అన్వేషించండి

Kuppam News: కుప్పానికి ఒక్కరోజులోనే నీళ్లు ఆగిపోయాయా? కాలువలోకి దిగి రైతుల నిరసనలు

Kuppam ప్రాంతానికి హంద్రీ - నీవా నీళ్లను సీఎం జగన్ ఉదయం 11 గంటల ప్రాంతంలో వదిలితే.. రాత్రి పదిన్నర కల్లా నీళ్లు నిలిచిపోయాయని రైతులు అంటున్నారు.

Farmers Protest in Kuppam Branch Canal: కుప్పం నియోజకవర్గానికి క్రిష్ణా నీటిని తమ ప్రభుత్వం తీసుకువెళ్లగలిగిందని, తద్వారా అక్కడి రైతుల వ్యవసాయ అవసరాలు తీరతాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం (ఫిబ్రవరి 26) నాటి సభలో చెప్పిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని కుప్పం బ్రాంచి కాలువ (కేబీసీ) పరిధిలోని 110 చెరువులను నింపడం కోసం ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం రామకుప్పం మండలంలోని రాజుపేట నుంచి కుప్పం నియోజకవర్గానికి బటన్‌ నొక్కి నీటిని విడుదల చేశారు. కట్ చేస్తే.. మంగళవారం కుప్పం రైతులు కుప్పం బ్రాంచ్ కెనాల్ లోకి దిగి బైఠాయించి నిరసన తెలిపారు.

కుప్పం ప్రాంతానికి హంద్రీ - నీవా నీళ్లను సీఎం జగన్ ఉదయం 11 గంటల ప్రాంతంలో వదిలితే.. రాత్రి పదిన్నర కల్లా నీళ్లు నిలిచిపోయాయని రైతులు అంటున్నారు. ఎంకే పురం గ్రామస్థులు, టీడీపీ నాయకులతో కలిసి కూర్చొని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. కోట్లాది రూపాయల  ఖర్చుతో జగన్ హెలికాప్టర్ లో వచ్చి, భారీ సభ నిర్వహించి కుప్పంకు నీళ్లు వదిలామని చెప్పుకుంటున్నారని అన్నారు. హంద్రీ - నీవా కాలువను చంద్రబాబు హాయాంలో రూ.400 కోట్లతో 88 శాతం పూర్తి చేస్తే.. జగన్ సర్కారు వచ్చాక గత ఐదేళ్లలో ఏమీ చేయలేదని రైతులు ఆరోపించారు. చంద్రబాబుపై లేనిపోని తప్పులు చెప్పి.. ఆయన్ను తిట్టడానికే భారీ సభ పెట్టారని రైతులు ఆరోపించారు. 

తాత్కాలికంగా గేటు పెట్టి ముందుగానే నిల్వ చేసుకున్న నీటిని వదిలి.. కృష్ణా నీళ్లు కుప్పం వైపు ప్రవహిస్తున్నట్లుగా బహిరంగ సభలో ప్రజలకు కట్టుకథ చెప్పారని రైతులు ఆరోపించారు. సీఎం సాగునీటిని విడుదల చేసిన తర్వాత సోమవారం అర్ధరాత్రికి శాంతిపురం మండలం ఎంకేపురం వరకు కృష్ణా జలాలు రావడమే కష్టంగా ఉందని రైతులు వాపోయారు. మంగళవారం ఉదయానికి అసలక్కడ నీటి ఆనవాళ్లే లేవని.. కాలువలో నీటి చెమ్మ కూడా లేదని చెప్పారు. వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటును మంగళవారం ఉదయమే సిబ్బంది తొలగించారని చెప్పారు. కాలువల్లో నీటి తడి కూడా లేకపోవడంతో స్థానికులు, టీడీపీ వర్కర్లు ఆ కాలువలోకి దిగి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget