అన్వేషించండి

Lokesh To Delhi: శుక్రవారం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ - మ్యాటర్ సీరియస్సేనా ?

Nara Lokesh: నారా లోకేష్ ప్రధాని మోదీతో భేటీ కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Lokesh meets Prime Minister Modi on Friday: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 5న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మర్యాదపూర్వక భేటీ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది కాలం నుంచి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి పిలుపు వచ్చిందని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మోదీతో భేటీ కాలేదు. ఇతర మంత్రుల్ని కలిసి రాష్ట్ర అంశాలపై మాట్లాడి వచ్చారు.  

గతంలో కుటుంబంతో సహా కలిసిన నారా లోకేష్                  

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీతో లోకేష్ ఓ సారి సమావేశం అయ్యారు. రెండు సార్లు ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ.. నారా లోకేష్‌ను కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చి కలవాలని సూచించారు. ఆ సూచన ప్రకారం గతంలో కుటుంబంతో సహా ప్రధానని కలిశారు. అయితే అప్పట్లో ఆ సమావేశంలో రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించలేదని కేవలం వ్యక్తిగత అంశాలపైనే మాట్లాడారని తెలుస్తోంది. అందుకే ఈ సారి పూర్తిగా పాలనా పరమైన..రాజకీయ సంబంధమైన అంశాలపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.           

గత నెలలో కేంద్ర మంత్రులతో సమావేశాలు -అప్పట్లో మోదీతో భేటీకి కుదరని సమయం            

గత నెలలో ఢిల్లీలో యూనియన్ మంత్రులతో లోకేష్ సమావేశాలు జరిపి, యూరియా కొరత, ప్లాస్టిక్ పార్క్, నిపర్ క్యాంపస్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో రామయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కుప్పం-బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం కోరారు. ఇప్పుడు మోదీతో జరిగే భేటీలో ఈ అంశాలు మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.    వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, విద్యా రంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్లోబల్ స్కిల్స్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది.              

పోలవరం, అమరావతి పురోగతిపై మోదీకి వివరించే అవకాశం

పోలవరం  , అమరావతి నిర్మాణాల పురోగతిని ప్రధాని మోదీకి లోకేష్ వివరించే అవకాశం ఉంది.  మోదీ-లోకేష్ సమావేశం తర్వాత రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు, నిధులు రావచ్చని అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహాయం, రాజకీయ సమన్వయం వంటి కీలక అంశాలపై  ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.  లోకేష్ సెప్టెంబర్ 4 రాత్రి ఢిల్లీకి బయలుదేరి, 5 ఉదయం మోదీతో సమావేశమై, మధ్యాహ్నం అమరావతికి తిరిగి వచ్చి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.          

గత ప్రభుత్వం చేసిన అవినీతిపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను కూడా నారా లోకేష్ ప్రధానికి వివరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Embed widget