అన్వేషించండి

Kadiri News : రోడ్ల దుస్థితిపై కదిరి ఎమ్మెల్యేకు నిరసన సెగ, తూపల్లిలో ఉద్రిక్తత

Kadiri News : కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి ప్రజాగ్రహం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యే అనుచరులు ప్రజలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

 Kadiri News : కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజలు నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి స్థానికులు సమస్యలపై నిలదీశారు. బురదగుంటల్లా మారిన రోడ్ల పరిస్థితిపై ప్రశ్నించారు. ప్రజలను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ పుట్టపర్తి జిల్లా తూపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి గ్రామస్థులు సమస్యలు ఏకరవు పెట్టారు. తేలికపాటి వానకే వీధులు బురదమయం అవుతున్నాయని వాపోయారు. 

ఎమ్మెల్యేతో వాగ్వాదం 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అధికారులు సత్యసాయి పుట్టపర్తి జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో పర్యటించారు. తేలికపాటి వానకురిస్తే చాలు వీధులన్నీ బురదమయం అవుతున్నాయని, సర్పంచి, ఎంపీటీసీతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి సమస్య తీసుకెళ్తుంటే అడ్డుపడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తాము ఇబ్బందులు పడుతున్నామని, స్థానిక నాయకులు పనులు చేయరు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనీయకపోతే ఎలా అని గ్రామస్థులు నిలదీశారు.

పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం 

ఎమ్మెల్యేను గ్రామస్థులు నిలదీయటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. పంటల బీమా విషయంలో కూడా సచివాలయ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించి రైతులకు అన్యాయం చేశారని మహిళా రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. అర్హులైన వారందరికీ బీమా వర్తింపచేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని,  బీమా అందని వారి నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని వ్యవసాయశాఖ, సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే దృష్టికి రహదారి సమస్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని స్థానికులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి అంబటికి నిరసన సెగ 

వైసీపీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వైసీపీ మంత్రులు, నేతలకు నిరసన సెగలు తప్పడంలేదు. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు కూడా ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ఓ వైపు ప్రభుత్వం పండగలా పింఛన్ అందిస్తున్నామని చెబుతుంటే కొన్ని చోట్ల పింఛన్ విషయంలో ఆందోళనలు ఎదురవుతున్నాయి. తాజాగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అర్హత ఉన్నా తమకు పింఛన్ నిలిపివేశారని మంత్రి అంబటి రాంబాబును ఓ మహిళ నిలదీసింది. తనతో పాటు వికలాంగుడైన తన తమ్ముడికి కూడా పింఛన్ రావట్లేదని ఈ విషయంపై అధికారులికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ప్రశ్నించింది. ఇదేనా పాలన అంటే అని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వాలంటీర్లు ఉద్ధేశపూర్వకంగా తన పింఛన్ ఆపేశారని బాధిత వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై త్వరలోనే న్యాయం చేస్తామని పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చి ఆయన అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget