అన్వేషించండి

Kadiri News : రోడ్ల దుస్థితిపై కదిరి ఎమ్మెల్యేకు నిరసన సెగ, తూపల్లిలో ఉద్రిక్తత

Kadiri News : కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి ప్రజాగ్రహం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యే అనుచరులు ప్రజలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

 Kadiri News : కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజలు నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి స్థానికులు సమస్యలపై నిలదీశారు. బురదగుంటల్లా మారిన రోడ్ల పరిస్థితిపై ప్రశ్నించారు. ప్రజలను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ పుట్టపర్తి జిల్లా తూపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి గ్రామస్థులు సమస్యలు ఏకరవు పెట్టారు. తేలికపాటి వానకే వీధులు బురదమయం అవుతున్నాయని వాపోయారు. 

ఎమ్మెల్యేతో వాగ్వాదం 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అధికారులు సత్యసాయి పుట్టపర్తి జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో పర్యటించారు. తేలికపాటి వానకురిస్తే చాలు వీధులన్నీ బురదమయం అవుతున్నాయని, సర్పంచి, ఎంపీటీసీతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి సమస్య తీసుకెళ్తుంటే అడ్డుపడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తాము ఇబ్బందులు పడుతున్నామని, స్థానిక నాయకులు పనులు చేయరు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనీయకపోతే ఎలా అని గ్రామస్థులు నిలదీశారు.

పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం 

ఎమ్మెల్యేను గ్రామస్థులు నిలదీయటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. పంటల బీమా విషయంలో కూడా సచివాలయ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించి రైతులకు అన్యాయం చేశారని మహిళా రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. అర్హులైన వారందరికీ బీమా వర్తింపచేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని,  బీమా అందని వారి నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని వ్యవసాయశాఖ, సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే దృష్టికి రహదారి సమస్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని స్థానికులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి అంబటికి నిరసన సెగ 

వైసీపీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వైసీపీ మంత్రులు, నేతలకు నిరసన సెగలు తప్పడంలేదు. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు కూడా ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ఓ వైపు ప్రభుత్వం పండగలా పింఛన్ అందిస్తున్నామని చెబుతుంటే కొన్ని చోట్ల పింఛన్ విషయంలో ఆందోళనలు ఎదురవుతున్నాయి. తాజాగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అర్హత ఉన్నా తమకు పింఛన్ నిలిపివేశారని మంత్రి అంబటి రాంబాబును ఓ మహిళ నిలదీసింది. తనతో పాటు వికలాంగుడైన తన తమ్ముడికి కూడా పింఛన్ రావట్లేదని ఈ విషయంపై అధికారులికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ప్రశ్నించింది. ఇదేనా పాలన అంటే అని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వాలంటీర్లు ఉద్ధేశపూర్వకంగా తన పింఛన్ ఆపేశారని బాధిత వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై త్వరలోనే న్యాయం చేస్తామని పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చి ఆయన అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget