అన్వేషించండి

Chandrababu On Ysrcp Govt : వైసీపీ మూడేళ్ల పాలనలోనే ఏపీని వల్లకాడు చేశారు : చంద్రబాబు

Chandrababu On Ysrcp Govt : వైసీపీ మూడేళ్ల పాలనలో వందల మంది టీడీపీ కార్యకర్తలను వేధించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు తమ బాధలు చెప్పుకునే వీలులేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

Chandrababu On Ysrcp Govt : వైసీపీ అధికారంలోకి వచ్చాక 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మూడేళ్ల పాలనలోనే ఏపీని వల్లకాడు చేశారని విమర్శించారు. ప్రజలు తమ బాధలు చెప్పుకునే వీలులేకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వారి బాధలు చెప్పుకునేందుకు వీలులేకుండా వారి నోళ్లను నొక్కి పెట్టారన్నారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, చాలా మంది హత్యలకు గురయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, నాలుగు వేలకు పైగా గ్రామస్థాయి నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. నలుగురు మాజీ మంత్రులను, ఆరుగురు నేతలను తప్పుడు కేసుల్లో అరెస్టులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మరో 60 మంది టీడీపీ నేతలను కేసుల పేరుతో వేధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 

క్విట్ జగన్ సేవ్ ఏపీ ఎగ్జిబిషన్

వైసీపీ నేతల అవినీతి, అకృత్యాలకు మూడేళ్లలో చాలా మంది చనిపోయారని చంద్రబాబు అన్నారు. క్విట్‌ జగన్‌ సేవ్‌ ఏపీ ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. ప్రజాచైతన్యం కోసమే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాలనతో ఎంతో మంది టీడీపీ నేతలను వేధించారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2,552 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. అలాగే 422 మంది నిరుద్యోగులు మరణించారన్నారు. 291 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 230 మంది నాటుసారాతో మరణించారని, 218 మంది మహిళలు వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. 

అమలాపురం అల్లర్లు అందుకే? 

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీ మారినా పరిస్థితుల్లో మార్పురాలేదన్నారు. పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. ఇప్పటికే ప్రజల్లో పోలీసు వ్యవస్థ చులకనైందని చంద్రబాబు విమర్శించారు. మూడేళ్ల పాలనలో 24 మంది బీసీ నేతల్ని హతమార్చారన్నారు. పల్నాడులో వరుస హత్యలు జరుగుతున్నా పోలీసులకు పట్టదా అని ఆయన నిలదీశారు. నేరస్థులకు వెనుకేసుకోస్తున్న పోలీసులు సిగ్గుపడాలన్నారు. తప్పు చేసిన పోలీసులకు శిక్ష తప్పదన్న చంద్రబాబు వారంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యా్న్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తే తప్ప ఎమ్మెల్సీని అరెస్టు చేయలేదన్నారు. అనంతబాబు చేసిన హత్య నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అమలాపురంలో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు.

ఒక్కొక్కరు చనిపోతున్నారు?

మాజీ మంత్రి వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐకే సమర్ధత లేకపోతే దేశాన్ని ఎవరు కాపాడతారన్నారు. శ్రీనివాసరెడ్డి, గంగాధరరెడ్డి మరణాల మిస్టరీ ఏమిటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లని చంపేస్తారని ముందు నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. ఈ విషయంలో తాము చెప్పినట్లే జరుగుతుందని చంద్రబాబు అన్నారు. వారంతా కరుడుగట్టిన నేరగాళ్లని, పరిటాల రవి విషయంలో ఇలాగే చేశారన్నారు. జగన్‌ అవినీతిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ వేసినా ఏంచేయలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget