అన్వేషించండి

Kadiri News : రోడ్ల దుస్థితిపై కదిరి ఎమ్మెల్యేకు నిరసన సెగ, తూపల్లిలో ఉద్రిక్తత

Kadiri News : కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి ప్రజాగ్రహం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యే అనుచరులు ప్రజలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

 Kadiri News : కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజలు నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి స్థానికులు సమస్యలపై నిలదీశారు. బురదగుంటల్లా మారిన రోడ్ల పరిస్థితిపై ప్రశ్నించారు. ప్రజలను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ పుట్టపర్తి జిల్లా తూపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి గ్రామస్థులు సమస్యలు ఏకరవు పెట్టారు. తేలికపాటి వానకే వీధులు బురదమయం అవుతున్నాయని వాపోయారు. 

ఎమ్మెల్యేతో వాగ్వాదం 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అధికారులు సత్యసాయి పుట్టపర్తి జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో పర్యటించారు. తేలికపాటి వానకురిస్తే చాలు వీధులన్నీ బురదమయం అవుతున్నాయని, సర్పంచి, ఎంపీటీసీతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి సమస్య తీసుకెళ్తుంటే అడ్డుపడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తాము ఇబ్బందులు పడుతున్నామని, స్థానిక నాయకులు పనులు చేయరు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనీయకపోతే ఎలా అని గ్రామస్థులు నిలదీశారు.

పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం 

ఎమ్మెల్యేను గ్రామస్థులు నిలదీయటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. పంటల బీమా విషయంలో కూడా సచివాలయ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించి రైతులకు అన్యాయం చేశారని మహిళా రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. అర్హులైన వారందరికీ బీమా వర్తింపచేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని,  బీమా అందని వారి నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని వ్యవసాయశాఖ, సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే దృష్టికి రహదారి సమస్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని స్థానికులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి అంబటికి నిరసన సెగ 

వైసీపీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వైసీపీ మంత్రులు, నేతలకు నిరసన సెగలు తప్పడంలేదు. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు కూడా ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ఓ వైపు ప్రభుత్వం పండగలా పింఛన్ అందిస్తున్నామని చెబుతుంటే కొన్ని చోట్ల పింఛన్ విషయంలో ఆందోళనలు ఎదురవుతున్నాయి. తాజాగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అర్హత ఉన్నా తమకు పింఛన్ నిలిపివేశారని మంత్రి అంబటి రాంబాబును ఓ మహిళ నిలదీసింది. తనతో పాటు వికలాంగుడైన తన తమ్ముడికి కూడా పింఛన్ రావట్లేదని ఈ విషయంపై అధికారులికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ప్రశ్నించింది. ఇదేనా పాలన అంటే అని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వాలంటీర్లు ఉద్ధేశపూర్వకంగా తన పింఛన్ ఆపేశారని బాధిత వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై త్వరలోనే న్యాయం చేస్తామని పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చి ఆయన అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Embed widget