అన్వేషించండి

AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు

AP Pension Distribution | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లుకు వెళ్లిన సీఎం చంద్రబాబు స్వయంగా లబ్దిదారులకు పింఛన్ అందజేశారు.

Andhra Pradesh CM Chandrababu distributes pensions at Nemakallu in Anantapur district | రాయదుర్గం: ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెలకుగానూ పింఛన్ల పంపిణీని ముందుగానే ప్రారంభించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ (NTR Bharosa Pension Scheme) పంపిణీ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని నెమకల్లుకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులైన రుద్రమ్మ ఇంటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా అందజేశారు. అధికారులు బయోమెట్రిక్ తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నాక, సీఎం చంద్రబాబు పింఛన్ నగదు రూ.4000 అందజేశారు. రుద్రమ్మతో మాట్లాడి ఆమె కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది పిల్లలున్నారు, ఏం చేస్తు్న్నారని పింఛన్ లబ్ధిదారు అయిన పెద్దావిడను అడిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే తమకు ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. 


AP CM Chandrababu: అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు, అనంతరం ఆలయంలో పూజలు

అనంతరం ఆ ప్రాంతంలో చిన్నారులతో సరదాగా కాసేపు మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా నేమకల్లు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నెమకల్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటనకు 500 మంది పోలీసు సిబ్బందితో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడ గ్రామసభ నిర్వహించనున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో కేవలం నేమకల్లు గ్రామస్తులు మినహా ఇతరులను అనుమతించడం లేదని ఎస్పీ జగదీష్ తెలిపారు. సీఎం చంద్రబాబు పొల్గొంటున్న గ్రామసభకు ప్రజలు హాజరుకావాలని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఆహ్వానించారు. గ్రామస్తులు మొత్తం సీఎం చంద్రబాబు పాల్గొన్న గ్రామసభకు హాజరయ్యారు. చంద్రబాబు లబ్ధిదారులకు వృద్ధాప్య, దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తున్నారు.

ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ ప్రారంభం

ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తోంది. సెప్టెంబర్ నెల పింఛన్ ను ఆగస్టు 31న ప్రారంభించారు. లబ్దిదారులకు ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి డిసెంబర్ పింఛన్లను అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం నేమకల్లులో చంద్రబాబు స్వయంగా లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. 

ఏపీలో 28 విభాగాలలో లబ్దిదారులకు పెన్షన్.. 
ఏపీలో మొత్తం 28 విభాగాలలో లబ్దిదారులకు ప్రభుత్వం పెన్షన్ నగదు పంపిణీ చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్ 1 నుంచి వృద్దులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు,కళా కారులు, మత్స్య కారులు, ట్రాన్స్ జెండర్స్ కు రూ.4000 పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తుంది. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి రూ.15000కి పింఛన్ లభిస్తుంది.  

Also Read: Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget