు కావటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

సోషల్ మీడియా పోస్ట్ లపై రచ్చ...
సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు వ్యవహరం పై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆద్వర్యాన విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అయితే ఈ సదస్సుకు తెలుగు దేశం, జనసేనకు చెందిన మహిళా నాయకుల కూడ హజరయ్యారు. తమకు ఆహ్వనం ఉన్నందునే సదస్సుకు హజరు అయ్యాయని, తెలుగు దేశం , జనసేన నేతలు చెబుతుండగా, కమీషన్ కు చెందిన అదికారులు మాత్రం నో ఎంట్రీ చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకొని పక్కకు పంపేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్దితి ఏర్పడింది. రాష్ట్రంలో సోషల్ మీడియా ను అడ్డుకొని, అసభ్య పరంగా పోస్ట్ లు పెడుతున్నారని తెలుగు మహిళలు మండిపడ్డారు. మరోవైపు ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ జోక్యం చేసుకొని మహిళలను సమావేశంలోకి పిలిపించారు. తెలుగు మహిళలు, జనసేన వీరమహిళల నుండి వినతి పత్రం స్వీకరించారు.

ప్రతి శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినం... 
 ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినంగా పాటిస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియాలో రాతియుగం కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలే మహిళల పై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, రాజకీయ కారణాలతో  కొందరు ప్రోత్సహించటం  దారుణమన్నారు. మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మహిళలను కించపరుస్తున్న వారి భరతం పట్టాలని, ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం  ఉందన్నారు.  సోషల్ మీడియాలో కొందరు ముసుగు వేసుకుని ఇష్టారీతిన  మహిళల పై  అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు.  మహిళల పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, అసభ్యకరంగా ప్రవర్తించినా దిశ, సైబర్ మిత్ర తదితర యాప్ ల ద్వారా పోలీస్  సహాయం పొందాలని సూచించారు. ఇలాంటి సంఘటనల పై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాని ఛైర్ పర్సన్ పిలుపునిచ్చారు.  

రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించి అన్ని అవకాశాలు కల్పిస్తుంటే, కొందరు దుర్భుద్దితో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టడం బాధగా ఉందని ఛైర్ పర్స్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కావాలనే రాజకీయ ఉద్దేశంతో అడ్డుకోవటం పై ఆమె అసహనం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ల ద్వార మహిళల స్వావలంభన సాధ్యం అవుతుందని, అన్నారు. దశాబ్దాలుగా మహిళల పై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఇంటా, బయటా మహిళలు మనోధైర్యం కల్పించేందుకు కమీషన్ బాద్యతగా వ్యవహరిస్తుందని అన్నారు.

నేనే ఇబ్బంది పడ్డా...
రాజకీయాల్లో ఉన్న మహిళల గురించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాల పై   మహిళా కమిషన్  కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కోరారు.  ఇటీవల  తాను కూడా  సోషల్ మీడియా వేధింపులకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  అసత్య కథనాలు , అసభ్యకరమైన పోస్టులు పెట్టటం వలన మహిళల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. సోషల్ మీడియా వేధింపులపై  జిల్లా కలెక్టర్ ను కలిసి  ఫిర్యాదు చేశామని మేయర్ తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు!
Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి
Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు
BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?
Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Hyderabad Latest News: హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫార్మ్ ప్లాట్లు కొని మోసపోకండి-  హైడ్రా హెచ్చరిక 
హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫార్మ్ ప్లాట్లు కొని మోసపోకండి-  హైడ్రా హెచ్చరిక 
Telangana Ration Card Latest News : కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tuni Municipality Vice Chairman: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.