అన్వేషించండి

AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు

AP Pension Distribution | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లుకు వెళ్లిన సీఎం చంద్రబాబు స్వయంగా లబ్దిదారులకు పింఛన్ అందజేశారు.

Andhra Pradesh CM Chandrababu distributes pensions at Nemakallu in Anantapur district | రాయదుర్గం: ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెలకుగానూ పింఛన్ల పంపిణీని ముందుగానే ప్రారంభించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ (NTR Bharosa Pension Scheme) పంపిణీ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నెమకల్లుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులైన రుద్రమ్మ ఇంటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా అందజేశారు. అధికారులు బయోమెట్రిక్ తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నాక, సీఎం చంద్రబాబు పింఛన్ నగదు రూ.4000 అందజేశారు. రుద్రమ్మతో మాట్లాడి ఆమె కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది పిల్లలున్నారు, ఏం చేస్తు్న్నారని పింఛన్ లబ్ధిదారు అయిన పెద్దావిడను అడిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే తమకు ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. 


AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు

అనంతరం ఆ ప్రాంతంలో చిన్నారులతో సరదాగా కాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటనకు 500 మంది పోలీసు సిబ్బందితో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడ గ్రామసభ నిర్వహించనున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో కేవలం నేమకల్లు గ్రామస్తులు మినహా ఇతరులను అనుమతించడం లేదని ఎస్పీ జగదీష్ తెలిపారు. సీఎం చంద్రబాబు పొల్గొంటున్న గ్రామసభకు ప్రజలు హాజరుకావాలని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఆహ్వానించారు. గ్రామస్తులు మొత్తం సీఎం చంద్రబాబు పాల్గొన్న గ్రామసభకు హాజరయ్యారు. చంద్రబాబు లబ్ధిదారులకు వృద్ధాప్య, దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తున్నారు.

ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ ప్రారంభం

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తోంది. సెప్టెంబర్ నెల పింఛన్ ను ఆగస్టు 31న ప్రారంభించారు. లబ్దిదారులకు ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి డిసెంబర్ పింఛన్లను అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం నేమకల్లులో చంద్రబాబు స్వయంగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. 

ఏపీలో 28 విభాగాలలో లబ్దిదారులకు పెన్షన్.. 
ఏపీలో మొత్తం 28 విభాగాలలో లబ్దిదారులకు ప్రభుత్వం పెన్షన్ నగదు పంపిణీ చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ 1 నుంచి వృద్దులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు,కళా కారులు, మత్స్య కారులు, ట్రాన్స్ జెండర్స్ కు రూ.4000 పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తుంది. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి రూ.15000కి పింఛన్ లభిస్తుంది.  

Also Read: Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Embed widget