అన్వేషించండి

KA Paul: చంద్రన్నా, పవన్ తమ్ముడూ కేంద్ర మంత్రి పదవులు వద్దు మనకు -కేఏ పాల్ వ్యాఖ్యలు

AP Special Status : ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ నుంచి ముగ్గురు క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ప్రకటించే వరకు మంత్రి పదవులు చేపట్టవద్దని కేఏ పాల్ కోరారు.

KA Paul : ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఇటు ఎన్డీయే కూటమి ఆదివారం కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోడీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు.  

రెండు చోట్లా డిపాజిట్ గల్లంతు
ఇది ఇలా ఉంటే ఈ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు  కేఏ పాల్ కూడా విశాఖపట్నం పార్లమెంట్, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటిలో దిగిన ఆయనకు 1,700 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఇక్కడ గెలిచారు. విశాఖపట్నం ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసిన ఆయనకు 7,696 (0.55శాతం) ఓట్లు వచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత కేఏ పాల్ ఎన్నికల నిర్వహణ పై సంచలన ఆరోపణలు చేశారు. మోడీ క్యాబినెట్ ఏర్పడనున్న తరుణంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మంచి అవకాశాన్ని పోగొట్టుకున్న చంద్రబాబు, పవన్
కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘నేను ఇచ్చిన సలహా పాటించనందుకు చంద్రబాబు నాయుడు, పవన్ తమ్ముడు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇండియా కూటమితో కలిసి ఉంటే ప్రధాన మంత్రి పదవి దక్కేది, రాష్ట్రానికి  స్పెషల్ స్టేటస్ వచ్చేది, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపగలిగే వాళ్లం.. అన్ని విధాలు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేవి. ఇప్పుడు కుక్కకు రెండు బిస్కెట్లు వేసినట్లు రెండు మంత్రి పదవులు వేశారు బీజేపీ వాళ్లు. వాళ్లకు ఇచ్చింది హెల్త్ మినిస్ట్రీ అంట..  ఆరోగ్యం లేకుండా అందరూ చస్తే మన తెలుగు రాష్ట్రాలకు చెడ్డ పేరు తీసుకురావడానికి కుట్ర పన్నారు. 

వాళ్లు ఫెయిల్ అయ్యారు
కేఏ పాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను చెప్పిన సలహా విని  240 బీజేపీకి ఉన్నప్పుడే మీరు ప్రధాన పదవిని ఇండియా కూటమి తరఫున చేపట్టి ఉంటే ఆ పార్టీ  జైళ్లో ఎలా పెట్టగలుగుతుంది. వాళ్లు నా సలహా తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు.  రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వనంత వరకు రాష్ట్రంలో ఎవరూ మంత్రి పదవులు తీసుకోకూడదు. స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేసిన తర్వాతే మంత్రి పదవులు చేపట్టాలి. స్పెషల్ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే..  రాష్ట్రానికి వేల కంపెనీలు తీసుకు రావడం.. లక్షల ఉద్యోగాలను కల్పించడం. ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేయడం. వాగ్ధానం చేసిన ప్రకారం తెలంగాణాకు కూడా రావాల్సిన నిధులను విడుదల చేయాలి. అప్పుడు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల వారు మంత్రి పదవులు చేపట్టాలి. అప్పటి దాకా తీసుకోకూడదు. 

ఈవీఎం దయతో గెలిచిన పవన్
‘పవన్ తమ్ముడూ బీజేపీ పుణ్యమాని, ఈవీఎంల దయతో గెలిచావు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకు వచ్చి చూపించు. అప్పుడే నువ్వు రియల్ హీరో అవుతావు.. లేదంటే జీరో అవుతావు. మంత్రి పదవులు కాదు కావాల్సింది రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , జగన్ మోహన్ రెడ్డి అందరం కలుద్దాం. స్పెషల్ స్టేటస్ కోసం ధర్నాలు చేద్దాం. మీరంతా నాతో కలవండి.. మోడీకి పాఠం నేర్పుదాం. తెలుగు సత్తా, ఎన్టీఆర్ సత్తా, పీవీ నరసింహా రావు సత్తా దేశానికి చూపిద్దాం. ప్రపంచానికి చాటి చెబుదాం. ఈవీఎంల ద్వారా ఒక్క ఓటు పడకుండా చేస్తే భయపడి పారిపోతాను అనుకున్నారా.. ఖబద్దార్.. తెలుగు సత్తా చూపిద్దాం. ఏ మంత్రి పదవి తీసుకుంటే ఆయనను భాయ్ కాట్ చేయండి. జైల్లో పెడతారా అది నాకు కొత్త కాదు. కలిసి పోరాడుదాం ఆంధ్రాను అభివృద్ధి చేసుకుందాం’ అని కేఏ పాల్ అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP DesamKKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
IPL 2025 GT VS RR Result Update: టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Embed widget