అన్వేషించండి

Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్‌ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

Kodi Kathi Srinivas : కోడి కత్తి శీనుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Kodi Kathi Case Telugu News: కోడి కత్తి శీను... రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. 2018లో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో శీను దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ దాడిపై సానుభూతితోనే జగన్ సీఎం అయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఆ తర్వాత శీను ఐదేళ్లపాటు జైల్లో ఉన్నాడు. చివరకు 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఏపీ హైకోర్టు అనుమతితో బెయిల్ పై విడుదలయ్యారు.

బెయిల్ రద్దుకు ఒప్పుకోని సుప్రీంకోర్టు  
 శీనుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్ఐఏ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయించింది. కోడికత్తి శీను బెయిల్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో ఎన్‌ఐఏ టార్గెట్‌గా మారింది. ఇది ఇలా ఉండగా, 2024 ఎన్నికలకు ముందు శీను జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని శీను తెలిపారు. కులతత్వం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. మరోవైపు ఈ కేసులో జగన్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. సీఎం హోదాలో బిజీగా ఉన్న జగన్ విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అలాగే ప్రతిపక్ష నేతగా కూడా లేని జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఖాళీగా ఉన్నందున విచారణకు హాజరవుతారా లేక మరేదైనా కారణంతో యధావిధిగా కోర్టుకు గైర్హాజరవుతారా అనేది చూడాలి.

అసలేం జరిగిందంటే..
 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది.  జగన్ విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు అని విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో పనిచేస్తున్న జనుపెళ్ల శ్రీనువాసరావు సెల్ఫీ దిగేందుకు వైఎస్‌ జగన్‌ వద్దకు వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఘటన అనంతరం జగన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిఫారసు మేరకు కేసును జనవరి 1, 2019న ఎన్ఐఏకి బదిలీ చేశారు. అదే ఏడాది మే 28న నిందితుడికి బెయిల్ మంజూరైంది.

అయితే, ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించడంతో.. బెయిల్‌ను రద్దు చేసింది. రెండు నెలల తర్వాత ఆగస్టు 13న నిందితుడు మళ్లీ జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ జైల్లోనే ఉన్నాడు. రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును 2023 సెప్టెంబర్ 6న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన ఏపీ హై కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి, ఫిబ్రవరి 8న బెయిల్ మంజూరు చేసింది. 
 
టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు  
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్‌ నిరాకరించింది. నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.  2021 అక్టోబరు 19న వైసీపీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్లతో చెలరేగిన పోయిన అల్లరి మూక ఆఫీసులోని ఫర్నీచర్‌తో ఆఫీసు అద్దాలు, కార్లను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయారు. అయితే ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. 

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget