అన్వేషించండి

Chandrababu On Ysrcp Govt : వైసీపీ మూడేళ్ల పాలనలోనే ఏపీని వల్లకాడు చేశారు : చంద్రబాబు

Chandrababu On Ysrcp Govt : వైసీపీ మూడేళ్ల పాలనలో వందల మంది టీడీపీ కార్యకర్తలను వేధించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు తమ బాధలు చెప్పుకునే వీలులేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

Chandrababu On Ysrcp Govt : వైసీపీ అధికారంలోకి వచ్చాక 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మూడేళ్ల పాలనలోనే ఏపీని వల్లకాడు చేశారని విమర్శించారు. ప్రజలు తమ బాధలు చెప్పుకునే వీలులేకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వారి బాధలు చెప్పుకునేందుకు వీలులేకుండా వారి నోళ్లను నొక్కి పెట్టారన్నారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, చాలా మంది హత్యలకు గురయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 60 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, నాలుగు వేలకు పైగా గ్రామస్థాయి నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. నలుగురు మాజీ మంత్రులను, ఆరుగురు నేతలను తప్పుడు కేసుల్లో అరెస్టులు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మరో 60 మంది టీడీపీ నేతలను కేసుల పేరుతో వేధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 

క్విట్ జగన్ సేవ్ ఏపీ ఎగ్జిబిషన్

వైసీపీ నేతల అవినీతి, అకృత్యాలకు మూడేళ్లలో చాలా మంది చనిపోయారని చంద్రబాబు అన్నారు. క్విట్‌ జగన్‌ సేవ్‌ ఏపీ ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. ప్రజాచైతన్యం కోసమే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాలనతో ఎంతో మంది టీడీపీ నేతలను వేధించారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2,552 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. అలాగే 422 మంది నిరుద్యోగులు మరణించారన్నారు. 291 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 230 మంది నాటుసారాతో మరణించారని, 218 మంది మహిళలు వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. 

అమలాపురం అల్లర్లు అందుకే? 

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆరోపించారు. డీజీపీ మారినా పరిస్థితుల్లో మార్పురాలేదన్నారు. పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. ఇప్పటికే ప్రజల్లో పోలీసు వ్యవస్థ చులకనైందని చంద్రబాబు విమర్శించారు. మూడేళ్ల పాలనలో 24 మంది బీసీ నేతల్ని హతమార్చారన్నారు. పల్నాడులో వరుస హత్యలు జరుగుతున్నా పోలీసులకు పట్టదా అని ఆయన నిలదీశారు. నేరస్థులకు వెనుకేసుకోస్తున్న పోలీసులు సిగ్గుపడాలన్నారు. తప్పు చేసిన పోలీసులకు శిక్ష తప్పదన్న చంద్రబాబు వారంతా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యా్న్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తే తప్ప ఎమ్మెల్సీని అరెస్టు చేయలేదన్నారు. అనంతబాబు చేసిన హత్య నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అమలాపురంలో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు.

ఒక్కొక్కరు చనిపోతున్నారు?

మాజీ మంత్రి వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐకే సమర్ధత లేకపోతే దేశాన్ని ఎవరు కాపాడతారన్నారు. శ్రీనివాసరెడ్డి, గంగాధరరెడ్డి మరణాల మిస్టరీ ఏమిటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లని చంపేస్తారని ముందు నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. ఈ విషయంలో తాము చెప్పినట్లే జరుగుతుందని చంద్రబాబు అన్నారు. వారంతా కరుడుగట్టిన నేరగాళ్లని, పరిటాల రవి విషయంలో ఇలాగే చేశారన్నారు. జగన్‌ అవినీతిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ వేసినా ఏంచేయలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget