అన్వేషించండి

AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు

AP Pension Distribution | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లుకు వెళ్లిన సీఎం చంద్రబాబు స్వయంగా లబ్దిదారులకు పింఛన్ అందజేశారు.

Andhra Pradesh CM Chandrababu distributes pensions at Nemakallu in Anantapur district | రాయదుర్గం: ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెలకుగానూ పింఛన్ల పంపిణీని ముందుగానే ప్రారంభించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ (NTR Bharosa Pension Scheme) పంపిణీ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నెమకల్లుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులైన రుద్రమ్మ ఇంటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా అందజేశారు. అధికారులు బయోమెట్రిక్ తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నాక, సీఎం చంద్రబాబు పింఛన్ నగదు రూ.4000 అందజేశారు. రుద్రమ్మతో మాట్లాడి ఆమె కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది పిల్లలున్నారు, ఏం చేస్తు్న్నారని పింఛన్ లబ్ధిదారు అయిన పెద్దావిడను అడిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే తమకు ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. 


AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు

అనంతరం ఆ ప్రాంతంలో చిన్నారులతో సరదాగా కాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటనకు 500 మంది పోలీసు సిబ్బందితో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడ గ్రామసభ నిర్వహించనున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో కేవలం నేమకల్లు గ్రామస్తులు మినహా ఇతరులను అనుమతించడం లేదని ఎస్పీ జగదీష్ తెలిపారు. సీఎం చంద్రబాబు పొల్గొంటున్న గ్రామసభకు ప్రజలు హాజరుకావాలని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఆహ్వానించారు. గ్రామస్తులు మొత్తం సీఎం చంద్రబాబు పాల్గొన్న గ్రామసభకు హాజరయ్యారు. చంద్రబాబు లబ్ధిదారులకు వృద్ధాప్య, దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తున్నారు.

ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ ప్రారంభం

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తోంది. సెప్టెంబర్ నెల పింఛన్ ను ఆగస్టు 31న ప్రారంభించారు. లబ్దిదారులకు ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి డిసెంబర్ పింఛన్లను అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం నేమకల్లులో చంద్రబాబు స్వయంగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. 

ఏపీలో 28 విభాగాలలో లబ్దిదారులకు పెన్షన్.. 
ఏపీలో మొత్తం 28 విభాగాలలో లబ్దిదారులకు ప్రభుత్వం పెన్షన్ నగదు పంపిణీ చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ 1 నుంచి వృద్దులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు,కళా కారులు, మత్స్య కారులు, ట్రాన్స్ జెండర్స్ కు రూ.4000 పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తుంది. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి రూ.15000కి పింఛన్ లభిస్తుంది.  

Also Read: Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget