అన్వేషించండి

Kadiri News: వైసీపీకి ఎంతో మేలు చేశా, నాకు జగన్ ద్రోహం చేశారు - కదిరి మాజీ ఎమ్మెల్యే కంటతడి

PV Sidda Reddy: వైసీపీ అధిష్ఠానం తనను సస్పెండ్ చేసినందుకు కదిరి మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తాను ఏ ద్రోహం చేయలేదని అన్నారు. పార్టీనే తనకు ద్రోహం చేసిందని విమర్శించారు.

Former MLA PV Sidda Reddy News: వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి తాను ఎప్పుడు ద్రోహం చేయలేదని.. పార్టీనే తనకు ద్రోహం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఇటుక ఇటుక పేర్చి పార్టీని బలోపేతం చేస్తే పార్టీ తనకు సస్పెండ్ అనే బహుమతిని ఇవ్వడం దురదృష్టకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను కదిరిలో ఎమ్మెల్యేగా ఉండగానే తనను కాదని కొత్త ఇన్ ఛార్జిని తీసుకొని వచ్చి అధిష్ఠానం తనను అవమానపరిచిందని అన్నారు. అధికారులకు తాను ఫోన్ చేస్తే పలకవద్దని అధికారులను కొందరు పార్టీ పెద్దలు కట్టడి చేశారని పార్టీ అధిష్టానం మీద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ తనకు నేరుగా చెప్పి ఉండి ఉంటే నేను తప్పులను సరిచేసుకునే వాడిన అన్నారు. కొంతమంది వెధవలు డబ్బు కోసం పదవుల కోసం పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. మక్బూల్ వద్ద రూ.10 కోట్లు తీసుకొని అతణ్ని ఓడించారని వారిని పార్టీ గుర్తించలేదన్నారు. రేపటి నుంచి తన రాజకీయం మళ్లీ మొదలవుతుందని.. తాను ఏంటో చూపిస్తానని అన్నారు. ఏ పార్టీలో చేరాలన్నది తమ ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సిద్ధారెడ్డి వెల్లడించారు.

 వైసీపీ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సస్పెండ్

వైఎస్ఆర్సిపి పార్టీ నేత కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు కీలక నాయకులను వైసిపికి వ్యతిరేకంగా పనిచేసినట్లు అధిష్టానం గుర్తించింది. 

తెలుగుదేశం పార్టీతో ఒప్పందాలు కుదుర్చుకొని వైసీపీ అభ్యర్థుల ఓటమి లక్ష్యంగా పనిచేసినట్లు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలోనే తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పై వేటు పడింది. త్వరలోనే మరి కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసిపి పార్టీలో కొంతమందిపై అధిష్టానం గుర్రుగా ఉంది. దీంతో పార్టీలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉపేక్షించదని డైరెక్ట్ గానే సంకేతాలను అయితే పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

 గత ఎన్నికల్లో కదిరి వైసీపీ అభ్యర్థిగా మక్బూల్ బాషా

రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారన్న సర్వే రిపోర్ట్ తో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వ్యక్తులను అభ్యర్థులుగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూ వచ్చాడు. ఇందులో భాగంగానే కదిరి నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాదని ముస్లిం మైనార్టీ కి చెందిన మక్బూల్ భాషకు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆయన వర్గం మక్బూల్ బాషాకు సహకరించలేదని ఒక ప్రచారం జరిగింది. వీటన్నింటి పైన మక్బూల్ బాషా వర్ధన్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులను జారీ చేశారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSKCSK vs SRH Match Highlights IPL 2025  | చెన్నై పై గెలిచి ఆశలు మిగుల్చుకున్న సన్ రైజర్స్CSK vs SRH Match preview IPL 2025 | ఆరుకు ఆరు మ్యాచ్ లు గెలవాలి..ఓడితే ఇక ఇంటికే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
IPL 2025 SRH VS CSK Result Update: చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
చేపాక్ కోట బద్దలు.. చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Embed widget